NEWS

NEWS

ధీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: ధీరత్వానికి ప్రతీక , లౌకికవాదానికి పెద్ద పీట వేసిన మహోన్నత నాయకుడు ఛత్రపతి శివాజీ అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండల పరిధిలోని నల్తూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి…

ఇంద్రేశం అభివృద్ధికి జివిఆర్ ఎంటర్ప్రైజెస్ చేయూత

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 6: పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామంలో జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సహకారంతో 3 కోట్ల 46 లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక…

కెసిఆర్ ది పేదల పక్షం ప్రతి పథకం పేదలకు అంకితం

వికారాబాద్ జిల్లాలో 92000 మంది విద్యార్థులకు సీఎం అల్పాహారం. మన ఊరు మనబడి పథకంతో స్వరూపం మారిపోయిన పాఠశాలలు. విద్యా హబ్బుగా తెలంగాణ అవతరిస్తుంది.. మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: కెసిఆర్ ది పేదల పక్షం ప్రతి పథకం పేదలకు అంకితం అని ఎవరు ఎన్ని మాట్లాడినా…

మానవత్వం కోసం అన్వేషణ…

ఒక్కరోజుతోనే ముగిసిపోయే /  ఊరి జాతరలా ఎన్నికల పండగ… రాజకీయ గొంగట్లో/  విశీర్ణమౌతున్న విలువల గొంతుకలు/ ఎంత గుక్కపట్టి ఏడ్చినా /  రెక్కలు విదుల్చుకోలేక కునారిల్లుతున్నాయి అని వర్తమాన రాజకీయాల విచిత్రాలను ఓట్ల సంత కవితలో  డా.ఎన్‌. ఈశ్వరరెడ్డి విశ్లేషించారు. నాకొక మనిషి కావాలి అన్న శీర్షికన 43 కవితలతో ఆయన కవితా సంపుటి వెలువడింది.…

దుప్పటి

పక్క ఎక్కిన వెంటనే కౌగిట్లో చేరుతుంది! చీకటి మాటు సిగపట్లకు చాటు ఉంటుంది! తనువుతో సరసంలో ఒక్కోసారి కాళ్ళు కనిపిస్తే, ఇంకోమారు తల బయటకు వస్తుంది! చలి గిలిగింతలు ఎక్కువైతే వెచ్చని కౌగిలింతలు తనవే అవుతాయి! ఉహుహూ అంటూ సల్లాపానికి దిగితే ఆహాహా అంటూ ముద్దుల అల్లరి తనదే అవుతుంది! అలసిసొలసిన దేహానికి ఆదమరపు ఇస్తుంది!…

ఈ శతాబ్ది శతకం

కొన్ని ప్రవహించే మొహాలను చూశాను దేశాలను దాటుతూ నిరంతరాయంగా అవి కోరస్‌ ఆలపిస్తూ విషాద నాటకానికి తయారవుతున్నవి వాటి మాస్కులను ఏ యుద్ధబీజాలకో తగిలించి వ్యసనానికి సహనాన్ని నేర్పే పాత్రలకై విశ్వ గురుత్వ స్థిరాంకాలను ఏర్పరుస్తూ విఫలమైనవే.. అవి ఏడుస్తున్నప్పుడు కన్నీళ్ళు జిగురు రంగు రక్తపు చారలుగా మరకల మడతలుగా హోర్డింగ్‌ చేయబడ్డవి ఇది ప్రకటన!…

శరత్కాల చంద్రబింబం

సునామీలు సుడిగుండాలు కొండలు పిండి చేసేది యవ్వనం హద్దులు దాటే పద్దుల కు అడ్డుకట్ట వేసేది వృద్ధాప్యం వాగై వరదై ఉదృతమై ఉప్పొంగే ప్రవాహం యవ్వనం పారి పారి తేరుకున్న నిర్మల నిచ్చల జలం వృద్ధాప్యం అనుక్షణం ఆరాటంలో ఆవిరి అయ్యేది యవ్వనం కాగి కాగి చల్లారిన స్వచ్ఛమైన మైన పాలమీగడలు వృద్ధాప్యం కల్లోల కడలి…

సమూహం

భూమి ఆకాశం తూర్పు పడమర ధన ఋణ సంబంధం ఋణ ధన సంబంధం ధన ఋణ సంబంధాలు వెలుగు చీకట్ల బతుకు రేఖలు రెండింటి మధ్యే సర్వం అందుకే నడుస్తుంది విశ్వమానవ  జీవనం – రేడియమ్‌ 9291527757

నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం

23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం రావిర్యాలలో ప్రారంభించనున్న సిఎం కెసిఆర్‌ ‌దేశంలోనే ఎక్కడ లేని విధంగా మధ్యాహ్న భోజన పథకం..:రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం అర్బన్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 05 : ‌ప్రభుత్వ పాఠశాలను బాలోపేతం చేసెందుకు కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని విద్యా శాఖ మంత్రి సబితా…

నేడు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు

ప్రారంభించనున్న జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబర్ 5 : నేడు ఘట్ కేసర్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరుగనున్నాయి.. ఈ సమావేశాలకు సుమారు వెయ్యిమంది ముఖ్య నాయకులు హాజరవుతారని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తెలిపారు.బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా  సమావేశాలు…