తూర్పు టికెట్టు గణేష్ కు కేటాయించాలి..

కెప్టెన్ ను కలిసిన బ్రాహ్మణ సంఘాలు

ప్రముఖ న్యాయవాది టిఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ కార్పొరేటర్ బద్దిరాజు గణేష్ కు వరంగల్ తూర్పు టికెట్ కేటాయించాలని వరంగల్ నగరానికి చెందిన బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణ ప్రముఖులు విజ్ఞప్తి చేశారు గురువారం సాయంత్రం హనుమకొండ అండర్ గ్రౌండ్ లోని కెప్టెన్ బి లక్ష్మీకాంతరావు నివాసంలో ఆయనను కలిశారు ఈ మేరకు ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు అనేక సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీలో ఉంటూ కార్పోరేటర్ గా ఘన విజయం సాధించి విజయవంతమైన కార్పొరేటర్ గా గుర్తింపు పొందడం అంతేకాకుండా పార్టీకి అంకితభావంతో కృషి చేస్తూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారుల పండగనిచ్చాడని ఉచ్చ మనలో స్వయంగా పాల్గొని పార్టీకి ఎంతగానో సహకరించాలని వారు పేర్కొన్నారు వరంగల్ తూర్పులో గణేష్ కు టికెట్ కేటాయిస్తే అఖండ మెజార్టీతో గెలిపిస్తామని పేర్కొన్నారు ఇప్పటికే బ్రాహ్మణులంటే కెసిఆర్ కు దూరం ఉన్నప్పటికీ టికెట్టు కేటాయింపు ద్వారా మరింత ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులు టిఆర్ఎస్ పార్టీకి మద్దతునిస్తారని వారు పేర్కొన్నారు ఇదే సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే వి సతీష్ కుమార్ ను కూడా బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు టికెట్ కేటాయించడంలో తమ వంతు ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్తానని కెప్టెన్ లక్ష్మీకాంతరావు వారితో అన్నారు కాగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఎమ్మెల్యే బి. సతీష్ బాబును కలిసిన వారిలో గణేష్ బి వెంకటేశ్వరరావు భద్రకాళి శేషు గంగు ఉపేంద్ర శర్మ వాణిదేవి నాగేందర్ రావు శ్రీనివాసరావు నగరానికి చెందిన 50 మందికి పైగా ప్రముఖులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page