హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11 : హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేత, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ రిలీజ్ అయింది. మార్చిల 16 నుంచి భట్టి పాదయాత్ర మొదలు కానుంది. జూన్ 15 వరకు పాదయాత్ర కొనసాగుతుంది. నిర్మల్ జిల్లా బజార్ హత్నూర మండలం పిర్పి నుంచి ప్రారంభమై.. ఖమ్మం జిల్లాలో ముగియనుంది. మొత్తం 91 రోజులు, 39 నియోజకవర్గాలు, 1,365 కిలోవి•టర్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేయనున్నారు.