prajatantra_news

prajatantra_news

కొత్త ఎత్తుగడల అన్వేషణలో ట్రంప్‌

యుద్ధంలో జోక్యం చేసుకోవాలా.. వద్దా.. నిర్ణయానికి వచ్చేందుకు రెండు వారాలు తీసుకుంటానన్న అమెరికా అధినేత ప్రజాతంత్ర, ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఇజ్రాయెల్‌-ఇరాన్‌ పోరులో అమెరికా జోక్యం చేసుకోవాలా వద్దా అన్న నిర్ణయానికి వచ్చేందుకు రెండు వారాల సమయం తీసుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అకస్మాత్తుగా ప్రకటిం చడాన్ని శ్వేతసౌధం శాంతి చర్చలకు మరో అవకాశంగా…

బ్రిడ్జి గుంతలో పడ్డ కారు

ఇద్దరు మృతి కామారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌19 : ఎల్లారెడ్డి మండలం లోని మల్లయ్యపల్లి గ్రామ శివారులో నేషనల్‌ హైవే నిర్మాణంలో భాగంగా పోచారం కాలువపై నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి గుంతలో బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు కారు పడడంతో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పాపన్నపేట…

ఆపరేషన్‌ కగార్‌ నిలిపివేయండి

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి డిమాండ్‌ వరంగల్‌, ప్రజాతంత్ర, జూన్‌19: ఆపరేషన్‌ కగార్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం అమాయకులను చంపుతోందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఆరోపించారు. ఆపరేషన్‌ కగార్‌ని వెంటనే నిలిపివేయాలని కోరారు. ఓ బీసీ ఉద్యమకారుడిని ఎన్‌కౌంటర్‌ చేయడం బాధాకరమని అన్నారు. ఆపరేషన్‌ కగార్‌ని నిలిపివేయాలని ఆందోళనలు చేస్తామంటే పోలీసులు అడ్డుకున్నారని గుర్తుచేశారు.…

20న యోగా కౌంట్‌ డౌన్‌ మహోత్సవం

ఎల్బీ స్టేడియంలో  ఏర్పాట్లు హైదారబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 19: హైదరాబాద్‌లో ఐదారు సంవత్సరాలుగా పెద్దఎత్తున అంతర్జాతీయ యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఈసారి కూడా ఈనెల 21న యోగా జేఏసీ అనే సంస్థ యోగా వేడుకల కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు, బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు…

తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ భేష్‌

– సీఎం రేవంత్‌ రెడ్డికి యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ ప్రశంసలు – లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ మార్చుకున్న తెలంగాణ, టీబీఐజీసీ ప్రతినిధులు   దిల్లీ: తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ అద్భుతంగా ఉందని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్‌ ప్రశంసించారు. 1997-2007 మధ్య పదేళ్లపాటు యూకేకు…

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-II మంజూరు చేయండి

banakacharla

కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్‌ వినతి దిల్లీ, జూన్‌ 19: హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-IIకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢల్లీిలో కేంద్ర మంత్రి ఖట్టర్‌తో ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి…

ఘనంగా రాహుల్‌ జన్మదిన వేడుకలు

ప్రజాభవన్‌లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కేక్‌ కట్‌ చేసిన ఉప ముఖ్యమంత్రి వసహపంక్తి భోజనాలు రాహుల్‌ గాంధీని ఆశీర్వదించిన కార్మికులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 19: మహాత్మాజ్యోతి రావు ఫూలే ప్రజాభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఖైరతాబాద్‌ జోన్‌కు చెందిన జీహెచ్‌ఎంసీ…

సెల్‌ఫోన్‌ ఇవ్వాల్సిందేనంటున్న ఏసీబి

కుదరదంటున్న మాజీ మంత్రి కెేటీఆర్‌ పట్టుదలగా వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 19: ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసు ఇప్పుడు సెల్‌ఫోన్‌ చుట్టూనే తిరుగుతోంది. కేటీఆర్‌ సెల్‌ఫోనే ఏసీబీ అధికారులకు కీలకంగా మారింది ఆ ఫోను ఇచ్చేది లేదని కేటీఆర్‌ ఏసీబీకి కరాఖండిగా తేల్చి చెప్పారు. గతంలో వాడిన సెల్‌ఫోను ఇప్పుడు తన…

వేగంగా రైతుభరోసా నిధుల బదిలీ

రైతు ఖాతాల్లో నేరుగా నగదు జమ 62.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 19: ‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసాను రికార్డు వేగంతో పంపిణీ చేస్తోంది. కేవలం తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు…

కేబినెట్‌ నిర్ణయించకుండా పనులు చేపడతారా?

సీఎం రేవంత్‌ రెడ్డికి ఈ విషయం తెలియదా కాళేశ్వరం కూడా కేబినేట్‌ నిర్ణయం మేరకే జరిగింది ప్రాజెక్టులు కట్టడం వేరు.. అవినీతి చోటుచేసుకోవడం వేరు అందుకే కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణను కోరుతున్నాం సీఎం వ్యాఖ్యలపై ఎంపీ ఈటల రాజేందర్‌ స్పందన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 19: ‌సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ ప్రొజెక్టులు రీ డిజైన్‌లో…