ఏఐ టెక్నాలజీతో అప్రమత్తం

– డీప్‌ఫేక్‌ ‌మోసాలతో జాగ్రత్త
-సేఫ్‌వర్డ్ ‌టెక్నిక్‌ ‌సూచించిన సిపి సజ్జన్నార్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ (ఏఐ) ఇప్పు‌డు మన జీవితంలో కీలకంగా మారింది. ఈ టెక్నాలజీ ఎంత శక్తివంతమైందో అంతే ప్రమాదకరంగా కూడా మారుతోంది. ముఖ్యంగా డీప్‌ఫేక్‌ ‌టెక్నాలజీ ద్వారా మన ముఖం, మన గొంతును కూడా కచ్చితంగా నకిలీగా సృష్టించడం సాధ్యమైంది. ఇప్పుడు ఎవరికైనా  వీడియో లేదా వాయిస్‌ను వాడి, మీరు మాట్లాడుతున్నట్టుగా నకిలీ సందేశాలు పంపడం, వీడియోలు తయారు చేయడం లేదా కాల్స్ ‌చేయడం సాధ్యమవుతోంది. దీంతో వ్యక్తిగత, ఆర్థిక మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా పలు దేశాల్లోనే కాకుండా మన దేశంలో కూడా డీప్‌ఫేక్‌ ఆధారంగా మోసాలు జరుగుతున్నాయి. కొంతమంది మోసగాళ్లు  స్నేహితులు, బంధువులు, సహచరులు లేదా అధికారులుగా నటిస్తూ డబ్బు లేదా వ్యక్తిగత సమాచారం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి మోసాలను గుర్తించడం చాలా కష్టంగా మారింది, ఎందుకంటే అవి నిజంగా ఉన్నట్లే కనిపిస్తాయి. ఇలాంటి మోసాల నుంచి రక్షణ పొందేందుకు ఒక సులభమైన కానీ అత్యంత ప్రభావవంతమైన పద్ధతి ‘సేఫ్‌ ‌వర్డ్’. అది మీరు  కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సహచరులతో మాత్రమే పంచుకునే ఒక ప్రత్యేక పదం లేదా సంకేతం. ఏదైనా అనుమానాస్పద కాల్‌ ‌లేదా మెసేజ్‌ ‌వస్తే, ఆ వ్యక్తి నిజమా కాదా తెలుసుకోవడానికి ఆ ‘సేఫ్‌ ‌వర్డ్’ అడగాల్సి ఉంటుంది. హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జన్నార్‌ ఈ ‌విషయంలో ప్రజలకు హెచ్చరిక చేశారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్త అవసరమని అన్నారు. సేఫ్‌ ‌వర్డ్ ఎలా ఉపయోగించాలంటే.. మీకు అత్యంత నమ్మకమైన వారితో ఒక ప్రత్యేక సేఫ్‌ ‌వర్డ్ ‌నిర్ణయించుకోండి. అనుమానాస్పద కాల్‌ ‌లేదా మెసేజ్‌ ‌వచ్చినప్పుడు ఆ వర్డ్ అడిగి ధృవీకరించండి. ఆ సేఫ్‌ ‌వర్డ్‌ను బయట ఎవరితోనూ పంచుకోకండి. బ్యాంక్‌ ‌వివరాలు,  వ్యక్తిగత సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకండి.  మన జీవితాన్ని సులభతరం చేస్తుంది, కానీ అదే మన భద్రతకు ప్రమాదం కావచ్చు. టెక్నాలజీపై అవగాహన కలిగి ఉండటం, కొత్త మోసాలపై అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ‘సేఫ్‌ ‌వర్డ్’ ‌వంటి చిన్న జాగ్రత్త  పెద్ద ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడగలదన్నారు.  ఇలాంటి మోసాలపై అవగాహన పెంచే ప్రయత్నంగా హైదరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌ ఎక్స్ ‌లో ఒక హెచ్చరిక పోస్టు చేశారు. ఎఐ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో, అంతే జాగ్రత్త అవసరం అని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ భద్రత కోసం ‘సేఫ్‌ ‌వర్డ్’ ‌విధానం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఒక చిన్న జాగ్రత్త  పెద్ద మోసాల నుండి కాపాడుతుంది అంటూ సజ్జనార్‌ ‌విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page