– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 1: గిరిజన నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా గిరిజన హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు కొనియాడారు. బ్రిటిష్ వలసవాదంపై తిరుగుబాటు చేసి గిరిజన సమాజానికి ఆరాధ్యదైవంగా నిలిచారన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 9 నుండి 16వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జనజాతీయ గౌరవ్ దివస్ వారోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యశాలలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రణాళిక రూపొందించారు. ఈ సమావేశానికి పార్టీ రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిర్సా ముండా పోరాట స్పూర్తి మన అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. గతంలో విస్మరణకు గురైన గిరిజన సమాజం, వారి గొప్ప సాంస్కృతిక వారసత్వం, కృషిని గుర్తిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి సంవత్సరం జన జాతీయ గౌరవ్ దివస్ను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. గిరిజన వర్గాల అభ్యున్నతికి మోదీ అహర్నిశలు కృషి చేస్తున్నారని, గిరిజన నాయకులు, కళలు, సంస్కృతులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు కృషి చేస్తూ ప్రపంచ నాయకులకు గిరిజన కళాఖండాలను అందించడం ద్వారా భారత గిరిజన సంస్కృతుల పట్ల ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెంచారని చెప్పారు. కార్యశాలలో ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ రవి నాయక్, జిల్లా ఇన్చార్జిలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





