Category ఎడిటోరియల్

యువతకు చీడగా మారిన డ్రగ్స్ దందా!!

Drug Trafficking Has Become a Scourge for the Youth

 ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (25) మరణం తెలంగాణలో గంజాయి స్మగ్లర్ల అరాచకాలు ఏస్థాయిలో ఉన్నాయో తెలియజెబుతోంది. జనవరి 23న ఆమెపై దాడి జరగ్గా, హాస్పిటల్‌లో మరణంతో పోరాడి జనవరి 31న తుదిశ్వాస విడవడం విషాదం. జనవరి 23 రాత్రి గంజాయి అక్రమ రవాణాపై సమాచారమందుకున్న నిజామాబాద్‌కు చెందిన  ఎక్సైజ్ బృందం మాధవనగర్ ప్రాంతంలో వాహనాల…

ముఖ్యమంత్రి రేవంత్ కు మ‌రో ప‌రీక్ష‌!!

     రాష్ట్రంలోని ఏడు కార్పొరేష‌న్లు, 116 మున్సిపాలిటీల‌కు ఫిబ్ర‌వ‌రి 11న ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ఎన్నిక‌ల ఫ‌లితాలు ఫిబ్ర‌వ‌రి 13వ తేదీన వెల్ల‌డ‌వుతాయి. ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే ప్ర‌ధాన పార్టీలు అధికార కాంగ్రెస్‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ తోపాటు బీజేపీలు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. అంత‌కుముందు కంటోన్‌మెంట్‌, జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో…

పాప చింతన లేనివారితో దెబ్బతింటున్న ధార్మికత!

 కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతి లడ్డూ వివాదంపై పదిహేను నెలలపాటు నిర్వహించిన దర్యాప్తు నకు సంబంధించి  తుది చార్జ్‌షీట్‌ను ఎట్టకేలకు జనవరి 23న నెల్లూరులోని యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) కోర్టులో దాఖలు చేసింది. సీబీఐ-సిట్ తన నివేదికలో మొత్తం 36 మందిని దోషులుగా పేర్కొంది. ఇందులో వేర్వేరు…

ముంబై మున్సిపల్ కార్పొరేషన్: బీజేపీ కొత్త శకం

1997 విజయం తర్వాత శివసేన నుండి బిఎంసి (BMC) పగ్గాలను భారతీయ జనతా పార్టీ హస్తగతం చేసుకుంది. మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 25 చోట్ల బీజేపీ ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ , బిఎంసి విజయం మాత్రం ఆ పార్టీ కిరీటంలో అత్యంత విలువైన రత్నం వంటిది. 2017తో పోలిస్తే పార్టీ పనితీరు స్వల్పంగా మాత్రమే మెరుగుపడింది…

2025… కాంగ్రెస్ పార్టీ పాలన పై పెరిగిన అసంతృప్తి 

Growing dissatisfaction Congress

2023 ఆఖరిలో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, “ప్రజల పాలన ” అనే నినాదంతో తెలంగాణ ప్రజల్లో భారీ ఆశలు రేపింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా ఏర్పడిన అసంతృప్తి, మార్పు కోరిక – ఇవన్నీ కలిసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చాయి. కానీ 2025 నాటికి వొచ్చేసరికి ఆ ఆశలు ఎంతవరకు నిజమయ్యాయి అన్న ప్రశ్న…

2025.. బీఆర్ఎస్ ..ఒక అడుగు ముందుకు ..రెండడుగులు వెనకకు ..!

2025 BRS one step forward two steps back

మలి  దశ తెలంగాణా ఉద్యమానికి ఊపిరి అందించిన  భారత రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్)  తెలంగాణ రాజకీయాల్లో  ఒక సాధారణ రాజకీయ పార్టీ కాదు. అది ఒక ఉద్యమ ఫలితం. ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంతో పుట్టిన పార్టీగా, రాష్ట్ర ఏర్పాటుతో అధికారాన్ని చేపట్టి దశాబ్ద కాలం తెలంగాణ పాలనను తన ముద్రతో మలిచిన పార్టీ.. సమైక్య…

2025 – రాష్ట్రంలో బీజేపీ ‘హడావుడి’ కే పరిమితం ..!

తెలంగాణ రాజకీయాల్లో “భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభావం అనే ప్రశ్న గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం చర్చలో ఉంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి దశలో పరిమిత ప్రభావానికే పరిమితమైన బీజేపీ, 2019 తర్వాత తన రాజకీయ ఉనికిని గణనీయంగా పెంచుకుంది. అయితే 2025 నాటికి బీజేపీ ప్రభావం “వృద్ధి–స్థిరత్వం–పరిమితి” అనే మూడు దశల…

శివాజీ మోరల్‌ పోలీసింగ్‌!!

” ఇంగ్లండ్‌ రాజు జేమ్స్‌`1 ఎప్పుడూ మహిళల పట్ల తన అనుమానాస్పద దృక్కోణాన్ని ప్రదర్శించేవాడు. స్త్రీలు చపల చిత్తులని, నీతివర్తన లేనివారన్న అభిప్రాయంతో ఉండేవాడు. పురుషులను సమ్మోహితులను చేసి రెచ్చగొట్టే లక్షణాలు స్త్రీల సొంతమని వ్యాఖ్యానించేవాడు. మెడ కనిపించేవిధంగా వస్త్రధారణ, ముఖానికి మేకప్‌ వేసుకోవడాన్ని తీవ్రంగా నిరసించేవాడు. అప్పట్లో అతని ఆస్థానంలో ఈ రెండూ బాగా…

కోతులు, కుక్కలు..

Monkeys and Dogs Turn Into Key Issues in Panchayat Elections

పంచాయితీ ఎన్నికల్లో కోతులు, కుక్కలు ప్రధానాంశాలుగా మారాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్న అభ్యర్థులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య కూడా ఇదే కావడంతో విధిలేక వాటి నివారణకు హామీలు ఇవ్వక  తప్పటం లేదు. ఇది కేవలం ఏదో ఒకటి రెండు గ్రామాలకు సంబంధించిన అంశం కాదు. రాష్ట్రంలో అత్యధిక గ్రామాలు ఎదుర్కుంటున్న సమస్య .…