Category ఎడిటోరియల్

శివాజీ మోరల్‌ పోలీసింగ్‌!!

” ఇంగ్లండ్‌ రాజు జేమ్స్‌`1 ఎప్పుడూ మహిళల పట్ల తన అనుమానాస్పద దృక్కోణాన్ని ప్రదర్శించేవాడు. స్త్రీలు చపల చిత్తులని, నీతివర్తన లేనివారన్న అభిప్రాయంతో ఉండేవాడు. పురుషులను సమ్మోహితులను చేసి రెచ్చగొట్టే లక్షణాలు స్త్రీల సొంతమని వ్యాఖ్యానించేవాడు. మెడ కనిపించేవిధంగా వస్త్రధారణ, ముఖానికి మేకప్‌ వేసుకోవడాన్ని తీవ్రంగా నిరసించేవాడు. అప్పట్లో అతని ఆస్థానంలో ఈ రెండూ బాగా…

కోతులు, కుక్కలు..

Monkeys and Dogs Turn Into Key Issues in Panchayat Elections

పంచాయితీ ఎన్నికల్లో కోతులు, కుక్కలు ప్రధానాంశాలుగా మారాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్న అభ్యర్థులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య కూడా ఇదే కావడంతో విధిలేక వాటి నివారణకు హామీలు ఇవ్వక  తప్పటం లేదు. ఇది కేవలం ఏదో ఒకటి రెండు గ్రామాలకు సంబంధించిన అంశం కాదు. రాష్ట్రంలో అత్యధిక గ్రామాలు ఎదుర్కుంటున్న సమస్య .…

సంచార్ సాథీ యాప్ నిఘాకోస‌మా? సైబ‌ర్ దాడుల‌నుంచి ర‌క్ష‌ణ‌కా?

Sanchar Saathi App Surveillance Tool or Cyber Protection Measure

ఎవ‌రైతే కొద్దిపాటి ర‌క్ష‌ణ‌కోసం త‌మ‌కు అత్య‌వ‌స‌ర‌మైన స్వేచ్ఛ‌ను వ‌దులుకుంటారో, అటువంటివారు స్వేచ్ఛ‌, ర‌క్ష‌ణ‌ల‌ను శాశ్వ‌తంగా కోల్పోక త‌ప్ప‌ద‌ని, అమెరికాకు చెందిన ప్ర‌ముఖ రాజ‌నీతిజ్ఞుడు బెంజామిన్ ఫ్రాంక్లిన్ చెప్పిన మాట‌లు అక్ష‌ర‌స‌త్యం. తాత్కాలిక భ‌ద్ర‌త పేరుతో నెర‌పే బేర‌సారాల్లో ప్రాథ‌మిక స్వేచ్ఛ‌ను కోల్పోవ‌డం వ‌ల్ల‌ పూర్తి స్థాయి న‌ష్టం త‌ప్ప లాభం లేశ‌మాత్రం కూడా ఉండదు. వ్య‌క్తులు…

పంచాయితీ ఎన్నికలు ..!

స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గ ఉప ఎన్నికలో  విజయాన్ని సాధించిన తర్వాత పంచాయితీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వొస్తాయన్న ఉత్సాహం కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి ఏర్పడినట్లుంది. అందుకే జూబ్లీ ఎన్నిక హడావిడి ముగియగానే రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ముందుగా పంచాయితీ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్‌పీటీసీ…

ఈ దుశ్చర్యను ఏమంటారు…?

న్యూదిల్లీ ఎర్రకోట (లాల్ ఖిల్లా) మెట్రో స్టేషన్ సమీపంలో ఒక వాహనంలో సంభవించిన పేలుడు కారణంగా 10 మంది మరణించినట్లు తెలుస్తుంది. ఈ సంఘటన సుమారుగా సాయంత్రం 6:55 గంటలకు గేట్ నం. 1 వద్ద జరిగింది. ఈ ఘటనలో 10 మంది మరణించగా, 24 మంది గాయపడ్డారు. ప్రభుత్వం ఈ సంఘటనను అధికారికంగా ఉగ్రదాడి…

ప్రచారం ముగిసింది … ఇక దృష్ట్యంతా వోట్లపైనే

గత నెలరోజులుగా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి తెరపడింది. నిన్నటి వరకు సాగిన మైకుల హోరు, రాజకీయ పార్టీల సభలు, సమావేశాల హడావిడి, వాహనాల చప్పుళ్ళు, కార్యకర్తల నినాదాల సందడికి ఆదివారం సాయంత్రం నుండి తెరపడింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఛాలెంజ్ల  హడావిడి అంతా మూగపోయింది. ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ తమ దృష్టినంతా మంగళవారం జరుగనున్న…

మ‌మ్దానీ ఎన్నిక‌లో ఉచిత బ‌స్సు ప్రయాణం ప‌థ‌కం కీల‌కం!

న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయ‌ర్ మాత్ర‌మే కాదు తొలి భార‌తీయ మూలాలున్న జోహ్రాన్ మ‌మ్దానీ (34) ఎన్నిక కావ‌డం నిజంగా చారిత్రాత్మ‌క‌మ‌నే చెప్పాలి. అంతేకాదు న్యూయార్క్ మేయ‌ర్ ప‌ద‌వికి ఎన్నికైన చిన్న వ‌య‌స్కుడిగా మ‌రో రికార్డు సొంతం చేసుకున్నారు. ఇదిలావుండ‌గా వ‌ర్జీనియా లెఫ్ట్ నెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా భార‌త సంత‌తికి చెందిన డెమోక్ర‌ట్ అభ్య‌ర్థి గ‌జాలా…

 రక్తమోడుతున్న రోడ్లు 

భారతదేశ రోడ్లు, రహదారులు భద్రతకు కాకుండా, నిత్యం మారణహోమానికి చిరునామాలుగా మారుతున్నాయి. నవంబర్ 3, సోమవారం రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర విషాదం, అలాగే అంతకుముందు రోజు రాజస్థాన్‌లోని ఫలోడి జిల్లాలో సంభవించిన దుర్ఘటన దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతపై నెలకొన్న భయానక పరిస్థితికి నిదర్శనం. రంగారెడ్డి జిల్లాలో కంకర లోడుతో అతివేగంగా,…

మరో విషాదం: ఏసీ బస్సుల్లో ప్రయాణ భద్రత ప్రశ్నార్థకం

ఈ నెల అక్టోబర్ 14 న జైసల్మేర్ లో 26 మంది, కర్నూలులో నేడు 20 మంది ప్రయాణీకులను బలిగొన్న రెండు ప్రైవేట్ ఏసీ బస్సుల అగ్నిప్రమాదాలు దేశ రహదారి భద్రతపై తీవ్రమైన, అత్యవసరమైన చర్చను లేవనెత్తుతున్నాయి. కేవలం పది రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు ఘోర ప్రమాదాలు… భారతీయ ప్రయాణీకులకు విలాసవంతమైన ప్రయాణంగా…