ముదురుతున్న బెట్టింగ్‌ ‌యాప్స్‌ వ్యవహారం

ప్రచారం చేసిన టాలీవుడ్‌ ‌ప్రముఖులకు చిక్కులు
రానావిజయ్‌ ‌దేవరకొండప్రకాష్‌ ‌రాజ్‌లపై కేసు

బెట్టింగ్‌ ‌యాప్స్  ‌వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ యాప్‌లను ప్రమోట్‌ ‌చేసిన వారిలో ఉన్న ప్రముఖ నటీనటులపై మియాపూర్‌ ‌పోలీసులు కేసు నమోదు చేశారు. నటీనటులుసోషల్‌ ‌మీడియా ఇన్‌ప్లుయెన్సర్లు సహా మొత్తం 25 మంది ఈ జాబితాలో ఉన్నారు. సినీ ప్రముఖుల జాబితాలో రానా దగ్గుబాటివిజయ్‌ ‌దేవరకొండప్రకాశ్‌రాజ్‌‌మంచు లక్ష్మిప్రణీతనిధి అగర్వాల్‌ ఉన్నారు. సోషల్‌ ‌మీడియా ఇన్‌ప్లుయెన్సర్లలో అనన్య నాగళ్లసిరి హనుమంతుశ్రీముఖివర్షిణి సౌందరరాజన్‌‌వాసంతి కృష్ణన్‌‌శోభా శెట్టిఅమృత చౌదరినయని పావనినేహా పఠాన్‌‌పండుపద్మావతిఇమ్రాన్‌ఖాన్‌‌విష్ణు ప్రియహర్ష సాయిబయ్యా సన్నీ యాదవ్‌‌యాంకర్‌ ‌శ్యామలటేస్టీ తేజరీతూ చౌదరిబండారు సుప్రీత ఉన్నారు.

మియాపూర్‌ ‌వాసి ప్రమోద్‌ ‌శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  దాదాపు 25 మందిపై సైబారాబాద్‌కి చెందిన మియాపుర్‌ ‌పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్‌ ‌యాప్స్ ‌ప్రమోట్‌ ‌చేసి యువతను చెడగొడుతున్నారని మియాపుర్‌కి చెందిన ప్రమోద్‌ ‌శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ప్రమోషన్లను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన మియాపూర్‌ ‌పోలీసులు.. బెట్టింగ్‌ ‌యాప్స్ ‌ప్రమోట్‌ ‌చేసిన ప్రముఖ తెలుగు నటులు రానా దగ్గుబాటితో పాటు మంచు లఁ్‌మివిజయ్‌ ‌దేవరకొండప్రకాశ్‌రాజ్‌‌ప్రణీతశ్రీముఖిరీతూ చౌదరియాంకర్‌ ‌శ్యామలఅనన్య నాగళ్ల తదితరులపై కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page