రైతుల ఆకాంక్షలు నెర వేర్చేందుకు కృషి..

  • సంక్షేమానికి, సంస్కృతికి ప్రజాప్రభుత్వం పెద్దపీట
  • 76వ గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ ‌జిష్ణు దేవ్‌ ‌వర్

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26 : తెలంగాణ ఆర్థిక రంగానికి వ్యవసాయ వెన్నెముక అని.. రైతుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణు దేవ్‌ ‌వర్మ అన్నారు. రాష్ట్రంలోని 25 లక్షల మందికిపైగా రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు. రైతు భరోసా కింద ఏడాదికి రూ. 12 వేలు అందజేస్తుందని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమిలేని పేదలకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం రైతు బీమా కొనసాగిస్తుందని తెలిపారు. సన్నరకం బియ్యానికి బోనస్‌ అం‌దిం చామని చెప్పారు. ఈ ఏడాది అత్య ధికంగా వరి దిగుబడి అయ్యిందని అన్నారు.

తెలంగాణలో ఒకే ఏడాది 50 వేల ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా చేశామని తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌ ‌పరేడ్‌‌గ్రౌండ్స్‌లో జరిగిన వేడుకల్లో జాతీయ జెండాను గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం గవర్నర్‌ ‌జిష్ణు దేవ్‌ ‌వర్మ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *