NEWS

NEWS

శబరిమల యాత్రలో విషాదం..అర్థరాత్రి లోయలోపడ్డ వాహనం

8 మంది అయ్యప్ప భక్తుల దుర్మరణం భక్తులంతా తమిళనాడు వాసులగు గుర్తింపు సహాయక చర్యల చేపట్టిన కేరళ పోలీసులు తిరువనంతపురం, డిసెంబర్‌ 24 : ‌శబరిమల యాత్రలో విషాదం చోటు చేసుకుంది. అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడడంతో 8 మంది అక్కడికక్కడే కన్నుమూశారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి…

ఐసీఐసీఐ బ్యాంక్‌ ‌మాజీ సీఈవో చందా కొచ్చర్‌ అరెస్ట్

ముంబై, డిసెంబర్‌ 24 : ఐసీఐసీఐ బ్యాంక్‌ ‌మాజీ సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ ‌కొచ్చర్‌లను సీబీఐ అధికారులు అరెస్ట్ ‌చేశారు. 2009 ఆగష్టులో వీడియోకాన్‌ ‌గ్రూప్‌ అధినేత వేణుగోపాల్‌ ‌ధూత్‌ ‌నాయకత్వంలోని.. వీఐఈఎల్‌ ‌కంపెనీకి రుణాలు మంజూరు చేయడంలో అవినీతికి, అవకతవకలకు పాల్పడినట్టు నమోదైన కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు. కస్టడీ…

దివంగత ఎన్టీఆర్‌ ‌భోలా మనిషి

అందుకే వెన్నుపోటుకు గురయ్యారు గుంటూరులో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు గుంటూరు, డిసెంబర్‌ 24 : ‌కీర్తి శేషులు ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఎన్టీఆర్‌ ‌భోలా మనిషని అందుకే వెన్నుపోటుకు గురయ్యారని అంటూ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యనాయుడు శనివారం తెనాలిలో ఎన్టీఆర్‌ ‌శతజయంతి ఉత్సవాల్లో…

విదేశాల నుంచి వచ్చే వారికి కోవిడ్‌ ‌టెస్ట్

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 24 : ‌ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అలర్ట్ అయింది కేందప్రభుత్వం. చైనా, జపాన్‌, ‌సౌత్‌ ‌కొరియా, హాంకాంగ్‌, ‌థాయ్‌ ‌లాండ్‌ ‌నుంచి వచ్చే ప్రయాణికులకు..కోవిడ్‌ ‌టెస్ట్ ‌తప్పనిసరి చేస్తామన్నారు కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్సుఖ్‌ ‌మాండవీయ. టెస్టులో పాజిటివ్‌ ‌వచ్చినా.. కరోనా లక్షణాలు ఉన్నా క్వారంటైన్‌ ‌లో ఉంచుతామన్నారు. విమానయాన…

బీహార్‌లో ఇటుక బట్టీ పేలుడులో 9 మంది మృతి

పాట్నా, డిసెంబర్‌ 24 : ‌బీహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు చంపారణ్‌ ‌జిల్లాలోని నారీగిర్‌ ‌గ్రామంలో ఓ ఇటుక బట్టీకి చెందిన ఎత్తైన చ్ని పేలిపోయింది. ఈ ఘటనలో 9మంది కార్మికులు మృతి చెందారు. 10 మందికిపైగా గాయపడ్డారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసు బలగాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారికి…

ఏటా బూస్టర్‌ ‌డోస్‌ ‌తీసుకోవాల్సిందే

హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 24 : ‌ప్రపంచ దేశాలపై కరోనా విజృంభిస్తోన్న వేళ ఏఐజీ చైర్మన్‌ ‌డాక్టర్‌ ‌నాగేశ్వర్‌రెడ్డి వ్యాక్సిన్‌ ‌గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.  బూస్టర్‌ ‌డోస్‌గా కార్బోవ్యాక్స్ ‌టీకాను తీసుకోవడం ఉత్తమమని, దీని వల్ల ఐజీజీ యాంటిబాడీస్‌ ‌స్థాయిలు అత్యధికంగా పెరగడమే కాకుండా మెమరీ సెల్స్ ‌సైతం ఎక్కువ కాలం పాటు ఉంటున్నాయని నాగేశ్వర్‌రెడ్డి…

మరియాపోల్‌లో డ్రామా థియేటర్‌ ‌కూల్చివేత

మాస్కో, డిసెంబర్‌ 24 : ఆ‌క్రమించుకున్న ఉక్రేనియన్‌ ‌నగరం మరియాపోల్‌లో డ్రామా థియేటర్‌ ‌కూల్చివేత పనులను శుక్రవారం రష్యా ప్రారంభించింది. ఉక్రెయిన్‌పై గత మార్చి నెలలో జరిపిన బాంబు దాడుల్లో ఈ థియేటర్‌లో చాలా భాగం ధ్వంసమైంది. ఈ బాంబు దాడిలో వందలాది మంది మరణించారని ఉక్రెయిన్‌ ఆరోపిస్తున్నది. డ్రామా థియేటర్‌ ‌కూల్చివేతకు సంబంధించిన ఫొటోలు,…

తిరుమలలో అధ్యయనోత్సవాలు ప్రారంభం

తిరుమల, డిసెంబర్‌ 23 : ‌తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 25 రోజుల పాటు జరుగనున్న అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుంచి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం…

విలక్షణ నటుడు కైకాల కన్నుమూత

హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 23 : ‌విలక్షణ, సీనియర్‌ ‌నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ ‌ఫిలింనగర్‌లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కైకాల మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్‌నగర్‌కు ఆయన భౌతికకాయం తరలించనున్నారు.…

చిత్రసీమలో కైకాలది ప్రత్యేక స్థానం – కెసిఆర్‌

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కైకాల సత్యనారాయణకు సిఎం కెసిఆర్‌ ‌ఘనంగా నివాళి అర్పించారు.  శుక్రవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కైకాల సత్యనారాయణ పార్థివదేహానికి సీఎం కేసీఆర్‌ ‌నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, ఓదార్చారు. నివాళులర్పించిన అనంతరం కేసీఆర్‌ ‌డియాతో మాట్లాడారు.…