వసతి గృహాలను సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఉన్నతాధికారుల సందర్శనలు
విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో పరిస్థితులను స్వయంగా అంచనా వేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి లతో సహా రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో పాటు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు గురుకుల, రెసిడెన్షియల్ హాస్టళ్లను శనివారం వ్యక్తిగతంగా సందర్శించినన్నారు. అక్కడే విద్యార్థులతో కలసి భోజనం చేసి పరిస్థితులను అంచనా వేయనున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల హాస్టళ్లలోని దాదాపు 8 లక్షల మంది విద్యార్థులకు డైట్ చార్జీలు 40%, కాస్మోటిక్ చార్జీలు 200% పెంచుతూ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు రాష్ట్రంలోని పాఠశాలలో 667.25 కోట్లతో మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించింది.
హాస్టల్ ల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు ఆకునూరి మురళి అధ్యక్షతన స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గం ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ, మైనారిటీ హాస్టల్లో మరింత ప్రామాణికమైన ఆహారాన్ని అందించడంతోపాటు మెరుగైన విద్య బోధనా అవకాశాలను పెంపొందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో శనివారం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రాష్ట్రంలోని అన్ని గురుకుల సంక్షేమ హాస్టల్లో పర్యటించి పరిస్థితులను స్వయంగా సమీక్షించనుంది.
ముఖ్యమంత్రి, మంత్రుల, పర్యటన వివరాలు : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాలలోని ఏదో ఒక సంక్షేమ హాస్టల్లో ఆకస్మిక తనికీ నిర్వహిస్తారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం జిల్లాలోని మహాత్మా జ్యోతిబాపూలే బిసివెల్ఫేర్ గురుకులం, (బాలికలు) మధిర పాఠశాల, బోనకల్ లో తనిఖీలు నిర్వహించనున్నారు. మంత్రులు దామోదర రాజనరసింహ, భూపాలపల్లి జిల్లాలోని మహాత్మా జ్యోతిబాపూలే బిసివెల్ఫేర్ గురుకులం, (బాలికలు), మైలారం గ్రామం, ఘన్పూర్ ల తనిఖీ చేస్తారు.
మంత్రి డి శ్రీధర్ బాబు, భూపాలపల్లి జిల్లాలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకులం(బాలికలు), మైలారం గ్రామం, ఘన్పూర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం జిల్లాలోని టిజిటిడబ్ల్యూఆర్ జెసి (బాలికలు), మాదిరిపురం, తిరుమలాయపాలెం, పొన్నం ప్రభాకర్, టిజిఎస్డబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల(బాలుర), షేక్పేట, హైదరాబాద్, కొండా సురేఖ, టిజి ఎస్ డబ్ల్యూఆర్(బాలురు), హతనూర, సంగారెడ్డి, డి అనసూయ సీతక్క, ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు), నేరడిగొండ, ఆదిలాబాద్, తుమ్మల నాగేశ్వరరావు, ఏకలవ్య మోడల్ స్కూల్ గండుగులపల్లి, దమ్మపేట మండలం, భద్రాద్రి కొత్తగూడంలో తనిఖీలు చేయనున్నారు. జూపల్లి కృష్ణారావు, టిజిఎస్ డబ్ల్యూఆర్ జెసి (బాలికలు), కొల్లాపూర్, నాగర్ కర్నూలలో తనిఖీలు నిర్వహించనున్నారు.