NEWS

NEWS

ల్బీనగర్ ను నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను మధుయాష్కీ గౌడ్

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 17:  ఎన్నికల్లో తనకు ఒక ఛాన్స్ కల్పిస్తే ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం మనసురాబాద్ డివిజన్లో జక్కడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై, చంద్రపురి కాలనీ, సహారా ఎస్టేట్ కమ్యూనిటీ హాల్లో…

బీఆర్ఎస్ కు షాక్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 17: బహుజన ఆత్మగౌరవం కోసం గొంతెత్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా బిఎస్పి పార్టీ నుంచి బరిలో ఉన్న నీలం మధు ముదిరాజ్ కి సబ్బండ బహుజన వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది.నీలం మధు ముదిరాజ్ కి మద్దతుగా పెద్ద ఎత్తున నాయకులు యువత బహుజన సమాజ్ పార్టీలో చేరుతున్నారు.పటాన్ చెరు…

కుల మతాలకతీతంగా సంక్షేమ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 17: కులమతాలకతీతంగా సంక్షేమ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆయన మదినగూడ కిన్నెర గార్డెన్ లో జరిగిన పాస్టర్ అసోసియేషన్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలో అతిపెద్ద పార్టీ…

విజయోత్సవ ర్యాలిని తలపించిన బండారి లక్ష్మారెడ్డి ఇంటింటి ప్రచారం

 ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 17:    ఉప్పల్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో స్పీడ్ పెంచిన బండారి లక్ష్మారెడ్డి , గురువారం ఉప్పల్ సర్కిల్లోని రామంతపూర్ డివిజన్ లో, వాసవి నగర్, కామాక్షిపురం, వివేక్ నగర్, శ్రీనివాసపురం ఈస్ట్, ఓల్డ్ రామంతాపుర్ కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ, కేసీఆర్  ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ భారీ…

ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

మేడ్చల్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల అధికారులు, సిబ్బంది సంసిద్దంగా ఉండాలని ఈ విషయంలో ఎప్పటికప్పుడు వారికి అప్పగించిన విధులు నిర్వహించాలని మేడ్చల్  మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అదనపు…

నియోజకవర్గ బిఆర్ఎస్ కార్యదర్శిగా డిల్లి శ్రీధర్

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 17 : విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  చేతుల మీదుగా మహేశ్వరం నియోజకవర్గం కార్యదర్శిగా లేమూరు గ్రామానికి చెందిన డిల్లి శ్రీధర్ కి శుక్రవారం అధికారికంగా నియామక పత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,నా పైన నమ్మకంతో పదవి ఇచ్చినందుకు సబితారెడ్డికి ఎల్లవేళలా ఋణ పడి ఉంటానని ఆమె గెలుపే లక్ష్యంగా పని చేస్తానని,భారీ…

ధరణి పేరుతో తెలంగాణలో భారీ భూకుంభకోణం

ఖైరతాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : ధరణి పేరుతో తెలంగాణలో భారీ భూకుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ ప్రకాష్ జవదేకర్ అన్నారు. ఇది కాళేశ్వరం కుంభకోణం కంటే పెద్దదని ఆరోపించారు. ధరణి కారణంగా విలువైన భూమిని కోల్పోయారని ఇది లక్షలమంది తెలంగాణ రైతులు, ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అతిపెద్ద మోసం అన్నారు. కానీ…

కాంగ్రెస్ “ధాటికి బి ర్ స్ పతనం 

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 17:  షాద్ నగర్ నియోజకవర్గం లోని కోందుర్గు మండలం ఉమ్మెంత్యాల, లాలాపేట గ్రామాల్లో భారీ ప్రచారం కాంగ్రెస్ “ధాటి కి బి ర్ స్  కొట్టుకోపోతుందనీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో (హస్తం) విడుదలయ్యిందని షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్ధి “వీర్లపల్లి శంకర్” అన్నారు. కోందుర్గు…

అభ్యాస అనుభవాన్ని పొందిన ఆవిష్కార్ విద్యార్థులు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 17:  ఆవిష్కార్ జూనియర్ కళాశాల విద్యార్థులు, వారి అధ్యాపకులతో పాటు  హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని శుక్రవారం సందర్శించి విలువైన అభ్యాస అనుభవాన్ని పొందడంతో పాటు నాణ్యమైన విద్య, పరిశోధన, కార్యనిర్వాహక శిక్షణ ప్రపంచాన్ని అన్వేషించే అవకాశాన్ని పొందారు. గీతం విద్యా సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా నిర్వహించిన ఈ…

అధికారంలోకి వచ్చిన ఆడబిడ్డల పెళ్లిలకు లక్ష

కందుకూరు ప్రజాతంత్ర నవంబర్ 17 :తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డల పెళ్లిళ్లకు లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం సైతం ఇస్తామని మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని కందుకూరు మండలంలోని సరస్వతి గూడ,లేమూరు, అగర్మియగూడ,రాచులూరు,బేగంపేట్, మాదాపూర్ తదితర గ్రామాలలో ఆయన…