వ్యాక్సిన్ హబ్.. డ్రగ్స్ హబ్.. మెడికల్ హబ్.. హైదరాబాద్

ఇది మనందరికీ గర్వకారణం మంత్రి హరీష్
9 బిలియన్ డోసులు ఇక్కడి నుండి ఉత్పత్తి అవుతున్నాయి. 65 శాతం ఫార్మా ఉత్పత్తులు ఇక్కడి నుండి ఉత్పత్తి అవుతున్నాయి…మంత్రి హరీష్ పేర్కొంటూ మెడికల్ టూరిజం హైదారాబాద్ లో బాగా అభివృద్ధి చెందుతున్నది. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హైద్రాబాద్ వచ్చి చికిత్స తీసుకునేలా ఎదిగాము.. సీఎం కేసీఆర్ సమర్థవంతమైన నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వం ఉండటం, శాంతి భద్రతలు పకడ్బందీగా నిర్వహించడం, విప్లవాత్మకమైన విధానాలు పెట్టుబడులు హైదరాబాద్ కి తరలి వచ్చేలా చేస్తున్నాయి.. అన్నారు. యశోద మలక్ పెట్ హాస్పిటల్లో పెట్ స్కాన్ ను మంత్రి హరీశ్ రావు సోమవారం ప్రారంభించారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన వైద్య సంస్థలు ఇక్కడ నెలకొనడం వల్ల ఈరోజు ఆఫ్రికా, గల్ఫ్ దేశాల నుండి ఎంతో మంది పేషెంట్లు నాణ్యమైన, అధునాతన చికిత్స కోసం ఇక్కడికి వస్తున్నారు.

చికిత్స పొంది ఆరోగ్యంగా తిరిగి వెళ్తున్నారు..అన్నారు.మన దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద మొత్తంలో పేషెంట్లు ఇక్కడకు వస్తుంటారు.. కొరోనా సమయంలో హైదరాబాద్ దేశానికి సేవలు అందించింది. ఇక్కడి నాణ్యమైన సేవలు పొందేందుకు క్యూ కట్టారు. ఇది మనకు గర్వకారణం..అని మంత్రి హరీష్ రావు తెలిపారు.” సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. 2014 లో 3 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు 33 చేసుకుంటున్నాం. ఎంబీబీఎస్ సీట్లు 700 నుండి 5240 సీట్లు ప్రభుత్వ రంగంలో చేరబోతున్నాయు. ప్రతి జిల్లాలో వంద విద్యార్థులతో నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నది.

నగరం నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రారంభిస్తున్నాము. 70 ఏళ్ల పాలనలో ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించలేదు. హైదరాబాద్ లో 6000 పడకలు అందుబాటులోకి రాబోతున్నాయి. వరంగల్ లో హెల్త్ సిటీ 2000 పడకలతో అందుబాటులోకి రాబోతున్నది. తెలంగాణ వచ్చిన నాడు ప్రభుత్వంలో ఉన్నవి 200 ఐసీయు బెడ్స్. ఇప్పుడు 6000 కు పెంచుకున్నాము.. ప్రభుత్వ దవాఖానాల్లో చాలా మంచి వైద్యులు ఉన్నారు. అందులో నో డౌట్. మేము కార్పొరేట్ హాస్పిటల్స్ తో పోటీ పడి పని చేస్తున్నాం. అద్భుతమైన వైద్య సేవలను మా వైద్యులు అందిస్తున్నారు. మావాళ్ళు చాలా కష్ట పడుతున్నారు..గాంధీలో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ బ్లాక్ ఏర్పాటు చేస్తున్నాం. ఉచితంగా మరిన్ని సేవలు అందించ బోతున్నాం అని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో యశోద వ్యవస్థాపకులు జీఎస్ రావు, డైరెక్టర్ పవన్, ఆంకాలజీ హెడ్ వంశీ కృష్ణా రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page