సమగ్ర అధ్యయన ఫలితమే …‘భూ భారతి’

భూముల కోసం ఎంతో మంది యోధులు త్యాగాలు

పేదల భూ హక్కులను కాపాడడమే మా లక్ష్యం
ధరణితో రైతుల భూములు అగమాగం..
రైతుల భూముల వివరాలు విదేశీ సంస్థల చేతుల్లో పెట్టారు. .
అహంకారంతో కుట్రపూరితంగా నేడు చర్చను అడ్డున్నారు..
ఫార్ములా ఈ రేస్‌ పై చర్చకు సిద్దం..
బిఆర్‌ఎస్‌ సభ్యుల ఆందోళనపై సీఎం రేవంత్‌ ఫైర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : ప్రతిపక్షం సహనం కోల్పోయిందని ముఖ్యమంత్రి రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు అహంభావంతో వ్య వహ రిస్తున్నారని ఫైర్‌ అ య్యారు. మర్యాద లేకుండా స్పీకర్‌పైనే పేపర్లు విసిరేశారని సీరియస్‌ అయ్యారు. చర్యలు తీసుకునే పరిస్థితులు వొచ్చినా.. స్పీకర్‌ ఎంతో ఓపికతో వ్యవహరించారని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. అర్హులైన భూ యజమానుల హక్కులు కాపాడే ందుకు చట్టాన్ని సభలో ప్రవేశపెట్టామని, దీనిపై సమగ్ర చర్చ ద్వారా తెలంగాణ రైతులకు ఉపయోగపడే చట్టాన్ని తీసుకురావాలని భావిం చామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. కానీ ప్రతిపక్ష పార్టీ అహంకారంతో చర్చను అడ్డుకోవాలని యత్నించిందని మండిపడ్డారు. సహనం కోల్పోయేలా రెచ్చగొట్టి చర్చను పక్క దారి పట్టించే ప్రయత్నం చేసినా స్పీకర్‌ ఆ అవ కాశం వారికి ఇవ్వలే దన్నారు. ఓపిక నశించి వాళ్లే వెళ్లిపోయినా చర్చ కు అవకాశం కల్పిం చడం అభినం దనీయ మన్నారు.

రావి నారా యణ రెడ్డి, అరుట్ల కమ లాదేవి, అరుట్ల రాంచంద్రా రెడ్డి, మల్లు స్వరాజ్యం, భీం రెడ్డి నర్సింహారెడ్డి, చాకలి ఐలమ్మ లాంటి వారు పోరాటాలు చేసింది భూమి కోసమే.. ఈ భూమిని ఆత్మగౌరవంగా, హక్కుగా భావించారు. భూమినే తమ హక్కుగా భావించి సాయుధ రైతాంగ పోరాటం చేశారు.. అధికారంతో, అహంకారంతో ఆధిపత్యాన్ని చేలాయించాలని చూసినా భూమిని కాపాడుకోవడంలో వారు విజయం సాధించారు. ఆ తరువాత ఎప్పుడు ఏ ఉద్యమం వొచ్చినా.. భూమి చుట్టూనే పోరాటాలు జరిగాయి. పటేల్‌ పట్వారీ వ్యవస్థ రద్దుకు కూడా కొంతమంది భూమిపై ఆధిపత్యం చలాయించడమే కారణం.. యజమాని హక్కులను కాపాడేందుకు ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చాయి. భూమిలేని పేదలకు అసైన్డ్‌ పట్టాలు ఇచ్చి ఇందిరాగాంధీ పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. నిజమైన భూ యజమాని హక్కులను కాపాడాలి. లేకపోతే చదువులేని వారి భూములు అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు వీలైనంత మేరకు ప్రజలకు ఉపయోగపడేలా చట్టాలు సవరించాయి. తన మెదడును రంగరించి మాజీ సీఎం కేసీఆర్‌ ఒక అద్భుత చట్టాన్ని తీసుకొస్తున్నామని ఆనాడు సభలో చెప్పారు. ధరణి పోర్టల్‌ కేసీఆర్‌ సొంతంగా కనిపెట్టింది కాదు.. 2010లోనే ఒడిశాలో ఈ-ధరణి పేరుతో ఐఎల్‌%డ%ఎఫ్‌ఎస్‌  కంపెనీకి అప్పగించింది. అనుభవం, నైపుణ్యం లేని సంస్థకు ఈ-ధరణి పోర్టల్‌ ఇవ్వడాన్ని 2014లో కాగ్‌ తప్పుబట్టింది. అలాంటి లోపభూయిష్టమైన ధరణిని కేసీఆర్‌ ఎందుకు తెలంగాణ ప్రజలపై రుద్దారో చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది.. 2018లో ఐఎల్‌ %డ%ఎఫ్‌ఎస్‌తో పాటు గాదె శ్రీధర్‌ కు చెందిన ఈ సెంట్రిక్‌, వైసెన్‌ ఇన్‌ఫోటెక్‌ సంయుక్తంగా కాంట్రాక్టు సాధించుకున్నాయి.

క్రిమినల్‌ నేపథ్యం ఉన్న కంపెనీలను టెండర్లలో నిషేధించే విధానం ఉంది. కానీ కేసీఆర్‌ ఆ పని చేయలేదు. భూ రిజిస్ట్రేషన్లకు సంబంధించి అన్ని రకాల బాధ్యతలు ఆ కంపెనీకి అప్పగించారు. ఆ తరువాత ఐఎల్‌  ఎఫ్‌ఎస్‌సబ్సిడరీ కంపెనీ అయిన టెరాసిస్‌ ధరణి కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ టెర్రాసిస్‌ లో 99 శాతం షేర్లు ఫిలిప్పిన్స్‌ దేశానికి చెందిన ఫాల్కన్‌ ఎస్‌జి అనే సంస్థ రెండు దఫాలుగా 2021లో కొనుగోలు చేసింది. మిగిలిన ఒక్క శాతం వాటా మాత్రం కేటీఆర్‌ మిత్రుడు గాదె శ్రీధర్‌ రాజు కొనుగోలు చేశారు. ఆ ఒక్క శాతం షేరుతో శ్రీధర్‌ రాజు టెరాసిస్‌ కు సీఈవోగా అవతారం ఎత్తారు. పాల్కన్‌ ఎస్‌జి(ఫిలిప్పిన్స్‌) సంస్థలోని 100 శాతం షేర్లు సింగపూర్‌ కు చెందిన  ఫాల్కన్‌ ఇన్‌వెస్ట్‌మెంట్స్‌ అనే సంస్థ కొనుగోలు చేసింది. ఈ సింగపూర్‌ బేస్డ్‌ కంపెనీలో 100 శాతం వాటాను ఐదు కంపెనీలు కొనుగోలు చేశాయి. స్పారో ఇన్‌వెస్ట్‌మెంట్‌, జీడబ్ల్యూ స్కై,  హిల్‌ బ్రూక్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌,  తోపాటు మరికొన్ని మళ్లీ  స్పారో ఇన్‌వెస్ట్‌ మెంట్‌ అనే సంస్థలో 100 శాతం వాటాలను గేట్‌ వే ఫండ్‌ 2 అనే కంపెని చేతుల్లోకి వెళ్లాయి. ఆ కంపెనీ మూలాలు ఎక్కడ అన్నది గమనిస్తే… పన్ను ఎగవేతలకు, ఆర్థిక నేరాలకు స్వర్గధామంగా పేరుగాంచిన సైమన్స్‌ ఐస్‌లాండ్‌ అనే దీవిలో ఉన్నాయి. ఐదింటిలో మరో కంపెనీ అయిన  హిల్‌ బ్రూక్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ మూలాలు కూడా పన్ను ఎగవేత, ఆర్థిక నేరాలకు స్వర్గధామంగా భావించే బ్రిటీష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌ లో ఉన్నాయి. ధరణి పోర్టల్‌ నిర్వహిస్తున్న వారిలో ఎవరూ ఈ దేశానికి చెందిన వ్యక్తులు కాదు.. అలాంటి వ్యక్తుల చేతుల్లోకి తెలంగాణ రైతుల భూముల వివరాలు పెట్టారు. రెవెన్యూ డిపార్ట్‌ మెంట్‌, భూ యజమానికి మధ్య ఉండాల్సిన డేటాను డిజిటల్‌ పోర్టల్‌ నెపంతో ప్రయివేట్‌ వ్యక్తుల చేతుల్లో పెట్టారు. ఇతర దేశాల్లో ఆర్థిక నేరాల్లో ఇరుక్కుపోయిన సంస్థలకు అప్పగించి.. రైతుల సంపూర్ణ డేటాను వాళ్లకు అప్పగించారు. ప్రజలకు ద్రోహం చేసి, మోసం చేసి సమాచారాన్ని విదేశీ కంపెనీలకు అప్పగించారంటే.. దీనిపై ఎలాంటి విచారణ చేయాలో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. .

ఎంసీహెచ్‌ఆర్డీలో అద్భుతమైన సాంకేతిక ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ అన్నారు. ఇతర రాష్ట్రాలకు మన సాంకేతికతను అందిస్తున్న పరిస్థితుల్లో వీళ్లు విదేశీ కంపెనీలకు అప్పగించారు.. కేసీఆర్‌ ఆవేశంతో ఊగిపోతుంటే ఆనాడు నాకు అర్ధం కాలేదు.. ధరణిలో ఎన్నో ఎకరాల భూదాన్‌ భూములు, ప్రయివేట్‌ భూముల యజమానుల పేర్లు మారాయి.. అగ్రిమెంట్‌ లోని 9.20 క్లాజ్‌ ప్రకారం యజమాని పేరు మార్చడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. 9.20.4 క్లాజ్‌ లో పేర్కొన్నట్లు ప్రభుత్వ ఆఫీసులో ఉండి పనులు చేయాలి.. రెవెన్యూ శాఖకు సంబంధించిన సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి పని చేయాలి. తెలంగాణలో కాకుండా విజయవాడలో, బెంగుళూరుకు, ఈశాన్య రాష్ట్రాల నుంచి ధరణిని నిర్వహించారు.. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో లేని కంపెనీలకు, విదేశీయులకు అప్పగించి ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారు. దీనిపై ఎంత కఠినమైన శిక్ష వేయాల్సిన అవసరం ఉంది అని సీఎం అన్నారు. గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్నికేసీఆర్‌, కేటీఆర్‌ ఇతర దేశాల వ్యక్తులకు అప్పగించారన్నారు.

సమగ్ర అధ్యయనం తర్వాతే చట్టం తీసుకొచ్చాం..  
తమ ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లేందుకు చాలా సమావేశాలు నిర్వహించి భూ భారతి చట్టాన్ని సభ ముందుకు తీసుకొచ్చిందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ధరణిలో పగలు జరగాల్సిన రిజిస్ట్రేషన్లు అర్ధరాత్రి కూడా జరిగాయన్నారు.  అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు చేసే వ్యవస్థ ఏ రాష్ట్రంలోనైనా ఉందా..? అని ప్రశ్నించారు.  బండారం బయటపడుతుందనే నేడు చర్చ జరగకుండా ప్రయత్నాలు చేశారు. ఆనాడు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఫిర్యాదు చేసినా.. లెక్కచేయకుండా తిమ్మాపూర్‌ భూదాన్‌ భూములను ప్రయివేట్‌ వ్యక్తుల పేరుకు మార్చారు.. మా ప్రభుత్వం వొచ్చాక కేసులు నమోదు చేశాం.. రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో వేల ఎకరాల భూములను బదిలీ చేశారు.. ఎక్కడి నుంచైనా , ఏ పేరుకైనా మార్చేలా స్వైర విహారంచేసే అధికారం సంస్థకు అప్పగించారు.. ధరణి అద్భుతమైతే సభలో ఉండి మమ్మల్ని నిలదీయాలి కదా…? 80వేల పుస్తకాల జ్ఞానంతో సృష్టించిన ధరణి గురించి సంపూర్ణంగా వివరించచ్చు కదా.. అని సీఎం ప్రశ్నించారు.

ఈ కార్‌ రేస్‌ సంస్థకు చెందిన వ్యక్తి అపాయింట్‌ మెంట్‌ అడిగితే తానే  ఇచ్చానని సీఎం రేవంత్‌ తెలిపారు.   వారు చెప్పాకే వ్యవహారం ఏంటనేది అధికారులతో తెలుసుకున్నానని చెప్పారు. ఏసీబీ విచారణ చేస్తున్న సమయంలో, కోర్టులో వాదనలు వినిపిస్తున్న సమయంలో విచారణాధికారులు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని అడ్వాంటేజ్‌ తీసుకుంటారని దీనిపై ఎక్కువ మాట్లాడటంలేదు.. 2023 డిసెంబర్‌ నుంచి 2024 వరకు జరిగిన అన్ని వివరాలను ప్రజలకు అందిస్తానన్నారు.  ఈ కార్‌ రేస్‌ పై ఏడాదిగా చర్చ జరుగుతున్నా. అసెంబ్లీలో నాలుగు సమావేశాల్లో ఎప్పుడైనా దీని గురించి ఎప్పుడైనా మాట్లాడారా? నిన్నటి నుంచి చర్చ జరగాల్సిందే అని పట్టుబడుతున్నారు.. ఎందుకీ అహంకారం…? అని రేవంత్‌ నిలదీశారు.  ఏడాదిగా అవసరం లేని చర్చ ధరణి గురించి చర్చ వొచ్చిప్పుడే ఎందుకు? కుట్రపూరిత ఆలోచనతోనే చర్చ జరగకూడదని ప్రయత్నించారు.

ఫార్ములా ఈ రేస్‌ కు సంబంధించి ఎప్పుడు పిలిచినా ఇక్కడైనా, ఎక్కడైనా.. చివరకు వాళ్ల పార్టీ ఆఫీసులోనైన చర్చకు సిద్దం.. 55 కోట్లు చిన్న అమౌంటు కాదు..మేం ఒప్పుకోకపోవడం వల్లే ప్రభుత్వం 600 కోట్ల నష్టపోకుండా ఆపగలిగామని సీఎం రేవంత్‌ అన్నారు.  డ్రగ్స్‌ తో పట్టుబడితే ఇంట్లో పార్టీ చేసుకోవద్దా అని దబాయిస్తున్నారు.. మనం ఏ సంప్రదాయంలో ఉన్నాం.. ఔటర్‌ రొంగ్‌ రోడ్‌ అమ్ముకున్న, హెచ్‌ఎండీఏ నుంచి కోట్లు బదిలీ చేసినా ఏమీ అనొద్దన్నట్లుగా బీఆర్‌ఎస్‌ తీరు ఉందని ధ్వజమెత్తారు.  ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామనే తీరుగా బీఆర్‌ఎస్‌ ప్రవర్తన ఉంది… దీన్ని ప్రభుత్వం ఏ మాత్రం సహించదని స్పష్టంచేశారు.  హరీష్‌ రావు పరిస్థితి మాకు అర్ధమైందని, చొక్కాలు చించుకోకపోతే ఇంటి దగ్గర కొరడా దెబ్బలు ఉంటాయి.. ప్రజల కోసం కొన్ని కొరడా దెబ్బలు తినాలని, మరీ మామకు అంత విశ్వాసం చూపాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్‌ రెడ్డి సెటైర్లు వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page