జీవ ఇంధనం అనేది వాహనాలు, విద్యుత్తు, పరిశ్రమలకు శక్తినివ్వడానికి ఉపయోగపడే పునరుత్పాదక శక్తి వనరు. జీవ ఇంధనాలు మొక్కలు, జంతు కొవ్వులు, కూరగాయల నూనెలు వంటి జీవ మూలాల నుండి తయారవుతాయి.ఇప్పటికే కొన్ని కార్లు, ట్రక్కులు ఈ పునరుత్పాదక ఇంధనాన్ని ఉపయోగించి నడుస్తున్నాయి. ఎక్కడ నుండి తయారవుతాయి: బయోడీజిల్ అనేది కూరగాయల నూనెలు, జంతువుల కొవ్వుల వంటి జీవసంబంధ మూలాల నుండి ఉత్పత్తి చేయబడిన పునరుత్పాద స్థిరమైన ఇంధనం. పునరుత్పాదక డీజిల్ సాధారణ వంట నూనె నుండి వచ్చే ఈ జీవ ఇంధనాన్ని సాంప్రదాయ ఇంధనానికి బదులుగా ఉపయోగించవచ్చు. బయోగ్యాస్ వ్యవసాయ వ్యర్థాలు, పేడ, ఆహార వ్యర్థాలు, మురుగు వంటి సేంద్రియ పదార్థాల వాయురహిత కుళ్ళిపోవడం ద్వారా ఏర్పడే పునరుత్పాదక వాయువు. బయోఇథనాల్ మొక్కజొన్న, చెరకు, చక్కెర దుంపలు లాంటి పిండి పదార్ధాలు అధికంగా ఉండే పదార్థాల కిణ్వ ప్రక్రియ ద్వారా పొందిన జీవ ఇంధనం. బయోబ్యుటనాల్ పంటలు, వ్యవసాయ వ్యర్థాలు, అటవీ వ్యర్థాలు వంటి సేంద్రీయ పదార్థాల కిణ్వ ప్రక్రియ ద్వారా వచ్చే ఒక రకమైన జీవ ఇంధనం. ఇది ఇతర జీవ ఇంధనాలతో పోలిస్తే దీని అధిక శక్తి సాంద్రత కారణంగా సులభంగా నిల్వకు రవాణాకు అనుకూలంగా ఉంటుంది.
మన దేశంలో వీటి పరిస్థితి: భారతదేశంలో శిలాజ ఇంధనాలతో పోలిస్తే తక్కువ ధర కారణంగా జీవ ఇంధనాల వినియోగం సంవత్సరాలుగా క్రమంగా పెరుగుతోంది. రవాణా, వ్యవసాయం విద్యుత్ ఉత్పత్తి వంటి వివిధ పరిశ్రమలు రంగాలలో జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రభుత్వం చాలా కాలంగా ప్రోత్సహిస్తోంది. ప్రస్తుత పురోగతి ఆధారంగా 2025 సంవత్సరం నాటికి 20 శాతం బ్లెండిరగ్ లక్ష్యం పూర్తవుతుంది. మే 2024లో దేశం 15 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని విజయవంతంగా సాధించింది. 2025 నాటికి 20 శాతం లక్ష్యాన్ని చేరుకునే దిశగా పయనిస్తుంది. బయో ఫ్యూయల్ ఇంటిగ్రేషన్తో పాటు, కార్బన్ ఉద్గారాలను తగ్గించే భారతదేశ వ్యూహంలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను ప్రారంభించబడిరది. మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ (10 మెగావాట్లు) 27 మే 2024న ప్రారంభించబడిరది. 2018 లో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామిన్ పథకం కింద గోబార్ (గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో-అగ్రో రిసోర్సెస్) పథకం ప్రారంభించబడిరది. ఉపయోగించిన వంట నూనెను సేకరించి బయోడీజిల్గా మార్చే పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ ద్వారా రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ కార్యక్రమం ప్రారంభించబడిరది. బయోఇథనాల్ను ఉత్పత్తి చేయడానికి మిగులు ఆహార ధాన్యాలు మరియు బయోమాస్ను ఉపయోగించుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతించింది.
2013-14 ఇథనాల్ సరఫరా సంవత్సరంలో భారతదేశం యొక్క ఇథనాల్ సామర్థ్యం 1.53% నుండి 2020-21లో 7.93%కి పెరిగినట్లు నివేదించబడిరది. 2013-14లో 38 కోట్ల లీటర్లు ఉన్న ఇథనాల్ సరఫరా 2020-21లో 322 కోట్ల లీటర్లకు పెరిగింది. డిమాండ్ పెరుగుదల కారణంగా, ఇథనాల్ స్వేదనం సామర్థ్యం కూడా 215 కోట్ల లీటర్ల నుండి ఏటా 427 కోట్ల లీటర్లకు రెట్టింపు అయింది. 2014-15లో 157 ఉన్న డిస్టిలరీల సంఖ్య 5 సంవత్సరాలలో 40% పెరిగి 2019-20లో 231కి చేరుకుంది. దేశంలో బయో-డీజిల్ మిశ్రమం 2001లో పైలట్ ప్రాతిపదికన ప్రారంభమైంది. ప్రభుత్వం జూన్ 2018లో జీవ ఇంధనాలపై జాతీయ విధానాన్ని ఆమోదించింది. ఈ పాలసీ లక్ష్యం 2030 నాటికి 20% ఇథనాల్ బ్లెండిరగ్ 5% బయోడీజిల్ బ్లెండిరగ్కు చేరుకోవాలని లక్ష్యంగా మన దేశం పెట్టుకుంది. ఇతర విషయాలతోపాటు, ఈ విధానం ఇథనాల్ కోసం ఫీడ్స్టాక్ పరిధిని విస్తరిస్తుంది. ఉత్పత్తితోపాటు అధునాతన జీవ ఇంధనాల ఉత్పత్తికి ప్రోత్సాహకాలను అందించింది. జీవ ఇంధనాల రంగం పురోగతి కారణంగా ఈ విధానం మే 2022లో సవరించబడిరది.
వీటి ఆవశ్యకత: గ్లోబల్ వార్మింగ్కు గణనీయంగా దోహదపడే బొగ్గు వంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. సాంప్రదాయ శిలాజ ఇంధనాలతో పోలిస్తే ఇవి తక్కువ కార్బన్ మోనాక్సైడ్, విషపూరిత ఉద్గారాలను విడుదల చేయడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడమేగాక ముడి చమురుపై దిగుమతి ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. జీవ ఇంధనం పర్యావరణానికి అనుకూలమైనది. ఇవి ప్రస్తుతం వాడుతున్న ఇందనాల కంటే 86 శాతం వరకు తక్కువ గ్రీన్ హౌస్ వాయువులను 47 శాతం తక్కువ రేణువులను ఉత్పత్తి చేస్తాయి. ప్రస్తుతం ప్రపంచ రవాణాలో వీటి వాటా మూడు శాతంగా ఉంది. 2050 సంవత్సరం నాటికి వీటి వాటా 25 శాతంగా ఉండాలని పారీస్ లో ఉన్న అంతర్జాతీయ ఇంధన సంస్థ అన్ని దేశాలకు సూచింది. శిలాజ ఇంధనాలతో పోలిస్తే ఇవి తక్కువ గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేస్తాయి. జీవ ఇంధనాల ఉత్పత్తి, వినియోగం వ్యవసాయం, ఇంజనీరింగ్ రవాణాతో సహా వివిధ పరిశ్రమలలో కొత్త ఉద్యోగాలను సృష్టించగలదు. ఇది సానుకూల ఆర్థిక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
-డి.జె మోహనరావు
యం.ఎస్సీ(ఫిజిక్స్) టీచర్, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్, 8247045230.