మంత్రి కోమటిరెడ్డితో మహారాష్ట్ర మంత్రి ఆశిష్‌ భేటీ

– సినీ పరిశ్రమ అభివృద్ధి పాలసీ అంశాలపై చర్చ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: మహారాష్ట్ర ఐటీ, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి ఆశిష్‌ శెలార్‌ శుక్రవారం హైదరాబాద్‌ విచ్చేశారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖa మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో సెక్రటేరియట్‌లో భేటీ అయ్యారు. సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలసీ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సినిమా నిర్మాణ రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించిందని, రాచకొండ వంటి ప్రాంతాలు సినిమా షూటింగ్స్‌కు ఎంతో అనువైనవి కోమటిరెడ్డి వివరించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించిన రామోజీ ఫిలిం సిటీలో బాలీవుడ్‌, హాలీవుడ్‌ స్థాయి సినిమాలు నిర్మిస్తారని, హౖాెదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో ఉన్న టూరిజం ప్రాంతాలు సినిమాలు నిర్మించేందుకు ఉత్తమ వేదికలుగా తీర్చిదిద్దుతున్నామని మహారాష్ట్ర మంత్రికి వివరించారు. తెలంగాణను హాలీవుడ్‌స్థాయి ఫిల్మ్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. సినిమా పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాయితీలు, సినీ కార్మికుల సంక్షేమం వంటి ప్రోత్సాహక కార్యక్రమాలకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని, మహారాష్ట్రలో కూడా ఇలాంటివి అమలు చేసేందుకు తెలంగాణ పర్యటనకు వచ్చినట్లు ఆశిష్‌ శెలార్‌ చెప్పారు. మహారాష్ట్ర ఫిల్మ్‌ సిటీని విజిట్‌ చేయాలని మంత్రి కోమటి రెడ్డి ని ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page