శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త
హైదరాబాద్, సెప్టెంబర్ 21 : శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు తిరుమలకు వెళ్లాలనుకుంటున్న భక్తులకు రైల్వే శాఖ శుభవార్తను అందించింది. బుధవారం నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. సికింద్రాబాద్-తిరుపతి రైలుతోపాటు నాందేడ్-తిరుపతి రైళ్లు నడిపేందుకు నిర్ణయించింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26న అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. రెండేండ్ల అనంతరం…
