- శాంతికి విఘాతం కలిగిస్తున్నారు
- మతం క్యాన్సర్ లాంటిది…దాని ఉచ్చులో పడొద్దు
- పరోక్షంగా బిజెపిపై సిఎం కెసిఆర్ తీవ్ర విమర్శలు
- ప్రజల మద్దతు కొనసాగితే దుష్ట శక్తులనుండి రాష్ట్రాన్ని కాపాడుతానని వెల్లడి
ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 26 : దేశంలో మతం, కులం పేరిట కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ పరోక్షంగా బిజెపిపై మండిపడ్డారు. నగరం నలువైపులా జూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు శంకుస్థాపన చేసిన అనంతరం అల్వాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ…బిజెపి లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ‘గతంలో ఏం జరిగిందో.. రాష్ట్రం వొచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మనందరం కూడా చూస్తున్నాం. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కొందరు మతం వి•ద, కొందరు కులంపేరు వి•ద చిల్లరమల్లర రాజకీయాలు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు’ అని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. భారతదేశం అన్ని మతాలను, అన్నీ కులాలను సమాంతరంగా ఆదరించే గొప్ప దేశమని, దీన్ని చెడగొట్టుకుంటే, ఈ సామరస్య వాతావరణం చెడిపోతే మనం ఎటుకాకుండా పోతాంమని ఆయన ప్రజలను హెచ్చరించారు.
ఒకసారి ఆ క్యాన్సర్ జబ్బు మనకుపట్టుకుంటే చాలా ప్రమాదంలో పడిపోతామని, ఈ రోజు అనేక విషయాలు పేపర్లలో చూస్తున్నామని, పలాన వాళ్ల షాపులో పువ్వులు కొనద్దు.. పలాన వారి షాపులో ఇది కొనద్దు.. అది కొనద్దని చెబుతున్నరని, దీనిపై ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు. మన భారతీయులు 13 కోట్ల మంది విదేశాల్లో పనిచేస్తున్నరని, ఒక వేళ వారందరినీ ఆ ప్రభుత్వాలు తిరిగి పంపిస్తే వాళ్లందరికీ ఉద్యోగాలు ఎవరివ్వాలి..ఎవరు సాదాలి? అని కెసిఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్కు దాదాపు రూ.2.30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని, ఏడేళ్లలో. సుమారు 10, 15 లక్షల మంది పిల్లలకు ఆ ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు దొరికినయని, రేపు హైదరాబాద్ సిటీలో 14 వేల ఎకరాల్లో ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి ఫార్మా యూనివర్సిటీతో పాటు ఫార్మాసిటీ తేబోతున్నామని ఆయన తెలిపారు జీనోమ్వ్యాలీలో తయారవుతున్న టీకాలతో టీకవ••• ప్రపంచానికే రాజధానిగా ఉన్నామని, ప్రపంచంలోనే 33 శాతం టీకాలు తయారీ కేంద్రం హైదరాబాద్ అని సిఎం అన్నారు.
దేశ విదేశాలకు చెందిన వారంతా ఇక్కడ ఫ్యాక్టరీలు పెడుతున్నారని అన్నారు. హైదరాబాద్కు పోతే విమానం దిగినా.. రైలు దిగినా.. బస్సు దిగినా ప్రశాంతంగా ఉంటది…బాగుంటది..ఇక్కడ అన్ని రకాల భోజనం దొరుకుతుంది..అన్ని భాషలు మాట్లాడే వాళ్లుంటరు..అందరు కలిసిబతుకుతున్నరంటెనే ఎవరైనా వొస్తురు కానీ.. కత్తులు పట్టుకుంటరు..తుపాకులు పట్టుకుంటరు..144 సెక్షన్ ఉంటది, కర్ఫ్యూ ఉంటది, తన్నుకుంటరంటే ఎవరైనా వొస్తారా?’ అంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. సామరస్యం, శాంతి ఉంటే, లా అండ్ ఆర్డర్ బాగుంటే, మన పోలీసు శాఖ బాగా పని చేస్తే కొత్తగా వెల్లువలా పెట్టుబడులు వొస్తయ్. పరిశ్రమలు తరలివస్తయ్.. జీవనం దొరుకుతది, ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతయని సిఎం అన్నారు. పొద్దున లేస్తే కులం పేరువి•దనో, మతం పేరువి•దనో కాట్లాటలు, కొట్లాటలుంటే, ఫైరింగ్లుంటే ఎవరూ రారని, అది మన కాళ్లు మనం నరుక్కున్నట్లుంటదని, తెలంగాణ బిడ్డగా..ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి అటువంటి క్యాన్సర్ను మన వద్దకు తెచ్చుకోవద్దని, చాలా అప్రమత్తంగా ఉండాలని సిఎం హెచ్చరించారు. తాత్కాలికంగా గమ్మతి అనిపిస్తదని, అప్పటికప్పుడు మజా అనిపిస్తదని, కానీ శాశ్వతంగా మన ప్రయోజనాలు దెబ్బతింటయని, ఎట్టి పరిస్థితుల్లో అటువంటి సంకుచిత ధోరణలకు తెలంగాణల ఆస్కారం ఇవ్వొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘మనం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. దేశంలో చాలా పెద్ద రాష్ట్రాలున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, గుజరాత్లు ఎప్పటి నుంచో రాష్ట్రాలుగా ఉన్నాయ్. వాటన్నింటిని అదిగమించి రాష్ట్ర తలసరి ఆదాయంలో దాటిపోయాం.
సంపద సృష్టిస్తూ పేదలకు పంచుతున్నాం. ఇవాళ రూ.2016 ఏ రాష్ట్రంలో ఇవ్వరు. ప్రధానిమంత్రి గుజరాత్ రాష్ట్రంలో రూ.500, రూ.600 ఇస్తున్నరు. దివ్యాంగులకు రూ.3016 ఎక్కడా ఇవ్వడం లేదు. ఆడపిల్లల పెండ్లి జరిగితే రూ.1,00,116 ఇచ్చే సంప్రదాయం తెలంగాణలో తప్ప భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు’ అని సిఎం స్పష్టం చేశారు. ‘ఏడేళ్ల కిందట ఎటువంటి కరెంటు గోసలుండెనో తెలుసు. ఇవాళ మన వద్ద కరెంటు పోతే వార్త.. ఇండియాలో కరెంటు ఉంటే వార్త.. ఇది వాస్తవం. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో రైతులు రోడ్లపైకి వొచ్చి పోరాటాలు చేస్తున్నారు. ఏడేళ్ల కిందట పుట్టిన తెలంగాణలో రాత్రింభవళ్లు కష్టం చేసి తిప్పలు పడితే.. ఈ రోజు బ్రహ్మాండంగా 24 గంటలు కరెంటు అన్నిరంగాలకు ఇచ్చుకుంటున్నాం. ఎండకాలం వొచ్చిందంటే ఎమ్మెల్యేల చావుకొచ్చేది. భయంకరమైన పరిస్థితులు. ఏ మూలకు పోయినా బిందెల ప్రదర్శనలు, ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు జరిగేవి. ఇవాళ తెలంగాణల బిందెల ప్రదర్శన రద్దయ్యింది. మిషన్ భగీరథ పుణ్యమాని బ్రహ్మాండంగా మంచినీళ్ల కొరత తీర్చుకున్నాం. కాళేశ్వరం, పాలమూరు పథకాలు చేసుకొని సాగునీరులో బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాం. ధ్యానం పండించడంలో నెంబర్ వన్ స్థాయికి ఎదుగుతున్నాం’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
‘ప్రభుత్వం ఇకపై వైద్యం, విద్యపై దృష్టి సారిస్తుంది. రాబోయే రోజుల్లో మరిన్ని గురుకుల పాఠశాలలు పెరగాలి. 33 మెడికల్ కాలేజీలు అన్ని జిల్లా కేంద్రంలో ప్రభుత్వం రంగంలో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎక్కడికక్కడే విద్య, వైద్యసేవలు పేదల ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇవన్నీ చేయగలిగినామంటే, మహా మహా రాష్ట్రాలను దాటి ముందుకు పోగలుగుతున్నమంటే.. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనటువంటి కరెంటు ఇస్తున్నామంటే వి•రిస్తున్న మద్దతు. వి•రిచ్చే దీవెన, వి•రిచ్చే ఆశీస్సుల.. బలమే. వి• దీవెన ఇదే విధంగా కొనసాగాలే. పటిష్టంగా తెలంగాణ పచ్చబడాలే.. ఇంకా ముందుకెళ్లాలే.. దేశానికే తలమానికంగా ఉండేలా రాష్ట్రం తయారు కావాలి. దాని కోసం ఎంత ధైర్యంగానైనా ముందుకుపోతాం. ఎవరితోనైనా పోరాడుతాం. ఈ దుష్ట శక్తుల బారి నుంచి ఎప్పటికప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకుంటూ అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.