- వ్యవస్థల అణచివేత దిశగా మోడీ చర్యలు
- మా పోరాటం రాజకీయ పార్టీ మీద కాదు..ఆ వ్యవస్థ మీద
- లండన్ పర్యటనలో రాహుల్ విమర్శలు
లండన్, మే 24 : ప్రధాని మోదీ విజన్లో దేశ ప్రజలు అందరూ ఉండరని..కొంతమంది మాత్రమే ఆయన దృష్టిలో ఉంటారని, వారి ప్రయోజనాలను మాత్రమే పరిగణిస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్లో ప్రజాస్వామ్య వ్యవస్థను అణచివేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. లండన్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి భాజపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని, ఆర్ఎస్ఎస్లు భారత్ ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను ధ్వంసం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. భారత్లో వి•డియాను కూడా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే కొంతమంది వ్యాపారవేత్తలు తమ అధీనంలోకి తెచ్చుకున్నారని, అందుకే నేను మాట్లాడింది భారత్లోని ఛానెళ్లలో 30 సెకన్లకు మించి ప్రసారం కాదని రాహుల్ తెలిపారు. ఇక్కడ పోరాటం కేవలం ఓ రాజకీయ పార్టీపైన కాదు..ఆ వ్యవస్థ వి•ద అని అన్నారు.
దీనిపై విజయం సాధించడం అంత సులభం కాదని, జీవితకాలం పట్టొచ్చని, అయినా తాము పోరాడుతామని రాహుల్ పేర్కొన్నారు. భారత్లో..సమస్యలను ఎత్తిచూపే సంస్థలను క్రమంగా అణచివేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పార్లమెంట్, ఎన్నికల వ్యవస్థ సహా ప్రజాస్వామ్య వ్యవస్థను ఓ సంస్థ తన అధీనంలోకి తెచ్చుకుందని పేర్కొన్నారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం కార్పస్ క్రిస్టీ కాలేజ్లో ఏర్పాటు చేసిన ‘ఇండియా ఎట్ 75’ కార్యక్రమానికి హాజరైన ఆయన..ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. స్వేచ్ఛగా ప్రశ్నించేందుకు అవకాశం ఉన్నప్పుడే భారత్ సజీవంగా ఉన్నట్లు.. అదే మౌనంగా ఉంటే ఇంక అందులో అర్థం లేదు. పార్లమెంట్, ఎన్నికలు, ప్రజాస్వామ్యం మొదలైన వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ విజన్లో కేవలం కొంతమంది మాత్రమే ఉంటారు. ఈ వైఖరిని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. హిందూ జాతీయవాదం అనే పదాన్ని కూడా అంగీకరించను. దాడులు, హత్యలకు పాల్పడే వారి సిద్దాంతాలను హిందుత్వంతో పోల్చడం సరికాదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.