– మెట్టు.. మెట్టు ఎక్కి పదిలో ఫస్ట్ నిలిచాం.
– విద్యా క్షేత్రంగా, విజ్ఞాన జ్యోతి గా నిరంతరం వెలుగొందాలి.
– పది ఫలితం భావి విద్యార్థులకు స్ఫూర్తి దాయకం.
సిద్దిపేట జిల్లా 10వ తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తల్లి తండ్రులకు తమ పిల్లలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఎంత ఆనందం పొందుతారో మన జిల్లా మొదటి స్థానం లో ఉంది అంటే నేను కూడా అంతే సంతోషపడ్డానన్నారు. రాష్ట్రం లో దేశం లో ఏ అవార్డ్ వచ్చిన సిద్దిపేట ప్రథమ స్థానం లో ఉన్నామని విద్యా రంగంలో అది పది ఫలితాలతో ప్రథమం అని జిల్లా ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇది అందరి సమిష్టి కృషి అని . సిద్దిపేట జిల్లా ప్రజలందరూ గర్వపడే సందర్భమన్నారు. విద్యార్థులను జిల్లా విద్యాశాఖ అధికారి ని మంత్రి సన్మానించారు.