ఆరోగ్య రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అనేక విషయాలు ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ విషయంలో మనం వెనుకబడి ఉన్నాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సహస్రాబ్ది లక్ష్యాలు కూడా చేరుకోలేదు. అందరికీ ఆరోగ్యం అన్న లక్ష్యం ఇంకా దూరంగా వుంది. అయితే కొన్ని అంశాలలో అంతర్జాతీయ స్థాయి వైద్యం అందిస్తున్నాము. ఫార్మా, వ్యాక్సిన్ ల రంగాల్లో ముందంజ వేసాము. కానీ మొత్తం మీద ఆరోగ్య రంగం అసమానతలతో ఉంది. ఆధునిక జీవన శైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్లతో మూడు ప్రధాన సమస్యలు మానవాళిని వెంటాడుతున్నాయి. అవి రక్తపోటు, డయాబెటిస్, ఊబకాయం. సర్వ సాధారణంగా కన్పిస్తున్న ఈ మూడు ప్రమాదకర వ్యాధుల్నించి రక్షించుకునేందుకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి.
రక్తపోటు, డయాబెటిస్, ఊబకాయం ప్రపంచమంతా నిత్యం ఎదురవుతున్న ప్రధాన సమస్య. పోటీ ప్రపంచంలో నిత్యం ఎదురవుతున్న సవాళ్లు, కాలంతో పోటీ పడుతూ క్షణం తీరిక లేకుండా గడిపే పరిస్థితి, మానసిక విశ్రాంతి పూర్తిగా కరువై అనారోగ్యాల్ని కొని తెచ్చుకుంటున్న వైనం. వెరసి మనిషి జీవితాన్ని అన్ని విధాలుగా సవాలు చేస్తున్నాయి. ప్రస్తుతం రక్తపోటు, షుగర్ అనేది చాలా సాధారణంగా మారిపోయాయి. కేవలం నగరాలు, పట్టణాలు కాకుండా పల్లెల్లోనూ ఈ సమస్య వెంటాడుతున్నాయి. ప్రతి పది మందిలో ఒకరికి బీపీ, 30 ఏళ్లు నిండిన ప్రతి 8 మందిలో ఒకరికి మధుమేహం ఉంటున్న పరిస్థితి ఉందంటే, ఈ సమస్య తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. గ్రామాల్లో 26 శాతం, పట్టణాల్లో 30 శాతం మంది బీపీ బాధితులున్నారు అంచనా. అదే డయాబెటిస్ విషయానికొస్తే పల్లెల్లో 20 శాతం, పట్టణాల్లో 25 శాతం షుగర్ బాధితులున్నారు. చాలామంది అవగాహన లేక, నిర్లక్ష్యంతో మాత్రమే ఈ రెండు ప్రమాదకర జబ్బులు నియంత్రించు కోలేకపోతున్నారని తెలుస్తోంది. కేవలం ఒత్తిడి కారణంగా ఈ జబ్బులు వస్తున్నాయని సుస్పష్టం. సరైన ఆహారం తీసుకోకపోవడం, చిన్నారులు ఎక్కువగా ఎలక్ట్రానిక్ పరికరాలకు లోనవడం కారణాలుగా ఉన్నాయి.భారతదేశంలో ఊబకాయం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీని కారణంగా ప్రజలు తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఊబకాయం అనేది చిన్న సమస్య కాదని, ఇది ఒక వ్యాధి అభివృద్ధి చెందుతుందని చెప్పింది. ఊబకాయం ఒక రకమైన వ్యాధి. భారతదేశంలోని ప్రజలు దీనిని ఒక సమస్యగా భావిస్తారు.
ఊబకాయాన్ని ఒక వ్యాధిగా పరిగణిస్తే, ప్రజలు ఊబకాయం బారిన పడకుండా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు.స్థూలకాయం అంటే శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండటం అని నిర్వచించారు. శరీర కొవ్వు యొక్క ఖచ్చితమైన కొలత పొందడం చాలా కష్టం. బాడీ మాస్ ఇండెక్స్ ఆరోగ్యకరమైన బరువును నిర్ణయించడానికి ఒక ప్రసిద్ధ మార్గం. బీఎంఐ , నడుము పరిమాణంలో కలిపి, శరీర కొవ్వు శాతాన్ని అంచనా వేయడానికి మార్గదర్శకంగా ఉపయోగించాలి. మీ ఎత్తు ఆధారంగా, బీఎంఐ ఆరోగ్యకరమైన బరువును గణిస్తుంది. ఇది శరీర బరువు కంటే మరింత ఖచ్చితమైన అంచనా కోసం ఎత్తు మరియు బరువు రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటుంది. అధిక శరీర కొవ్వుతో కూడిన రుగ్మత ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఊబకాయం తరచుగా వ్యాయామం మరియు సాధారణ రోజువారీ కార్యకలాపాల ద్వారా బర్న్ చేయబడిన వాటి కంటే ఎక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల వస్తుంది. ఒక వ్యక్తి యొక్క బాడీ మాస్ ఇండెక్స్ 25 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు, అప్పుడు ఊబకాయం ఏర్పడుతుంది.శరీరంలోని అధిక కొవ్వు తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆహారం మరియు వ్యాయామం వంటి జీవనశైలి మార్పులు చికిత్సలో ప్రధానమైనవి. అదనపు కేలరీలు శరీరం ద్వారా కొవ్వుగా నిల్వ చేయబడతాయి. ప్రతిరోజూ ఎక్కువ కేలరీలు వినియోగించబడుతున్నందున శరీరం అదనపు కొవ్వు నిల్వలను పొందడం కొనసాగిస్తుంది, ఇది ఊబకాయానికి దారితీస్తుంది మరియు అత్యంత తీవ్రమైన సందర్భాల్లో, అనారోగ్య ఊబకాయం. ఊబకాయం లక్షణాలు అనేక కాలాల తీవ్రమైన మరియు కొన్నిసార్లు ప్రాణాంతక వ్యాధులతో ముడిపడి ఉన్నాయి.
భారతదేశంలో బీఎంఐ 23 కంటే ఎక్కువ ఉంటే, అప్పుడు అధిక బరువుగా పరిగణిస్తారు. అయితే బీఎంఐ స్థాయి 30 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఆ పరిస్థితిని ఊబకాయం అంటారు. ఈ స్థూలకాయాన్ని తేలికగా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులకు గురవుతారు. వివిధ వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరిస్తారు.
స్థూలకాయాన్ని వ్యాధిగా పరిగణించాల. దీని ప్రభావం గుండెపై ఉంటుంది. గుండెపై కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. అటువంటి పరిస్థితిలో స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. గుండె ఆరోగ్యం దెబ్బతింటే శ్వాస వ్యవస్థ పాడై, శ్వాస పీల్చుకోవడంలో అనేక ఇబ్బందులు పడతారు. గుండె చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల ధమనుల్లో ఇబ్బందులు ఏర్పడతాయి.మోకాలి నొప్పిస్థూల కాయం వలన శరీరం బరువు పెరగడంతో కీళ్ల నొప్పులతో ఇబ్బందులు పడతారు. బరువులు ఎత్తినప్పుడు కీళ్లలో నొప్పి మొదలవుతుంది. శరీరం బరువు మరింత పెరిగితే, అప్పుడు కీళ్ళు పై భారం పడుతోంది.
కీళ్లు, పాదాలు ఆరోగ్యం చెడిపోకుండా మొదటి నుంచి బరువు అదుపులో ఉంచుకోవాలి.కాలేయం, మూత్రపిండాల నష్టం శరీరంలోని ముఖ్యమైన అవయవాలు కిడ్నీ, కాలేయంలో కొవ్వు పేరుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది . ఈ కొవ్వు ఒక రకమైన ఒత్తిడిని సృష్టిస్తుంది. ఈ కారణంగా కిడ్నీ, కాలేయం పని తీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ అవయవాలు సరిగా పనిచేయలేవు. కొవ్వు పట్టిన కాలేయానికి తగిన చికిత్స చేయకపోతే కాలేయ వైఫల్యం అయి ప్రాణాంతక పరిస్థితికి దారి తీస్తుంది. ఊబకాయం వల్ల స్పెర్మ్ నాణ్యత కూడా తగ్గుతుంది, దీనిని ఒలిగోస్పెర్మియా అంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఊబకాయం ఉన్నవారిలో తక్కువ స్పెర్మ్ ఉత్పత్తి అవుతుంది. పెరిగిన శరీరం. చక్కెర అధికంగా ఉత్పత్తి చేస్తూ మధుమేహం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే పిల్లల్ని సాధ్యమైనంతవరకు ఆటల వైపు దృష్టి మళ్లించాలి. పెద్దవాళ్లు యోగా లేదా వ్యాయామం అలవాటుగా చేసుకోవాలి. ప్రతి రోజూ వాకింగ్ తప్పనిసరి చేసుకుంటే ఇంకా మంచిది. శారీరక వ్యాయామం లేకపోతే చిన్న వయస్సులోనే ఇలాంటి జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. జంక్ ఫుడ్, సాచురేటెడ్ సుగర్స్, శీతల పానీయాలు, ఫాస్ట్ ఫుడ్, ఐస్ క్రీమ్, కొవ్వు పదార్థాలు పూర్తిగా మానాలి.
– డా।। యం . అఖిల మిత్ర,
ప్రకృతి వైద్యులు, ఆషా ప్రకృతి ఆశ్రమం.




