పుస్తకావిష్కరణ సభ
చందలూరి నారాయణరావు రాసిన కవితా సంపుటి ‘‘మనిషి గుర్తుల్ని బతికించుకుందాం…’’ పుస్తకావిష్కరణ సభ సెప్టెంబర్ 4 వ తేది ఆదివారం సాయంత్రం 5 గం. లకు ఒంగోలులోని యం.టి.ఆర్ కళాక్షేత్రంలో జరుగుతుంది. పుస్తక స్వీకర్త మండలి బుద్ధప్రసాద్, ఆవిష్కర్త విఠపు బాలసుబ్రహ్మణ్యం,సమీక్షలు: అన్నమనేని వెంకట్రావు మరియు జంద్యాల రఘుబాబు,బీరం సుందరరావు, తేళ్ల అరుణ,ఎన్. సి.హెచ్ చక్రవర్తి, పాలపర్తి హావీలా, సాగర్ శ్రీరామకవచం, ఆర్.వి.రాఘవరావు, డి. వి.యం.సత్యనారాయణ తదితరులు పాల్గొంటారు.
– సాహితి స్రవంతి, ప్రకాశం జిల్లా




