పిడుగుపాటు మృతుల‌కు రూ.6 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం

రెవెన్యూహౌసింగ్‌స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

హైద‌రాబాద్ప్రజాతంత్రమార్చి 29 : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గ‌త ఐదేళ్లలో పిడుగుపాటుఅగ్నిప్ర‌మాదాల‌ కార‌ణంగా మృతిచెందిన వారి కుటుంబాల‌కు ప్ర‌భుత్వం న‌ష్ట‌ప‌రిహారాన్ని విడుద‌ల చేసింది. ఈమేర‌కు ఆయా జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు స‌మాచారం పంపించి బాధిత కుటుంబాల‌కు ప్ర‌భుత్వ సాయం అందేలా విప‌త్తు నిర్వ‌హ‌ణ విభాగం ఆదేశాలు జారీ చేసింది. పిడుగుపాటుతో మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి రూ.ఆరు ల‌క్ష‌ల చొప్పున, ,అగ్నిప్ర‌మాద బాధిత కుటుంబాల‌కు నాలుగు ల‌క్ష‌ల చొప్పున న‌ష్ట‌ప‌రిహారం అందిస్తున్నామ‌ని రెవెన్యూస‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబాల‌కు ఈ ప‌రిహారం త్వ‌రితగ‌తిన అందించాల‌ని మంత్రి ఆదేశించారు.

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని ఆరుగురికినాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలోని ఆరుగురికికొమ‌రంభీమ్ జిల్లాలో న‌లుగురికిహ‌నుమ‌కొండ జిల్లాలో ముగ్గురికినారాయ‌ణ‌పేట్‌జోగులాంబ‌మెహ‌బూబాబాద్ మెద‌క్ జిల్లాలో ఇద్ద‌రికి రాజ‌న్న సిరిసిల్ల జిల్లాజ‌న‌గాంయాదాద్రిపెద్ద‌ప‌ల్లి.వ‌రంగ‌ల్ ఆదిలాబాద్‌జ‌గిత్యాల్‌జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లిములుగున‌ల్గొండ‌కామారెడ్డినిర్మ‌ల్ సూర్యాపేట జిల్లాల‌లో ఒక్కోక్క‌రికి ఈ న‌ష్ట‌ప‌రిహారం మంజూరైంది. అదేవిధంగా హైద‌రాబాద్ లోని రెడ్ హిల్స్ లో విద్యుత్ షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో అసువులు బాసిన పదిమంది కుటుంబాల‌కు మ‌నిషికి రూ.4 ల‌క్ష‌ల చొప్పున 40 ల‌క్ష‌ల రూపాయిల‌ను ప్ర‌భుత్వం మంజూరు చేసింది. ఇదేగాక హైద‌రాబాద్‌లోని రుబీహోట‌ల్ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌లో మృతి చెందిన 8 మంది కుటుంబాల‌కు రూ. 32 ల‌క్ష‌ల రూపాయిల‌ను ప్ర‌భుత్వం మంజూరు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *