Take a fresh look at your lifestyle.

ఉద్యోగ రంగంలో అన్యాయాలపై సుధీర్ఘ పోరాటాలు

“చోటు చేసుకున్న అసమానతలను సమూలంగా రూపు మాపుతూ, ఉద్యోగ, పదోన్నతుల విషయంలో సమ న్యాయం పాటించేందుకు కేసిఆర్‌ ‌నేతృత్వం లోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో స్థానికత అంశంలో అసంతృప్తి వ్యక్తం అవుతూనే ఉంది. ఈ క్రమంలో, కోరి కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో గత పొరపాట్లు పునరావృతం కాకుండా, స్థానికత గురించి, తగు జాగ్రత్తలు తీసుకుని, స్ధానిక అంశానికి న్యాయం చేకూ ర్చాల్సిన అవసరం అనివార్యంగా ఉంది..”

డిసెంబర్‌ 30…610 ‌జీ ఓ జారీ అయిన రోజు

తెలంగాణ ప్రాంతీయులకు ఉద్యోగ రంగంలో దశాబ్దాలుగా జరిగిన అన్యాయాన్ని సవరించి చక్క దిద్దేందుకు నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 610 ‌జీ.ఓ. ((G.O.Ms.No.610 GA (SPF-A)Dept., Dt:: 30-12-1985) జారీ చేసిన రోజు డిసెంబర్‌ 30.. ‌తెలంగాణ స్థానికులకు జరిగిన అన్యాయం ఏమిటి? అది ఎలా జరిగింది? సవరింపులు, చక్కదిద్దడాలు జరిగాయా? ముల్కి నిబంధనలు, ఆరు సూత్రాల పథకం, పెద్దమను షుల ఒప్పందం, రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 ఉత్తర్వులు, గిర్గ్లానీ నివేదికలు, తెలంగాణ వాసులకు జరిగిన అన్యాయాన్ని నిలువరించ లేక పోయాయి. ఇందుకు సంబంధించి 610 ఉత్తర్వుల జారీ పూర్వాపరాల గురించి తెలిపే ప్రయత్నం ఇది.

ఆంగ్ల భాష రాదన్న సాకుతో, నిజాం పాలనలో ఉత్తరాది వారికే ఉద్యోగాలు అధికంగా దక్కగా, చాలాకాలం అనంతరం ఉవ్వెత్తున లేచిన ఉద్యమ ఫలితంగా మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ 1919‌లో ప్రవేశ పెట్టిన ముల్కీ నిబంధనల ప్రకారం తెలంగాణలోని ఉద్యోగాలన్నీ స్థానికులకే చెందాల్సి ఉండెను. దీని ప్రకారం 15 సంవత్సరాల కనీస నివాస యోగ్యతగా స్థానికత్వ నిర్ధారణ జరగాల్సి ఉండెడిది. అంతేకాక ఉద్యోగ విమణ తర్వాత కూడా తెలంగాణలోనే ఉండాలనే షర్తులు విధించ బడినాయి. తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగం పొందటానికి నివాస నిబంధన 12 సంవతరాలు ఉండాలని సవరించి, నిర్ణయించ బడింది. 1973 సెప్టెంబర్‌ 23‌న జారీ అయిన ఆరు సూత్రాల పథకంలో భాగంగా 1975 అక్టోబర్‌ 18‌న రాష్ట్రపతి ఉత్త ర్వులు 674 (ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌) G.O.Ms.No.674, GA (SPF-A) Dept., Dt: 20-10-1975) జారీ అయి రాష్ట్రాన్ని 1,2,3 కోస్తాంధ్ర, 4 రాయలసీమ మరియు 5,6 తెలంగాణ జోన్లుగా విభజించారు.

ఈ ఉత్తర్వులోని పేరా 14 ప్రకారం కొన్నింటిని స్థానిక రిజర్వేషన్ల పరిధి నుండి తప్పించడం జరిగింది. హైదరాబాద్‌ ‌లోని మినహాయించిన ఆఫీసులకు కాకుండా మిగిలిన అన్ని ప్రభుత్వ ఆఫీసులలో లోకల్‌ ‌రిజర్వేషన్‌ ‌పాటించాల్సిందని పేరా 20 సూచించింది. అలాగే పేరా 9 ప్రకారం 10వ తరగతి నుండి కింది స్థాయి 4వ తరగతి వరకు చదివిన విద్యా సంస్థ జిల్లా పరిధిగా, ఆ జిల్లాలో సంవత్సరాలు చదువును స్థానికంగా వివరించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లాస్థాయి కేడర్లలో 80%, జోనల్‌ ‌స్థాయిలో 60% స్థానికులకు ఉద్యోగాలు రిజర్వు చేయ బడినాయి. రిజర్వు చేయబడినవి పోగా మిగిలినవి ఓపెన్‌ ‌కాంపిటీషన్‌ ‌ద్వారా భర్తీ చేయాలి. వాటిని స్థానికేతరులకు రిజర్వు చేయరాదని ఉత్తర్వులు స్పష్టంగా పేర్కొన్నాయి. 1919 నుండి అమలులోనున్న నివాస యోగ్యతను 15 నుండి12 కు (1958లో) అనంతరం 1975లో 4సంవత్సరాలకు తగ్గించగా, వివక్షత కొనసాగింది. రాష్ట్రపతి ఉత్తర్వులలో పేర్కొన్న విధంగా జోనల్‌ ‌వారీ విధానాన్ని సైతం తుంగలో తొక్కి, స్వార్ధమే పరమార్ధంగా పాలన కొనసా గించడం జరిగింది. నాటి ముఖ్య మంత్రి ఎన్టీ రామారావు నియమించిన జయభారత్‌ ‌రెడ్డి, కమల నాథన్‌, ఉమాపతి తో కూడిన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారుల త్రిసభ్య కమిటీ, 1975 నుండి 1984 మధ్య కాలంలో జరిగిన ఉద్యోగ నియామకాలను పరిశీలించి సమర్పించిన 36 పేజీల 1981 జూన్‌ ‌నాటి నివేదికలో, జోన్ల రిజర్వేషన్లకు విరుద్దంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన 1,2,3లకు చెందిన వారు తెలంగాణకు చెందిన 5,6 జోన్లలో 58,986 మంది నిబంధనలకు విరుద్ధంగా నియ మింప బడినట్లు పేర్కొనడం జరిగింది.

ఈ నివేదికను పరిశీలించిన నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 1985 ‌డిసెంబర్‌ 30‌న 610 జీవోను జారీ చేశారు. గత పాలకులు చేసిన తప్పులను దిద్దుకునే క్రమంలో 1986 మార్చి 30కల్లా 610 జీవోను అమలు పరిచి, తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఉద్యోగులందరినీ ఎవరి జోన్లకు వారిని పంపుతామని ఎన్టీఆర్‌ ‌ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో రాయల సీమ ప్రాంతంలో నియుక్తులైన స్థానికేతర ఉద్యోగులను కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు పంపిం చాలన్న ‘‘జీ.ఓ. 564, తేది: 05-12-1985’’ మాత్రం వెంటనే అమలయింది. ఎన్టీఆర్‌ ‌ను గద్దె దింపి, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు, రిటైర్డ్ ఐఎఎస్‌ అధికారి గిర్గ్లానీ ఏకసభ్య కమిషన్‌ ‌ను పునః పరిశీలనకై నియ మించగా, నివేదిక సమర్పించిన గిర్గ్లానీ స్థానికేతరులను నిర్ధారించ గల సంపూర్ణ సమాచారం పొంద కుండానే, సమర్పిత నివేదికలో రాష్ట్రపతి ఉత్తర్వులను 128 పద్దతులలో ఉల్లంఘించడం జరిగిం దని వివరించి, వాటిని 18రకాలుగా వర్గీకరించి, పరిష్కార మార్గాలను సూచించడం జరిగింది. ఉద్యోగ నియామకాలన్నీ జోనల్‌ ‌నిబంధ నలను అనుసరించి జరగాల్సి ఉండగా, జోనల్‌ ఆఫీసులను రాష్ట్ర స్థాయి కార్యాల యాలుగా మార్చి ఇష్టారాజ్యంగా బదిలీలు చేయడం జరిగిందని, ఈ బదిలీలు తప్పని కమిషన్‌ అభిప్రాయ పడ్డది. గిర్గ్లానీ నివేదిక ప్రకారం సగం మంది స్థానికేతరులు ఉన్నారని స్పష్టం అయింది.

ఇదిలా ఉండగా తెలంగాణ స్వరాష్ట్ర ప్రభుత్వ పాలనలో సదరు అన్యాయానికి ఇకనైనా అడ్డుకట్ట వేసేందుకు చర్యకు తీసుకోవాలని నిర్ణయించారు. కొన్ని శాఖల సమా చారం పొంది, కొందరిని పంపించి వేశారు. ఇక ప్రస్తుతం చేపట్టాల్సిన చర్యల గురించి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసి నేతలు కారెం రవీందర్‌ ‌రెడ్డి అధ్యక్షతన సమావేశమై, పలు అంశాలను ప్రతిపాదించారు. నాటి ఉప ముఖ్య మంత్రి కడియం కమిటీ సూచించిన విధంగా స్థానికతను, 1నుండి 7వ తరగతి వరకు పరిగణ లోనికి తీసుకోకుండా, రాష్ట్రంలో 4 నుండి 12వ తరగతి వరకు వరుసగా 7ఏళ్ళ పాటు చదివిన వారినే స్థానికులుగా గుర్తించాలని నిర్ణయించారు. విద్యార్థులు స్థానికే తరంగా చదివితే, వారి తల్లి దండ్రుల స్థానికతనే పరిగణిం చాలని పేర్కొన్నారు. జిల్లా, జోనల్‌, ‌రాష్ట్ర కేడర్లకు 80:20 నిష్పత్తిని స్థానిక, స్థానికేతరులకు వర్తింప చేయాలని, కొత్త నియామకాలలో 70శాతం పదోన్నతుల ద్వారా, 80శాతం నేరుగా చేపట్టాలని నిర్ణయించారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమా నికి అంకురార్పణ జరిగింది సదరు వివక్షత కారణం ప్రధానం కాగా, అట్టి వివక్షత రూపు మాపేందుకు, సిఎం కేసిఆర్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, పలు అంశాలపై చర్చించి, 7జోన్లు, 2 మల్టీ జోన్లను 31 జిల్లాలను కలిపి ఖరారు చేశారు. తర్వాత 33 జిల్లాలతో కలిపి తెలంగాణ పబ్లిక్‌ ఎం‌ప్లాయిమెంట్‌ ఆర్డర్‌ – 2018‌ను అమల్లోకి తెచ్చారు. దీనికి అనుగుణంగా 33 జిల్లాలకు ఉద్యోగులను విభజించే ప్రక్రియ చేపట్టారు. 33 జిల్లాలతో రాష్ట్రపతి ఆమోదించిన కొత్త జోనల్‌ ‌వ్యవస్థ-2018కి అను గుణంగా ప్రభుత్వం ఈ మార్గదర్శ కాలను రూపొందించింది. ఇందుకు ఉద్యోగుల నుండి ఆప్షన్లను కోరడం జరిగింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్థానికత అంశాన్ని స్పష్టంగా పేర్కొనలేదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తాయి. 95శాతం పోస్టులు స్థానికులకే చెందేలా ప్రభుత్వం 33 జిల్లాలతో కొత్త జోనల్‌ ‌వ్యవస్థను తీసుకొచ్చిందని, కానీ.. 33 జిల్లాల స్థానికత ఆధారంగా విభజన చేపట్టడం లేదని సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

సదరు నూతన ప్రభుత్వ ఉత్తర్వుల మార్గదర్శకాలు… సీనియారిటీ ప్రాధాన్యత అధికంగా ఇస్తున్న నేపథ్యంలో, జూనియర్లు స్థానికే తరులుగా, స్థానికేతరులు, ప్రస్తుతం శాశ్వత స్థానికులుగా పరిగణింప బడుతుండడం గమనార్హం. వాస్త వానికి 2000, 2001, 2002, 2003 డీ ఎస్‌ ‌సిల ద్వారా తెలంగా ణేతరులు, అలాగే తెలంగాణలో ఇతర జిల్లాల వారు, ఉపా ధ్యాయుల ఉద్యోగ నియామకాల విషయంలో స్థానికులుగా ఉద్యో గాలలో చేరిన వారు ఉన్నారు. ప్రస్తుత ప్రక్రియలో సీనియారిటీకే ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో వారు ఎక్కడికైనా వెళ్లేందుకు అనుమ తించాల్సి వస్తున్నది. తెలంగాణే తరులు, స్వ రాష్ట్రంలో ఇతర జిల్లాల వారు, స్థానికులుగ మారిన వైనం, వాస్తవ స్థానికులకు అడ్డంకిగా, అన్యాయం చేసేదిగా మారింది. చోటు చేసుకున్న అసమానతలను సమూలంగా రూపు మాపుతూ, ఉద్యోగ, పదోన్నతుల విషయంలో సమ న్యాయం పాటించేందుకు కేసిఆర్‌ ‌నేతృత్వం లోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో స్థానికత అంశంలో అసంతృప్తి వ్యక్తం అవుతూనే ఉంది. ఈ క్రమంలో, కోరి కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో గత పొరపాట్లు పునరావృతం కాకుండా, స్థానికత గురించి, తగు జాగ్రత్తలు తీసుకుని, స్ధానిక అంశానికి న్యాయం చేకూ ర్చాల్సిన అవసరం అనివార్యంగా ఉంది.

– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply