Take a fresh look at your lifestyle.

జోడో యాత్రలో ఊహించని ఘటన

రాహుల్‌ను కౌగిలించుకున్నఅపరిచితుడు
చండీఘడ్‌, ‌జనవరి 17 : రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం పంజాబ్‌లోని హోషియాపూర్‌ ‌లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అయితే రాహుల్‌ ‌యాత్రలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. పార్టీ శ్రేణులతో కలిసి నడుస్తున్న క్రమంలో ఓ వ్యక్తి అనూహ్యంగా రాహుల్‌ ‌గాంధీ దగ్గరకు వచ్చాడు. సెక్యూరిటీని తప్పించుకుని రాహుల్‌ను కౌగిలించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్‌ ‌శ్రేణులు సదరు వ్యక్తిని పక్కకు తీసుకెళ్లారు. అనూహ్య ఘటనతో రాహుల్‌ ‌గాంధీ ఒక్కసారిగా షాక్‌ ‌కు గురయ్యాడు. కాసేపటికి తేరుకుని యాత్ర కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ ‌గా మారింది.

Leave a Reply