జూబ్లీహిల్స్ బరిలో దించండి

– బీజేపీని కోరిన మాధవీలత

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌8: ‌జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదల అవ్వడంతో రాష్ట్ర రాజధానిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రముఖ రాజకీయ పార్టీలు నేతలు జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో ఎవరిని బరిలోకి దించాలా అని చర్చలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేత మాధవీలత జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు సంబంధించి రంగంలోకి దిగారు. బీజేపీ అభ్యర్ధిగా అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిపారు. ఇందుకోసం కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, ఎంపీ డా. లక్ష్మణ్‌ ‌ను కలిసినాట్లు ఆమె తెలిపారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని బీజేపీ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నానని.. ఈ ఉప ఎన్నికలు పార్టీకి చాలా ముఖ్యమైనవని అన్నారు. ప్రజలకు బీజేపీ పట్ల నమ్మకం, ప్రేమ, అభిమానం విపరీతంగా ఉందని మాధవీలత తెలిపారు. తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీల పాలనల వల్ల నష్టం జరిగిందని.. ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. అధిష్ఠానం పరిశీలిస్తున్న అభ్యర్థుల జాబితాలో తన పేరూ ఉందని తెలిసింది. అవకాశం ఇస్తే ఎన్నికల యుద్దానికి సిద్ధంగా ఉంటానని ఆమె స్పష్టం చేశారు. అదేవిధంగా.. అవకాశం రాకపోయినా, ఒక పోలింగ్‌ ‌బూత్‌ ‌బాధ్యతలు ఇచ్చినా సంతోషంగా స్వీకరిస్తాను. గెలుపు కోసం కృషి చేస్తాను. దిల్లీ, వారణాసి, ఝార్ఖండ్‌, ‌మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు కోసం పనిచేశానని తెలిపారు. తన రాజకీయ ప్రయాణం బీజేపీ పెద్దల ఆశీర్వాదం, అభిమానంతోనే కొనసాగుతోందని మాధవీ లత పేర్కొన్నారు. గత 18 నెలలుగా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నానని ఆమె అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page