ఎంపి సీట్ల కోసం బిజెపి పక్కా వ్యూహం

అయోధ్యను బాగా హైలెట్‌ చేసేలా ప్రచారం

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి10:పార్లమెంట్‌ ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో బీజేపీ అగ్రనేతలు మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.పార్లమెంట్‌ ఎన్నికలో బీజేపీ అంతుచిక్కని వ్యూహంతో ముందుకు వెళ్లనున్నట్లు స్పష్టమవుతోంది. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. పదిహేడు స్థానాలకు ఇంచార్జిలను ప్రకటించి ఎన్నికల శంఖారావం మోగించిన కమల సేన వ్యూహం పై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. పార్లమెంట్‌లో పది స్థానాలు పక్కాగా గెలవాలి అని టార్గెట్‌ పెట్టుకున్న బీజేపీ దానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇంచార్జిల అంశాన్ని బీజేపీ పెద్దలు చాల కీలకంగా తీసుకున్నారు. కాంగ్రెస అధికారంలో ఉండండతో పాటు, విపక్ష బిఆర్‌ఎస్‌ కూడా పోటీని తట్టుకుని ఎంపి సీట్లను గెల్చుకునే వ్యూహాలను అమలు చేయాలని చూస్తోంది. ప్రధానంగా అయోధ్యతో పాటు పలు జాతీయ అంశాలపై ఫోకస్‌ పెడుతోంది. అలాగే కాంగ్రెస్‌పైనా అప్పుడే విమర్శలను ఎక్కుపెడుతోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకొని ముఖ్య నాయకులకు బాధ్యతలు అప్పగించింది. అయితే 17 ఎంపీలకు ఇంచార్జిలను నియమించిన విధానం చూస్తే ఇంచార్జీలే అభ్యర్థులు అవ్వనున్నారా అనే అనుమనాం కూడా వస్తోంది.

అన్ని సీట్లలో కాకపోయినా కొన్ని స్థానాల్లోనైనా ఇంచార్జిలకు సీట్లు ఇస్తారా అనే చర్చ పార్టీలో జోరందుకుంది. ఇక ఎంపీ స్థానానికి కూడా పార్టీలో డిమాండ్‌ నెలకొంది. ఒక్కో సీట్‌ కోసం ఏకంగా ముగ్గురు నుంచి నలుగురు ఆశావాహులు ఢల్లీి స్థాయి నుంచి పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్‌ ఎంపీలతో పాటు సీనియర్‌ నాయకులు కూడా సీట్ల కోసం పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీ లక్ష్మణ్‌ కూడా ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారికి బాధ్యతలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా తాము అవలంబించిన గెలుపు వ్యూహాన్ని ఎంపీ ఎన్నికల్లో ఉపయోగిస్తారన్న ఆలోచలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఎక్కడ ఇబ్బందులు రాకుండా ప్రచారంతో పాటు పోల్‌ మేనేజ్‌ మెంట్‌ పక్కాగా ఉంటుందని బీజేపీ ముఖ్య నాయకులు భావిస్తున్నారు.

ఇందులో భాగంగానే వారికి ఇంచార్జి బాధ్యతతలు ఇచ్చినట్లు తెలుస్తోంది. గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో పాటు మాజీలు అందరికీ తమ సొంత పార్లమెంట్‌ నియోజవర్గ బాధ్యతలు అప్పటించారు. దీనివల్ల అసెంబ్లీ నియోజక వర్గాలను ప్రభావితం చెయ్యడంతో పాటు పక్క నియోజవర్గాలను కూడా కోఆర్డినేట్‌ చేసుకోవచ్చనేది పార్టీ అగ్ర నేతల వ్యూహంగా తెలుస్తోంది. నాలుగు సీట్లను గతంలో గెల్చుకోగా మోడీ ఛరిష్మాతో మరో 8 సీట్లను ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. అయోధ్య అంశాన్ని బాగా ప్రచారం చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇదే తమను గట్టెక్కించగలదని నేతలు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *