Category ముఖ్యాంశాలు

మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావుకు చుక్కెదురు

కస్టడీ సవాల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు కిందికోర్టు తీర్పును సమర్థించిన న్యాయమూర్తి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి21: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావుకు  తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. పోలీస్‌ కస్టడీని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. నాంపల్లి కోర్టు కస్టడీని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రణీత్‌ పిటిషన్‌ దాఖలు…

జర్నలిజం గౌరవాన్ని కాపాడాలి

మీడియా అకాడమీ చైర్మన్‌ కెఎస్‌ఆర్‌ రంగారెడ్డి,ప్రజాతంత్ర,మార్చి20: భావప్రకటన స్వేచ్చకు ప్రతిరూపమైన జర్నలిజం వృత్తికి ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మీడియా సంస్థల నిర్వాహకులపై, అందులో పనిచేస్తున్న జర్నలిస్టులపై ఉంటుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా, తుర్క యాంజాల్‌ లో నిర్మించిన క్యాపిటల్‌ ఇన్ఫర్మేషన్‌ మీడియా సంస్థ భవన సముదాయాన్ని…

రైతులంటే ఎందుకింత చిన్నచూపు

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శలు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, మార్చి20: రైతులంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు అని బీఆర్‌ఎస్న్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని.. వడగళ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు. దిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల…

లిక్కర్‌ స్కామ్‌లో బోయినపల్లి అభిషేక్‌కు ఊరట

 మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు న్యూదిల్లీ,మార్చి20: దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న బోయినపల్లి అభిషేక్‌ రావుకు స్వల్ప ఊరట లభించింది. సుప్రీం కోర్టు బుధవారం అభిషేక్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అభిషేక్‌ భార్య అనారోగ్యంతో ఉందన్న కారణంగా ఐదు వారాల బెయిల్‌ను మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. అభిషేక్‌ను హైదరాబాద్‌కు వెళ్లేందుకు అనుమతించిన…

ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు వేయండి

స్పీకర్ గడ్డం ప్రసాద్ ను  కోరిన బిఆర్ఎస్ హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చి18: కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. స్పీకర్కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో పాడి కౌశిక్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డితో…

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం తరం కాదు

బిఆర్ఎస్ గతంలో ఏం చేసిందో చూసుకోవాలి బిజెపి, బిఆర్ఎస్లపై  మండిపడ్డ పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి18: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరం కాదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం నాడు గాంధీభవన్లో ఆయన డియాతో మాట్లాడుతూ… ప్రధాని మోదీ జగిత్యాల సభలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం…

అకాల వర్షాలతో అన్నదాతల ఆందోళన

వరంగల్,ప్రజాతంత్ర,మార్చి18:అన్నదాతలను ప్రకృతి పగబట్టింది. వాతావరణంలో ఏర్పడిన మార్పులు రైతులను కలవరపెడుతున్నాయి. చేతికందిన పంట వర్షార్పణం అయిపోతుండటంతో రైతులు దిగులుతో తలలు పట్టుకుంటున్నారు. మిర్చి పంటను కాపాడుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అసలే ఈ ఏడాది మిర్చికి సరైన ధర లేక తలలు పట్టుకుంటున్న రైతులకు ఇప్పుడు వాతావరణ ప్రతికూల పరిస్థితులు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి.…

మోదీ అసత్యాలు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల,ప్రజాతంత్ర,మార్చి18: జగిత్యాల సభలో ప్రధాని మోదీ అబద్దాలు మాట్లాడారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సోమవారం డియాతో మాట్లాడుతూ.. పసుపు సాగు పట్ల రైతులకు నమ్మకం లేదన్నారు. పసుపుకు కనీస మద్దతు ధర మోదీ ఇవ్వడం లేదని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు. నిన్నటిదాకా అధికారంలో ఉన్నది రే…

తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభం

నిమిషం గడువు ఎత్తేసిన బోర్టు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి18:  తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభ మయ్యాయి. 18నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి టెన్త్ పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పటికే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి…