పబ్లిక్‌ ‌గార్డెన్స్‌లో రాష్ట్ర అవతరణ ఉత్సవాలు

ఏర్పాట్లపై సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్‌ 2‌న ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ముందుగా అమర వీరుల స్తూపం వద్దకు చేరుకొని తెలంగాణ అమరులకు  నివాళులు అర్పిస్తారని, అనంతరం పబ్లిక్‌ ‌గార్డెన్‌కు చేరుకొని జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌  అన్నారు. పోలీసు దళాల గౌరవ  వందనాన్ని స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుందని తెలిపారు.

అదే రోజు సాయంత్రం 30 మంది ప్రముఖ కవులచే కవిసమ్మేళనం రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లపై సిఎస్‌ ‌శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి తోపాటు వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page