వైద్య‌ప‌రీక్ష‌ల నిమిత్తం ఎఐజి హాస్పిటల్‌కి కెసిఆర్‌

గ‌త కొంత‌కాలంగా జ‌లుబుతో ఇబ్బంది ప‌డుతున్న బీఆర్ ఎస్ అధినేత‌

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌14‌మాజీ ముఖ్యమంత్రిబీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ‌శ‌నివారం గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌కి వైద్య పరీక్షల కోసం వెళ్లారుఆయ‌న గత కొంత కాలంగా జలుబుతో బాధపడుతున్నారుఆయన వెంట కుటుంబసభ్యులుమాజీ మంత్రి హరీష్‌ ‌రావుతదితరులు ఉన్నారుశుక్రవారం కూడా హాస్పిటల్‌కి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్న కెసిఆర్ శ‌నివారం ‌మరోసారి హాస్పిటల్‌కి వెళ్లారువైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత నందీనగర్‌లోని నివాసానికి వెళ్లనున్నారుఐదు రోజుల పాటు– నందీనగర్‌ ‌నివాసంలో కేసీఆర్‌ ఉం‌డనున్నారుప్రతీ రెండు నెలలకు ఒకసారి కేసీఆర్‌ ‌హాస్పిటల్‌కి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటారు

గతంలో యశోదా హాస్పిటల్‌కి కేసీఆర్‌ ‌తరచుగా వెళ్తుండేవారుయితే ఈసారి గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కి వెళ్లారునిన్న సాయంత్రం ఎర్రవల్లి ఫాంహౌస్‌లోని ఆయన నివాసం నుంచి హైదరాబాద్‌ ‌వచ్చిన కేసీఆర్‌ఏఐజీ హాస్పిటల్‌కి వెళ్లి వైద్యులను సంప్రదించారుమళ్లీ ఈరోజు కూడా రావాల్సిందిగా వైద్యులు సూచించారువైద్యుల సూచనల మేరకు నేడు హాస్పిటల్  వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారుగడిచిన ఏడాదిన్నర కాలంగా కేసీఆర్‌ ఎ‌ర్రవల్లి ఫాంహౌస్‌లోని ఆయన నివాసంలోనే ఉంటున్నారుఅందుబాటులో ఉండాలని వైద్యులు చెప్పిన నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని నందినగర్‌లోనే ఉండనున్నారు

ఇక కాళేశ్వరం కమిషన్‌ ‌విచారణకు ఈనెల 11న మాజీ సీఎం హాజరైన విషయం తెలిసిందేఆ సమయంలో కూడా తనకు జలుబు ఉందని కమిషన్‌ ‌చైర్మన్‌ ‌పీసీ ఘోష్‌కు చెప్పారుఓపెన్‌ ‌కోర్టులో విచారణ వద్దని కేసీఆర్‌ ‌కోరగా  ఆయన వినతిని పరిగణలోకి తీసుకున్న కమిషన్‌ ‌చైర్మన్‌ ‌బహిరంగ విచారణను రద్దు చేశారుఇండోర్‌లోనే కేసీఆర్‌ను కమిషన్‌ ‌ముఖాముఖిగా విచారించిందిఇక అప్పటి నుంచి కూడా అనారోగ్యంతో కేసీఆర్‌ ‌బాధపడు తున్నారుఈ క్రమంలో వైద్యపరీక్షల నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కి మాజీ సీఎం కేసీఆర్‌ ‌వెళ్లారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page