– బంగారం తయారీ విధానాన్ని వివరించిన అధికారులు
బెంగళూరు, ఆగస్టు 28 : కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాలోని హట్టి గోల్డ్ మైన్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం సందర్శించారు. దేశంలోనే ఏకైక ప్రభుత్వ రంగానికి చెందిన ఈ బంగారం ఉత్పత్తి సంస్థలోని ప్రొడక్షన్ యూనిట్, బంగారం శుద్ధి కేంద్రం, ఎలక్ట్రో విన్నింగ్ కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మైన్స్ అధికారులు బంగారం తయారీ విధానాన్ని ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజూ సగటున 2 నుంచి 4 కిలోల బంగారం తయారవుతుందని అధికారులు వివరించారు. సింగరేణి సంస్థ వేలంలో దక్కించుకున్న దేవదుర్గ బంగారం-రాగి ఖనిజ అన్వేషణ బ్లాక్ కూడా ఈ హట్టి గోల్డ్ మైన్స్ సమీపంలోనే ఉండటం గమనార్హం. భట్టి విక్రమార్క భూగర్భ గనితోపాటు ఓపెన్ కాస్ట్ గనిని కూడా పరిశీలించారు. అయన వెంట సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి, ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జీఎం పంకజ్ కులశ్రేష్ఠలతోపాటు ఇతర అధికారులు ఉన్నారు. మైన్ వ్యూ పాయింట్ నుండి బంగారం ముడి మట్టి వెలికితీత ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించారు. ఎంత లోతు నుంచి బంగారం ముడి సరకు సేకరిస్తున్నారో అధికారులను అడిగి తెలుసుకున్న భట్టి విక్రమార్క బంగారం ఖనిజ గనికి సంబంధించిన సమగ్ర మ్యాప్లను సమగంగ్రా పరిశీలించారు. గత అయిదేళ్ల బంగారం ఉత్పత్తి వివరాలను డిప్యూటీ సీఎంకు మైనింగ్ అధికారులు వివరించారు. ఓపెన్ కాస్ట్తో పాటు భూగర్భ (అండర్గ్రౌండ్) గని ఉత్పత్తుల వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా యూటి ఓపెన్ కాస్ట్ గోల్డ్ మైన్లో ఆయన మొక్కను నాటారు.
రాయచూరులో భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం
రాయచూరు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. మాజీ మంత్రి ఎన్.ఎస్.బోసురాజు తనయుడు, కాంగ్రెస్ యూత్ లీడర్ రవి బోసురాజు ఆధ్వర్యంలో రాయచూరు అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉప ముఖ్యమంత్రికి అత్యంత ఘనంగా, ఆత్మీయంగా స్వాగతం పలికారు. విశ్వవిద్యాలయం ప్రాంగణానికి చేరుకున్న భట్టి విక్రమార్కకు రవి బోసురాజుతోపాటు భారీ సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉప ముఖ్యమంత్రిపై తమకున్న అభిమానాన్ని, గౌరవాన్ని ఈ సందర్భంగా చాటుకున్నారు.ఈ పర్యటనను పురస్కరించుకుని నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చడంతో అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాలన్నీ పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహం, జయజయధ్వానాల మధ్య భట్టి విక్రమార్క పర్యటన వైభవంగా జరిగింది.
————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




