– ప్రజల వద్దకే వెళ్లి వారినే అడుగుతా
– రాజకీయ వేదికగా జాగృతిని తీసుళ్లే ప్రయత్నం!
– జాగృతి జనం బాట పేర కవిత యాత్ర
– పోస్టర్ ఆవిష్కరణలో సంచలన విషయాలు వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబర్ 15: జాగృతి జనం బాట పేరుతో కల్వకుంట్ల కవిత జిల్లాల్లో యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఓ రకంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా జాగృతిని తీసుకుని వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే ఇది బిఆర్ఎస్కు వ్యతిరేకంగా చేస్తున్న దండయాత్రగానే చూడాలి. యాత్రపై మీడియాతో కవిత బుధవారం మాట్లాడుతూ నాలుగు నెలలపాటు యాత్ర ఉంటుందని, ప్రతి జిల్లాల్లో రెండు రోజులు ఉంటామని న్నారు. జిల్లాల్లో ఉన్న అన్ని వర్గాల ప్రజలతో కలిసి మాట్లాడతామని చెప్పారు. జాగృతి జనం బాట పోస్టర్ను కవిత విడుదల చేశారు. పోస్టర్పై తెలంగాణ తల్లి, జయశంకర్ ఫోటోలు ఉన్నాయి. కేసీఆర్ ఫోటో లేకుండానే కవిత పోస్టర్ను విడుదల చేశారు. అంతేకాకుండా కేసీఆర్ ఫోటో తీసేయడానికి కారణాలు కూడా కవిత డియా సమావేశంలో వెల్లడించారు. సామాజిక తెలంగాణ కోసం ఏం చేయాలనే విషయాలను ప్రజల నుండే తెలుసుకుంటామన్నారు. సామాజిక తెలంగాణ అంటే నినాదం కాదు.. విధానమని వివరించారు. తాము ఉన్నన్ని రోజులు సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే గురువులన్నారు. పెద్దపెద్ద నాయకులను కూడా ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోపెట్టారని గుర్తుచేశారు. ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటామని కవిత అన్నారు. కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేస్తామన్నారు కవిత. కేసీఆర్ లేకుండా తెలంగాణ రాలేదని, అయితే కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే నైతికంగా కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. ‘నేను నా తొవ్వ వెతుక్కుంటున్నా’ అని అన్నారు కవిత. జాగృతి పెట్టినప్పుడు కూడా కేసీఆర్ ఫోటో పెట్టలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. జాగృతి పెట్టినప్పుడు జయశంకర్ ఫోటో పెట్టామన్నారు. కేసీఆర్కు పుట్టడం తన అదృష్టమని, ’మా దారులు వేరే అయినప్పుడు నా లైన్ నేను తీసుకోవడం కరెక్ట్’ అని అన్నారు. కేసీఆర్ ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారని, ఆ పార్టీ నుండి తనను సస్పెండ్ చేశారని తెలిపారు. దుర్మార్గుల నుంచి చెట్టును కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశానని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జాగృతి మొదటి నుంచి స్వతంత్రంగా పనిచేసిందని, కేసీఆర్ నుంచి ఒక్క ఆలోచనా తీసుకోలేదన్నారు. తాను బీఆర్ఎస్లో చేరిన తర్వాత పార్టీతో జాగృతి అనుసంధానంగా పనిచేసిందని వివరించారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నామని..సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని వ్యాఖ్యానించారు. సామాజిక తెలంగాణ కోసం మాట్లాడడం తప్పా అని ప్రశ్నించారు. ఏదో తప్పు మాట్లాడినట్టు చూపించి కుట్ర చేసి బయటకి పంపారని మండిపడ్డారు. తన సస్పెన్షన్కు కారణాలను విశ్లేషించుకున్నానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్న రంగం లేదన్నారు. అనేక సమస్యలు తెలంగాణను పట్టి పీడిస్తున్నాయన్నారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారాన్ని పక్కన పెట్టి ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఒక్క రూపాయి కూడా తేలేకపోతున్నారని విమర్శించారు. పది సంవత్సరాల్లో తెచ్చిన ఫలితాలు ఇప్పుడు అందడం లేదని కవిత వ్యాఖ్యలు చేశారు. ’పార్టీ వద్దనుకున్నాక పదవి ఎందుకు.. చాలా క్లారిటీతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా.. ఇప్పటికీ తన రాజీనామాను ఆమోదించడం లేదు. రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ రాజకీయం ఏంటో? పార్టీ పెట్టాలో లేదో ఇప్పటికీ క్లారిటీ లేదు. ప్రజలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను. ప్రజలే గురువులు. కాబట్టి ఏం చేయాలో వారినే అడుగుతా. కేసీఆర్కు మచ్చ రాకుండా ఉండాలనే ప్రయత్నం చేశాను. కానీ నన్ను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దారులు వేసినప్పుడు ధైర్యం ఉండాలి. బనకచర్ల, గోదావరి జలాలు లాంటి అన్ని అంశాలను మాట్లాడుతాం. యూరియా నుండి బస్సుల దాకా అన్ని రంగాల్లో సమస్యలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ చిన్న విషయం. ఉప ఎన్నికతో జాగృతికి సంబంధం లేదు’ అని కవిత స్పష్టం చేశారు.
యాత్ర పోస్టర్ విడుదల
జాగృతి జనం బాట పోస్టర్ను కవిత విడుదల చేశారు. పోస్టర్పై తెలంగాణ తల్లి, జయశంకర్ ఫోటోలు ఉన్నాయి. కేసీఆర్ ఫోటో లేకుండానే పోస్టర్ను విడుదల చేయడం విశేషం. కేసీఆర్ ఫోటో ఉంచకపోవడానికి గల కారణాలు కూడా మీడియా సమావేశంలో ఆమె వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





