– దౌర్బగ్య స్థితిలో కాంగ్రెస్ సర్కారు : కేంద్ర మంత్రి బండి
హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబర్22 : పెండింగ్ బకాయిలు అడిగితే బ్లాక్ మెయిల్ లాగా సీఎం రేవంత్రెడ్డి ఫీల్ అవుతున్నారని, కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ ఇతరత్రా పెండింగ్ బిల్లులు చెల్లించలేని స్థితిలో కాంగ్రెస్ సర్కారు ఉన్నదని కేంద్రమంత్రి బండిసంజయ్ ఫైర్ అయ్యారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలరాస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. బకాయిలు చెల్లించాల్సిందే అంటూ పట్టుబడిన బండి సంజయ్.. ప్రభుత్వానికి పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులతో బ్లాక్ మెయిల్ చేస్తారా? విద్యార్థులు, యాజమాన్యాల భవిష్యత్తుతో చెలగాటమాడతారా? బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకుంటామా? కమీషన్లు రావనే సాకుతో బకాయిలు చెల్లించడం లేదా? అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని కూడా కాలరాస్తారా? పదేపదే ఇచ్చిన మాటను తప్పే వాళ్లను ఏమనాలి? బీహార్ ఎన్నికలకు పైసలు ఇక్కడి నుండే పంపుతున్నారు కదా? విద్యార్థుల భవిష్యత్తు కోసం బకాయిలు చెల్లించలేరా? ఈసారి తక్షణమే బకాయిలు మొత్తం చెల్లించాల్సిందే.. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవు’ అంటూ హెచ్చరించారు. విద్యార్థులు, యాజమాన్యాలతో కలిసి మంత్రులను రోడ్లపై తిరగనీయమని వార్నింగ్ ఇచ్చారు. యాజమాన్యాలూ….. ప్రభుత్వానికి భయపడి సమ్మె విరమిస్తే అంతే సంగతులు.. భవిష్యత్తులో ఎవరూ అండగా నిలబడే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలపైనా రోడ్డెక్కడం తథ్యమని వెల్లడించారు. మంత్రులు ప్రతి పనికి కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ సొమ్మును కాంగ్రెస్ హైకమాండ్కు కప్పం కడుతున్నారంటూ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగా.. ఈరోజు ఉదయం హైదరాబాద్లోని నల్లకుంట శంకర్మఠ్కు చేరుకున్న బండి సంజయ్.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రుంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతి స్వామి ఆశీస్సులను కేంద్రమంత్రి అందుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





