మాట మార్చడంలో సీఎం రేవంత్‌రెడ్డికి పీహెచ్‌డీ

  • రైతుబంధు ఇస్తామని ఎగ్గొట్టాడు
  • ముఖ్యమంత్రిపై  మాజీ మంత్రి హరీష్‌ రావు ఫైర్‌
  • రెండు నాల్కల ఆణిముత్యాలు’  విడుదల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 2 : పూటకో మాట మాట్లాడడం.. మాట మార్చడంలో సీఎం రేవంత్‌ రెడ్డి పీహెచ్‌డీ పూర్తి చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు సెట్కెర్లు వేశారు. రేవంత్‌ ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా రేవంత్‌ ‘రెండు నాల్కల ఆణిముత్యాల’ను తెలంగాణ భవన్‌ వేదికగా హరీష్‌ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. రైతుబంధు, బతుకమ్మ చీరలు, ఎల్‌ఆర్‌ఎస్‌, పోటీ పరీక్షల వాయిదా, కులగణన సర్వే, కూల్చివేతలు, ఏక్‌ పోలీసు, మద్యం అమ్మకాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, సోనియా గాంధీ బలిదేవత, పార్టీ ఫిరాయింపులు, శిలాఫలకాలు, పేపర్‌ యాడ్స్‌, మూసీ అభివృద్ధి, అడ్వ్కెజర్లకు కేబినెట్‌ హోదా, యూట్యూబ్‌ చానెల్స్‌, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, బూటకపు ఎన్‌కౌంటర్లపై రేవంత్‌ రెడ్డి మాట్లాడిన డబుల్‌ స్టాండర్డ్స్‌ను హరీష్‌ రావు వీడియో ఆధారాలతో ప్రజలకు చూపించారు. పై అంశాలపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు.. అధికారంలోకి వొచ్చాక ఏం మాట్లాడారు అనే విషయాలను హరీష్‌ రావు కళ్లకు కట్టినట్లు తెలిపారు. కేసీఆర్‌ రెండు పంటలకే రైతుబంధు ఇస్తున్నాడు.. మేం అధికారంలోకి వొస్తే మూడు పంటలకు రైతుబంధు ఇస్తామన్న రేవంత్‌ వ్యాఖ్యలను హరీష్‌ రావు గుర్తుచేశారు.

ఇక మంచి డిజ్కెన్లతో ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు పంపిణీ చేస్తామని చెప్పారని, ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో రేవంత్‌ రెడ్డి మాట మార్చిన తీరును కూడా వివరించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షల విషయంలో రేవంత్‌ రెడ్డిది డబుల్‌ స్టాండ్‌ కాదు.. ట్రిపుల్‌ స్టాండ్‌ అని హరీష్‌ రావు ఎద్దేవా చేశారు. కుల గణన సర్వేపై రేవంత్‌ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారో విషయాన్ని హరీష్‌ రావు వివరించారు. ఇక కూల్చివేతల విషయానికి వొస్తే.. తెలియక, అమాయకంగా కొనుగోలు చేసిన వారి విషయంలో రెగ్యులరైజ్‌ చేయొచ్చు కదా అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు. . అధికారంలోకి వొచ్చాక కూల్చివేతలపై రేవంత్‌ రెడ్డి మాట మార్చారని హరీష్‌ రావు మండిపడ్డారు. అధికారం కోసం ఏక్‌ పోలీసు.. తర్వాత నో పోలీసు అని రేవంత్‌ అన్నారు. బెల్ట్‌ షాపుల వల్ల సంసారాలు నాశనమవుతున్నాయి. ఇప్పుడేమో పల్లెలు తాగాలి.. ఖజానాలు నిండాలనే ధోరణితో విచ్చలవిడిగా బెల్ట్‌ షాపులకు అనుమతిస్తున్నారని రేవంత్‌ పై హరీష్‌ రావు నిప్పులు చెరిగారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, కూలిపోవడం జరిగిపోయిందని రేవంత్‌ వ్యాఖ్యానిస్తే.. కానీ ఆయన మంత్రివర్గంలో ఉన్న కొండా సురేఖ రంగ నాయక సాగర్‌ ద్వారా నీళ్లు విడుదల చేసిందని హరీష్‌ రావు గుర్తు చేశారు. టీడీపీలో ఉన్నప్పుడు సోనియా గాంధీ బలి దేవత అని అన్నాడు.. ఇప్పుడేమో సోనియమ్మ మా అమ్మ.. నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్నతల్లి అని అంటుండు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిని రాళ్లతో కొట్టి చంపండి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నాడు.. ఇప్పుడేమో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడు. శిలాఫలకాలపై కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అని ఎందుకు రాస్తున్నారు.. తెలంగాణ ముఖ్యమంత్రి అని రాయొచ్చు కదా..? అని ప్రశ్నించాడు. ఇప్పుడేమో ప్రతి శిలాఫలకంపై తన (రేవంత్‌ రెడ్డి) బొమ్మ వేయించుకుంటున్నాడంటూ హరీష్‌ రావు నిప్పులు చెరిగారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అడ్వ్కెజర్లకు కేబినెట్‌ హోదా కల్పిస్తే.. ప్రభుత్వ సలహాదారులకు కేబినెట్‌ హోదాకు వ్యతిరేకంగా కోర్టుల్లో పిటిషన్లు వేసిన రేవంత్‌ రెడ్డి.. ఇప్పుడేమో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అదే సలహదారులకు కేబినెట్‌ హోదా కల్పించారని హరీశ్‌రావు గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page