Category ముఖ్యాంశాలు

డీజీపీ హెచ్చరించినా మారని తీరు

– ఏసీబీ ఉచ్చులో వరుసగా పోలీస్ అధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: “యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు.. శాంతిభద్రతలను కాపాడవలసిన వారు అక్రమ సంపాదనకు అలవాటు పడితే కఠిన చర్యలు తప్పవు” అంటూ బాధ్యతలు చేపట్టిన వెంటనే డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి రాసిన లేఖలో…

సీఎస్ఆర్ నిధులను ఖర్చుగా భావించొద్దు

– అది భవిష్యత్ తరాల కోసం పెట్టుబడి – విద్య, వైద్యం, జల వనరుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి – విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుదాం – కార్పొరేట్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: సమాజాభివృద్ధికి చేసేది ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.…

కూల్చినచోటే ఇళ్ళు కట్టించి ఇవ్వాలి

– సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్ – వెలుగుమట్ల బాధితుల ధర్నాతో దద్దరిల్లిన ధర్నా చౌక్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్లను కూల్చినచోటనే అందరికీ ప్రభుత్వం ఇళ్ల్లు నిర్మించి ఇవ్వాలనే నినాదాలతో హైదరాబాదులోని ధర్నా చౌక్ బుధవారం దద్దరిల్లింది. వెలుగుమట్లకు చెందిన దాదాపు 300మంది బాధితులు అనేక ఇబ్బందులను, అక్రమ అరెస్టులను ఎదుర్కొని…

ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణయే ఏటీఎం

– దిల్లీకి గులాంగిరీ చేస్తోన్న రేవంత్‌ ‌ప్రభుత్వం – కాంగ్రెస్‌ అవినీతిపై ఇక నిరంతరంగా నిలదీస్తాం – కొత్త పార్టీతో సామాన్యులకు అండగా నిలుస్తాం – ఏప్రిల్‌ 25 ‌చరిత్రను మార్చే రోజు అవుతుంది – జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8: ‌దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు…

జస్టిస్ ఘోష్ కమిషన్ పై తీర్పు 22కు వాయిదా

హైదరాబాద్, ఏప్రిల్ 8: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తన తీర్పును ఈ నెల 22కు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో అవకతవకలపై…

దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి మార్గం సుగమం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ‘ట్రూత్ సోషల్’ (Truth Social) పోస్ట్  “పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మరియు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌లతో జరిపిన సంభాషణల ఆధారంగా, మరియు ఈ రాత్రి ఇరాన్‌పైకి పంపబడుతున్న వినాశకరమైన బలగాలను నిలిపివేయవలసిందిగా వారు చేసిన అభ్యర్థన మేరకు, అలాగే హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz…

ఫలించిన పాకిస్తాన్ మధ్యవర్తిత్వం 

*వెనక్కితగ్గిన అమెరికా,ఇస్రాయిల్ * హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలకు ఇరాన్ అనుమతి  * రెండు వారాల పాటు ఇరుపక్షాలు  దాడుల విరమణ     అమెరికా మరియు ఇరాన్‌ల మధ్య మంగళవారం సాయంత్రం చివరి నిమిషంలో యుద్ధ విరమణ ఒప్పందం కుదిరింది. హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతించకపోతే, ఇరాన్  “మొత్తం…

రబీలో 8,251 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

– 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి – 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధం – అందుబాటులో 16 కోట్లకు పైచిలుకు గన్నీ బ్యాగులు – అనధికార మార్గాల్లో ధాన్యాన్ని తరలిస్తే ఉపేక్షించేది లేదు – సరిహద్దుల్లో ఎగుమతులు, దిగుమతులపై నిఘా – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి…

మావోయిస్టు రహిత ప్రాంతంగా కర్రెగుట్టలు

–  డీజీపీ శివధర్ రెడ్డి వెంకటాపురం (ములుగు), ఏప్రిల్ 7:  ప్రకృతి సౌందర్యానికి నిలయమైన ములుగు జిల్లాలోని కర్రేగుట్టల ప్రాంతం మావోయిస్టుల రహిత ప్రాంతంగా అవతరించిందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి ప్రకటించారు. జిల్లాలో మంగళవారం పర్యటించిన ఆయన పామునూరు వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి గిరిజన ప్రాంతాల…