ప్రజలు భయభ్రాంతులకు గురి కావొద్దు..

  • అప్రమత్తంగా ఉండండి
  • దిల్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 7 : ఆపరేషన్ సింధూర్ ( Operation Sindoor) నేపథ్యంలో ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని, అందరూ అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోరారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ శాఖకు సంబంధించిన సమస్యల పరిష్కారం నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిల్లీ పర్యటనలో ఉన్నారు. కాగా ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తక్షణమే బయలుదేరి హైదరాబాదు రావాల్సిందిగా బుధవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ద్వారా కోరడంతో హుటాహుటిన డిప్యూటీ సీఎం హైదరాబాద్ బయలుదేరారు. ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే పోలీసు విభాగానికి ఫిర్యాదు చేయాలని డిప్యూటీ సీఎం రాష్ట్ర ప్రజలకు సూచించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page