పబ్లిక్ పాలసీ థింక్ బ్యాంక్ తక్షశిల సంస్థ కో-ఫౌండర్ నితిన్ పాయ్ ఈ అంశం మీద వ్యాఖ్యానిస్తూ మన దేశంలో నిరుద్యోగ మహమ్మారిని పారదోలాలంటే కనీసం సాలీనా 20 మిలియన్ల ఉద్యోగాలను కల్పించాలి. ఎకానమీ అభివృద్ది చెందుతుందనుకుంటున్నాం. కాని నిరుద్యోగం వృద్ధిరేటు తీవ్రంగా ఉంది. పీరియడ్ లేబర్ఫోర్స్ సర్వే ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం 15 సంవత్సరాల వయసు నిండిన వారిలో నిరుద్యోగ రేటు 4.2 శాతం నుంచి 3.1 శాతం తగ్గింది. ఇందులో వాస్తవం ఎలా ఉన్నా, అభివృద్ది చెందుతుందనుకుంటున్న ఎకానమీ మాత్రం ఆశించిన రేటులో ఉద్యోగాల కల్పన చేయడం లేదు. డిమాండ్కు తగ్గట్టుగా ఉద్యోగాల కల్పన లేకపోవడంతో యువతో నిరాశా నిస్పృహ పెరుగుతోంది. నిరుద్యోగ తీవ్రత వల్లనే కేంద్రంలో బీజేపీ ఆశలు అడియాశలయ్యాయా? బీజేపీ టార్గెట్ ను అందుకోలేకపోయింది. 240 సీట్లతో సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత పది సంవత్సరాల్లో ఉన్నవారు, లేని వారి మధ్య ఆర్థిక వ్యత్యాసం పెరిగింది. గత పదేళ్లుగా కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. దేశంలో ఒక శాతం జనాభా చేతిలో దేశ సంపదలో 40 శాతం వారి వద్దనే ఉంది. 50 శాతం మంది వద్ద కేవలం 6.4 శాతం సంపద ఉంది.
- గ్రామీణ రంగంలో బుసలు కొడుతున్న నిరుద్యోగం
- అందుకే 240కు పరిమితమైన బీజేపీ బలం
దేశంలో ఎక్కడ చూసినా నిరుద్యోగం తాండవిస్తోంది. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు. పశ్చిమ తీరం నుంచి తూర్పు తీరం వరకు నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చింది. గుంటూరులో ఒక నవ యువకుడికి చిన్నప్పటి నుంచి పెద్ద యంత్రాలను చూడాలని, ఫ్యాక్టరీ నడపాలనే కోరిక ఉండేది. పేదవాడైన ఆ యువకుడు ఆఖరికి ఇంజనీర్ అయ్యారు. కాని ఉద్యోగం లేదు. మిర్చియార్డులో ఉద్యోగం దొరికింది. పదివేల రూపాయల వేతనంతో తిరగాలి. ఆయనకు ఉన్నదంతా ఒక ద్విచక్ర వాహనం మాత్రమే. నిరంతరం అసంతృప్తి, విసుగు, మాంద్యంతో ఆ యువకుడు బాధపడేవారు. ఇటువంటి వారే మన దేశంలో ఏ ఊరికి వెళ్లినా కనపడతారు. నిరుద్యోగ సమస్య తీవ్రతను ఈ సంఘటన సూచిస్తుంది. పబ్లిక్ పాలసీ థింక్ బ్యాంక్ తక్షశిల సంస్థ కో-ఫౌండర్ నితిన్ పాయ్ ఈ అంశం మీద వ్యాఖ్యానిస్తూ మన దేశంలో నిరుద్యోగ మహమ్మారిని పారదోలాలంటే కనీసం సాలీనా 20 మిలియన్ల ఉద్యోగాలను కల్పించాలి.
ఎకానమీ అభివృద్ది చెందుతుందనుకుంటున్నాం. కాని నిరుద్యోగం వృద్ధిరేటు తీవ్రంగా ఉంది. పీరియడ్ లేబర్ఫోర్స్ సర్వే ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం 15 సంవత్సరాల వయసు నిండిన వారిలో నిరుద్యోగ రేటు 4.2 శాతం నుంచి 3.1 శాతం తగ్గింది. ఇందులో వాస్తవం ఎలా ఉన్నా, అభివృద్ది చెందుతుందనుకుంటున్న ఎకానమీ మాత్రం ఆశించిన రేటులో ఉద్యోగాల కల్పన చేయడం లేదు. డిమాండ్కు తగ్గట్టుగా ఉద్యోగాల కల్పన లేకపోవడంతో యువతో నిరాశా నిస్పృహ పెరుగుతోంది. నిరుద్యోగ తీవ్రత వల్లనే కేంద్రంలో బీజేపీ ఆశలు అడియాశలయ్యాయా? బీజేపీ టార్గెట్ ను అందుకోలేకపోయింది. 240 సీట్లతో సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత పది సంవత్సరాల్లో ఉన్నవారు, లేని వారి మధ్య ఆర్థిక వ్యత్యాసం పెరిగింది. గత పదేళ్లుగా కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. దేశంలో ఒక శాతం జనాభా చేతిలో దేశ సంపదలో 40 శాతం వారి వద్దనే ఉంది. 50 శాతం మంది వద్ద కేవలం 6.4 శాతం సంపద ఉంది.
మధ్యతరగతిలో కూడా అనేక అంతరాలు ఉన్నాయి. దేశంలో కారు తయారీ దారుల వ్యాపారం పెరిగింది. ద్విచక్ర వాహనాల తయారీ దారుల పరిశ్రమ కంటే కార్ల వ్యాపారం పెరిగింది. కొరోనా తర్వాత దేశంలో వివిధ వర్గాల మధ్య అంతరాలు పెరిగాయి. ఎన్డీఏ ప్రభుత్వ అనుకూల వాదుల అభిప్రాయాలను విశ్లేషిస్తే గత పదేళ్లలో 248 మిలియన్ల మందిని దార్రిద్య రేఖ దిగువ నుంచి బయటకు తీసుకువొచ్చామంటున్నారు. కొంత మంది ఎకనామిస్టులు ఏమంటున్నారంటే, పెట్టుబడి వినియోగం పెరిగింది. ఈ ఖర్చు వల్ల దేశంలో ఎకానమీ పెరిగింది. అభివృద్ది వేగంగా చోటు చేసుకుంది. సంక్షేమ రంగంపై ఖర్చు తగినంతగానే చేసినా, ఆ ఫలాల డెలివరీ మెరుగుపడింది. సబ్సిడీలను నేరుగా లబ్ధిదారుడికి చేరేటట్లు చేశారని బీజేపీ ఆర్థిక నిపుణులంటున్నారు.
ఆర్థిక రంగ నిపుణులు మూడోతరం ఆర్థిక సంస్కణలను ప్రవేశపెట్టాలంటున్నారు. కాని సంకీర్ణ ప్రభుత్వం కొత్త సంస్కరణలను తీసుకురాగలదా ? మూడవ తరం సంస్కరణలను తీసుకువొచ్చే పరిస్థితులు కేంద్రంలో ఉన్నాయా… ఆర్ధిక సంస్కరణలను తీసుకువచ్చే పరిస్థితులు ఇప్పట్లో సాధ్యం కాకపోవొచ్చు. ఇండియా రేటింగ్స్ ప్రిన్సిపల్ ఎకనామిస్టు సీనియర్ డైరెక్టర్ సునీల్ కుమార్ సిన్హా మాట్లాడుతూ ఎకనామీ రంగం జోరందుకునేందుకు సంస్కరణలను తేవాల్సిన అవసరం ఉందంటున్నారు. ఆయన అంచనా ప్రకారం ఆర్ధిక సంస్కరణలు, న్యాయపరమైన వివాదాల పరిష్కార ప్రక్రియ వేగవంతం, వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని పటిష్టం చేయడం తదితర అంశాలపై దృష్టిని సారిస్తే మార్కెట్లో ఫండ్స్ ప్రవాహం వేగవంతమవుతుంది.
బీజేపీ ఆర్థిక విధానాలను చూస్తే పరిశ్రమలు, సేవా రంగాన్ని విస్తరించడం ద్వారా నిరుద్యోగ సమస్యను అధిగమించవొచ్చని భావిస్తోంది. కరెన్సీ నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఊపందుకోలేదు. దీనికి తోడు కొరోనా వల్ల ఈ రంగం చితికిపోయింది. గ్రామీణ రంగంలో పెద్ద ఎత్తున యువతలో నిరాశా నిస్పృహ చోటు చేసుకుంది.





