మళ్లీ 16న హాజరు కావాలని ఆదేశం
న్యూ దిల్లీ, మార్చి 11 : శనివారం దాదాపు 9 గంటల పాటు కొనసాగిన కవిత ఈడీ విచారణ ముగిసింది. సుమారు రాత్రి 8.05 నిముషాలకు కవిత ఈడి కార్యాలయం నుంచి బయటకు వొచ్చారు. కాగా తిరిగి ఈ నెల 16 గురువారం రోజున తిరిగి విచారణకు హాజరు కావాలని ఈడి ఆదేశించినట్లు సమాచారం. అయితే విచారణ అనంతరం కవిత మీడియాతో మాట్లాడకుండానే ఈడి కార్యాలయం నుంచి నేరుగా తుగ్లక్ రోడ్లోని కెసిఆర్ నివాసానికి చేరుకోగా అక్కడ కుటుంబ సభ్యులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం హరీష్ రావు, కెటిఆర్ సహా మంత్రుల బృందంతో ఆమె హైదరాబాద్కు చేరుకున్నారు.