పశుసంవర్ధకశాఖలో భారీ కుంభకోణం

కేసు నమోదు…ఎసిబి అధికారుల దర్యాప్తు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : పశుసంవర్ధక శాఖలో భారీ కుంభకోణం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆవుల కొనుగోలు నిమిత్తం ప్రభుత్వ నిధుల నుండి రూ. 8.5 కోట్లను గత ప్రభుత్వం విడుదల చేసింది. అయితే.. ఆవులు అమ్మిన వ్యాపారులకు మాత్రం 4 కోట్ల రూపాయలు మాత్రమే అకౌంట్లో జమయ్యాయని అధికారులు గుర్తించారు.
మిగిలిన 4.5 కోట్లు బినావిూ అకౌంట్స్‌ కి ముఠా సభ్యులు మళ్ళించారని సమాచారం. కాగా దీనిపై రైతులు నిలదీయడంతో కోటిన్నర రూపాయలను ముఠా సభ్యులు తిరిగి ఇచ్చినట్లు తెలియవచ్చింది. తమకు ఇంకా మూడు కోట్ల రూపాయలు పశుసంవర్ధక శాఖ నుండి రావాలంటూ ఏసీబీకి పుంగనూరు ఆవుల రైతులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *