Category ఎడిటోరియల్

బిఆర్‌ఎస్‌ నేతల అస్తిత్వ ఆరాటం !

రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కొలువుదీరి..సరిగ్గా నాలుగు నెలలు మాత్రమే అయ్యింది. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్‌ తెచ్చిన కరువు అంటూ..పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌ రావు మొదలు పార్టీ శ్రేణులందరూ ఆరోపణలు  అందుకున్నారు. చేనేతలకు బకాయిలు చెల్లించకుండా దస్త్రం పడేసిన కెటిఆర్‌ లేఖలు గుప్పిస్తున్నారు. చేనేతలపై రాజకీయ కక్షకు దిగారని వలపోస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఓ పరిశ్రమలో…

కాంగ్రెస్‌ టార్గెట్‌ 14 ..

12 సీట్లు మనవేనంటున్న బిఆర్‌ఎస్‌, డబుల్‌ డిజిట్‌ లక్ష్యంగా బిజెపి ఎట్టి పరిస్థితిలో 14 పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. మూడు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిన కాంగ్రెస్‌ అదే జోష్‌ తో  ముందుకు దూసుకు పోవాలనుకుంటున్నది. రాష్ట్రంలో క్షీణించిపోయిన కాంగ్రెస్‌ను పునరుద్ధరించేందుకు  ఏరికోరి తనకు…

నాందీ వాచకం

రంగులన్నీ ఏకమై మనుషులందరూ ఒక్కటై కులమతభేదాలు మరచే సమానత్వపు సంబరాల రంగుల పండగ హోళీకి స్వాగతం అనురాగఆప్యాయతలకు ఆలవాలమై, ఆనందాలను మనసులలో నింపుతూ వ్యక్తినిర్మాణాన్ని చెక్కుకొనే సంస్కృతిని ప్రతిబింబించే పర్వమిది. ప్రగతి శత్రువులైన ‘‘ఉచితాల’’ ప్రజాస్వామ్య కంటకాలైన ‘‘నిరంకుశ విధానాల’’ పీడ కామదహనంలా, మంటల్లో కాలి బూడిదైన ‘‘హోళి’’కలా, రాబోయే రోజుల్లో విరగడవ్వడానికి ఊరూ,వాడా నడుంబిగించాలి.…

సంతకాల సమాధి

స్వేచ్ఛా  సమానత్వం సౌభ్రాతృత్వం సమాజంలో కొన్ని సమాజాలకు సంతకాల చుట్టం మరికొన్ని సమాజాలకే… సంతకాల సమాధి గుడిలోకి రానీయని సమానత్వం గుర్రమెక్కనీయని సౌభ్రాతృత్వం మొక్కుకోనీయలేని స్వేచ్ఛ వెలుగుతోంది…సమాజపు చితిమంటలవిగో వికసిస్తోంది…కొన్ని సమాజ హార్మ్యాలవిగో పడావో..బచావో..బర్బాత్‌ దిఖ్రా వో మతమో యుద్దమో సాధింపో వేధింపో బెదిరింపో బేడీలో వాడికి రాజ్యం కావాలిపుడు.. సింహంలా గర్జిస్తూ..సమాజాన్ని మింగేందుకు వాడి…

రేవంత్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ఇందిరమ్మ పాలన

తెలంగాణలో రేవంత్‌ రెడ్డి  నాయకత్వంలో కాంగ్రెస్‌ మార్కు ప్రజాస్వామిక పాలన స్పష్టంగా కనిపిస్తుంది. యువకుడైన రేవంత్‌ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో కలసి చేస్తున్న పాలనాతీరు పట్ల ప్రజల్లో ఓ నమ్మకం..భరోసా పెరిగింది. బిఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న విమర్శలు ఏవగింపు కలిగిలా…వారిని మరింత అసహ్యించుకునేలా చేస్తున్నాయి. చేసిన అప్పుల గురించి, అక్రమాల గురించి కాకుండా ఎదురు…

మార్పు దిశగా వందరోజుల ప్రజాపాలన

సింహాన్ని ఎవరు ఆహ్వానించి అడవికి రాజును చేయరు, దాని శక్తిసామర్ధ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చి పెడతాయి. మన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  విషయంలో ఈ మాటలు అక్షర సత్యాలు . సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి  స్థాయికి ఎదిగిన క్రమంలో  వారు చూపించిన ఆత్మవిశ్వాసం, ఆత్మ నిర్భరత ఎందరికో…

జాతీయ విద్యావిధానం అమలును రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయా!

స్వతంత్ర భారతంలో తొలిసారి ‘జాతీయ విద్యా విధానం-1968(నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ-1968 లేదా యన్‌ఈపీ-1968)’ ప్రవేశ పెట్టడంతో రాష్ట్రాల జాబితాలో ఉన్న విద్య అంశం ఉమ్మడి జాబితాలోకి (కాన్‌కరెంట్‌ లిస్ట్‌) చేర్చబడిరది. పాఠశాల విద్యా విధానంలో ‘త్రిభాషా సూత్రాన్ని’ ప్రతిపాదించిన నాటి యన్‌ఈపీ-1968ని తమిళనాడు రాష్ట్రం వ్యతిరేకించడం, ఆంగ్లం (అంతర్జాతీయ భాష), ప్రాంతీయ భాషతో పాటు హిందీ…

పీఠముడిగా మారిన వరంగల్‌ ఎంపి స్థానం

వరంగల్‌ పార్లమెంటరీ నియోజకవర్గం రాజకీయ పార్టీలకు పీఠముడిగా మారింది. హైదరాబాద్‌ తర్వాత రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాగా ఉమ్మడి వరంగల్‌కు పేరుంది. తెలంగాణ ప్రాంతంలో జరిగిన పలు ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించిన వరంగల్‌పైన ఆధిపత్యం  కోసం దాదాపు అన్ని రాజకీయ పార్టీలు పోటీపడటం చూస్తున్నాం. గడచిన పదేళ్ళుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)…

అహం వీడండి.. ఆత్మపరిశీలన చేసుకోండి!

ఆరు నెలలే ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటదని తరవాత ఎలాగైనా కూలిపోతుందని, కుల్చేస్తామని మీడియా ముఖంగా పార్టీ ముఖ్యులు చెబుతుంటే వింటున్న సామాన్య ప్రజలు రెట్టింపైన కోపంతో ఊగిపోతున్నారు, అలా కనుక చేస్తే ప్రజా క్షేత్రంలో ఆగ్రహ జ్వాలలు ఆకాశానికి ఎగిసి ఊళ్ళల్లో తిరగలేని పరిస్థితి పార్టీ నాయకులకు రాక తప్పదు. నిన్న మొన్నటి వరకు…