ఏపీలో మే 9 నుంచి వేసవి సెలవులు

  • జులై 4న పాఠశాలలు ప్రారంభం
  • ఈ నెల 27 నుంచి టెన్త్ ‌పరీక్షలు
  • 1 నుంచి 9 తరగతులకు మే 4 వరకు సమ్మేటివ్‌-2 ‌పరీక్షలు

అమరావతి, ఏప్రిల్‌ 18 : ఏపీలో పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు మే 9 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం జులై 4 నుంచి మొదలు కానుంది. ఈ మేరకు శనివారం ఏపీ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని విద్యార్థులకు మే 9 నుంచి వేసవి సెలవులు మొదలు కానున్నాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు ఈ నెల 27 నుంచి మే 9 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు పూర్తవగానే సమ్మర్‌ ‌హాలీడేస్‌ ‌ప్రారంభం కానున్నాయి.ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్‌-2 ‌పరీక్షలను ఏప్రిల్‌ 22 ‌నుంచి మే 4 వరకు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షలు పూర్తి కాగానే వారికి వేసవి సెలవులు ప్రకటించనున్నారు. వేసవి సెలవుల అనంతరం జులై 4 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుంది. ఏపీలోని జూనియర్‌ ‌కాలేజీలకు మే 25 నుంచి జూన్‌ 20 ‌వరకు సమ్మర్‌ ‌హాలిడేస్‌ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page