NEWS

NEWS

యాంటీబయాటిక్స్ అతి వాడకంతో ఆరోగ్య సంక్షోభం

‘‘‌వీటిని పరిమితికి మించి వాడటం వల్ల మన శరీరం రోగ నిరోధక శక్తిని కోల్పోతుందని, దాని వల్ల వాతావరణం, వయస్సు రీత్యా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను తట్టుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.యాంటీబయోటిక్స్‌ను విచ్చలవిడిగా వాడటంపై ప్రపంచవ్యాప్తంగా అనేకమంది నిపుణులు, వైద్య సంస్థలు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.’’ బ్యాక్టీరియా, వైరస్‌ ‌వంటివి యాంటీబయాటిక్స్‌ను తట్టుకుని…

గుజరాత్‌ ‌సిఎంగా భూపేంద్ర పటేల్‌ ‌ప్రమాణం

హాజరైన ప్రధాని మోదీ, అమిత్‌ ‌షా, మంత్రులు హిమాచల్‌లో సిఎంగా సుఖ్వీందర సింగ్‌ గాంధీనగర్‌, ‌డిసెంబర్‌ 12 : ‌గుజరాత్‌ ‌సీఎంగా రెండోసారి భూపేంద్ర పటేల్‌ ‌ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ , ‌భూపేంద్ర పటేల్‌ ‌తో  ప్రమాణం చేయించారు. వీరితో పాటు 16 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోడీ,…

ఎపిలో పలు జిల్లాలో తీవ్ర పంట నష్టం

గుంటూరు, డిసెంబర్‌ 12 : ఎపిలో మాండూస్‌ ‌తుఫాను రైతులకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. ముఖ్యంగా పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. రైతుల వెన్ను విరిచింది. తుపాను తీరం దాటిన తర్వాత కూడా వర్షాలు కూడా వర్షాలు కొనసాగి ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. ముసురు వాతావరణం, చలి గాలులు మాత్రం కొనసాగాయి. తమ పొలాల్లోని…

శబరిమలలో అయ్యప్ప దర్శనానికి పోటెత్తిన భక్తులు

తిరువనంతపురం, డిసెంబర్‌ 12 : ‌కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల భక్తుల తాకిడితో కిటకిటలాడుతుంది. కొండ మొత్తం అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతోంది. స్వామి దర్శనానికి గతంలో ఎన్నడూలేని విధంగా భక్తులు తరలివస్తున్నారు. భక్తులు అత్యధిక సంఖ్యలో శబరిమలకు తరలి రావడంతో ఆలయ ప్రాంగణంలో రద్దీ నెలకొంది. అయ్యప్ప దర్శనానికి సుమారు 10 నుంచి 12 గంటల…

నేడు ఎపి మంత్రి మండలి సమావేశం

సిఎం జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో భేటీ పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం అమరావతి, డిసెంబర్‌ 12 : ఎపి మంత్రి వర్గం ఈ నెల 13 న మంగళవారం సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఈ కేబినెట్‌ ‌భేటీ జరగనుంది. సీఎం జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. కేబినెట్‌ ఆమోదం…

మైత్రీమూవీ మేకర్స్ ‌కార్యాలయాల్లో ఐటి సోదాలు

హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 12 : ‌ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ‌కార్యాలయాల్లో  ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి15 చోట్ల  సోదాలు కొనసాగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ‌పుష్ప, శ్రీమంతుడు, సర్కార్‌ ‌వారి పాట ,రంగస్థలం, జనతా గ్యారేజ్‌ ‌మూవీతో పాటు పలు సినిమాలు నిర్మించారు. గతేడాది పుష్ప అంతర్జాతీయ…

స్మార్ట్ ‌ఫోన్‌ అతిగా వాడడం వరమా, శాపమా..!

(‘లోకల్‌ ‌సర్కిల్స్’ ‌సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ఆధారంగా) కొరోనా కల్లోలంలో విశ్వ మానవాళి జీవనశైలిలో పలు అనివార్య మార్పులు చోటు చేసుకున్నాయి. లాక్‌డౌన్లు, క్వారంటైన్లు, భౌతిక దూరాలు, పరిశుభ్రత పాఠాలు, ఆన్‌లౌన్‌ ‌విద్యాబోధనలు, వర్క్‌ఫ్రమ్‌ ‌హోమ్‌ ఆచారాలు, ఆన్‌లైన్‌ ‌జూమ్‌ ‌సమావేశాలు మానవ జీవితంలో ప్రవేశించాయి. విద్యాలయాల మూసివేత, ఆన్‌లైన్‌ ‌చదువులతో విద్యార్థి…

ద్రోణుడు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి కురుపాండవులలో సహావృష్టి, అంధక వంశీయులతో పాటుగా కర్ణుడుకూడా  ఆయన వద్ద విద్యాభ్యాసం గావించారు. అర్జునుడు అస్త్ర, శస్త్ర, విద్యలలో ఎంతగానో పరిణతిచెందాడు. వినయ విధేయలతో ద్రోణుని వాత్సల్యాన్ని పొందాడు. కర్ణుడు అర్జునుడితో స్పర్ధవహించి, దుర్యోదనుడితో సఖ్యంగా ఉంటూ వచ్చాడు. ద్రోణుడు రాజకుమారులకు గద, విల్లు, ప్రాసము, కత్తి వంటి…

తేనీటితో మానసిక ఉల్లాసం

తేనీరు (Tea)  ఒక పానీయం. తేయాకును నీటిలో మరిగించి వచ్చిన ద్రావకాన్ని తేనీరు (టీ) అంటారు. మానవ దేహానికి ఉత్తేజాన్ని కల్గించే ఆహార పదార్ధాలలో టీ ప్రథమ స్థానంలో ఉంటుంది. దీనిలో పంచదార, పాలు కలుపుకొని త్రాగుతారు. నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే వరకు మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైంది. నిస్సత్తువగా ఉన్నా, ఉల్లాసంగా…

కెజి కన్నబిరాన్ ’24 గంటలు’ విశ్వవ్యాపితం..

ఇంగ్లీష్ అనువాదం ‘The  Speaking Constitution’ ఆవిష్కరించిన   కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నిఖిలేశ్వర్  మానవ హక్కులకై ఆఖరి వరకు పోరాడిన శక్తి కన్నబిరాన్  పౌర సమాజానికి ఆదర్శం..: వక్తలు ఖైరతాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : మానవ హక్కులకై ఆఖరి వరకు పోరాడిన శక్తి కెజి.కన్నభిరాన్ అని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార…