– విషాదంలో 175కు పెరిగిన మృతుల సంఖ్య
– సహాయక చర్యలకు అనుమతి కోరిన జగ్గీ వాసుదేవ్
ఖాట్మండ్, ఆగస్ట్ 27 : నేపాల్ ప్రకృతి విలయంలో గల్లంతైనవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ జలప్రళయంలో 300 మంది వరకు భారతీయులు కొట్టుకుపోయినట్లు నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనాల్ గురువారం వెల్లడించారు. ఈ విషాదంలో మృతుల సంఖ్య 175కు పెరిగింది.నేపాల్ లోని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటన ప్రకారం ఈ ఆకస్మిక వరదల కారణంగా 826 మంది ఆచూకీ గల్లంతయ్యింది. వారిలో 85 మంది భద్రతా సిబ్బంది కాగా 162మంది వివిధ హైడ్రోపవర్ కేంద్రాల్లో పనిచేస్తోన్న ఉద్యోగులు ఉన్నారు. 579 పర్యాటకులు ఉన్నారని ఆ సంస్థ పేర్కొంది. వేలమంది నిరాశ్రయులయ్యారు. ఈ భారీ విపత్తు తీవ్రతను అంచనా వేస్తున్నాం అని ఖనాల్ పేర్కొన్నారు. అటు టిబెట్ వైపు 588 మంది గల్లంతయ్యారు. వారిలో 260 మంది విదేశీయులే. హిమాలయాల్లో కరిగిన మంచు జలవనరుల్లో నీటి మట్టాలను పెంచుతుందని, ఇప్పుడు మనందరం చూసింది అదేనని నేపాల్ మంత్రి అన్నారు. ఈ వరద మరింత దిగువకు ప్రవహించి ఉంటే భారత రాష్ట్రాలపైనా ప్రభావం పడేదన్నారు. గతంలోనూ ఇలా జరిగిన సందర్భాలున్నాయని గుర్తుచేశారు. భారత్, చైనా, నేపాల్, భూటాన్ పర్యావరణపరంగా అనుసంధానమై ఉన్నాయని, ఈ దేశాలు తమ విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మంచు చరియలు విరగడంతో టిబెట్ వైపు సంభవించిన వరద గురించి చైనాకు ముందే తెలిసినా నేపాల్ను అప్రమత్తం చేయలేదని తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి స్పందన వచ్చింది. ఈ వరదల్లో ఈశా ఫౌండేషన్కు చెందిన దాదాపు 80 మంది గల్లంతైన సంగతి తెలిసిందే. దీనిపై సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పందించారు. సహాయక చర్యల్లో సహకరించేందుకు తనతోపాటు మరికొంతమంది వలంటీర్లను అనుమతించాలని చైనా అధికారులను కోరారు. ప్రకృతి విపత్తుతో అల్లకల్లోమైన హిమాలయ దేశానికి భారత్ ఆపన్న హస్తం అందించింది. రెండు విమానాల్లో 47.5 టన్నుల సహాయక సామగ్రితోపాటు రెస్క్యూ బృందాలను ఖాఠ్మాండూకు పంపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


