అహింసా వాది సరిహద్దు గాంధీ

మహాత్మా గాంధీజీ లాగే ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌ అహింసా వాది. జాతిపిత గాంధీ అహింసా మార్గంలో అడుగులు వేసి బ్రిటీష్‌ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన స్వాతంత్య్ర సమరయోధుడు. అందుకే అయన  సరిహద్దు గాంధీగా పేరెన్నిక గన్నాడు. ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌…. ఈ పేరును ఈ తరానికి చెందిన చాలా మంది విని ఉండక పోవచ్చు. కాని సరిహద్దు గాంధీ అంటే కొంత మందికి అయినా గుర్తుకు రావచ్చు. పాకిస్థాన్‌లోని పంఖ్తూన్‌ రాష్ట్రంలో ఒక  పఠాన్‌గా  జన్మించాడు.
‘‘ఆయుధం పట్టుకొని యుద్ధం చేసే పఠాన్‌ కన్నా అహింసా మార్గమే ఆయుధంగా ధరించిన పఠాన్‌ ప్రమాద కరమైన వ్యక్తి’’  అని బ్రిటీష్‌ పాలకులతో అనిపించుకున్న గొప్ప ధీరుడు. ‘‘నేను ఎట్టి పరిస్థితుల్లో అహింసా మార్గాన్ని వీడను. పగ, ప్రతీకారం జోలికి వెళ్లను. నన్ను అణచివేసిన, హింసించిన వ్యక్తులను కూడా క్షమిస్తాను’’ అన్న ప్రతిజ్ఞతో ‘కుదాయ్‌ కిద్మత్‌ గర్‌’ పేరిట భారత స్వాతంత్య్ర పోరాటానికి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన శాంతి కాముకుడు సరిహద్దు గాంధీ.

‘‘బాద్షా ఖాన్‌’’ గా కూడా సరిహద్దు గాంధీ పేరుగాంచాడు. స్వాతంత్య్ర సమర యోధుడు, గాంధేయవాది. భారతరత్న పురస్కారాన్ని పొందిన తొలి భారతీయేతరుడు. ‘‘ఎర్రచొక్కాల ఉద్యమం’’ ప్రారంభించిన ప్రముఖుడు. జనవరి 30, 1948 న మహాత్మా గాంధీ హత్యకు 40 సంవత్సరాల తరువాత జనవరి 20, 1988 న మరణించాడు. ఇస్లాం యొక్క గొప్ప అహింసా సైనికుడు.  వేలాది అహింసా పఠాన్‌ల విధేయతను పొందిన గొప్ప జాతీయవాద నాయకుడు.  అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌ 1890 ఫిబ్రవరి 6 న నాటి అవిభక్త భారత దేశంలోని, నేటి పాకిస్తాన్లో ఉన్న వాయువ్య సరిహద్దు నగరమైన ఉత్మాన్జైలో  జన్మించాడు. 1910 లో, 20 సంవత్సరాల వయస్సులో, బెచే  ఉత్మాన్జై లోని ఒక మసీదులో ఒక పాఠశాలను స్థాపించాడు. 1921 లో ‘అంజుమాన్‌-ఇ ఇస్లా-ఇ ఆఫ్ఘనియా’ (ఆఫ్ఘన్‌ రిఫార్మ్‌ సొసైటీ), అలాగే 1927 లో యువత  ఉద్యమమైన ‘పాక్స్టన్‌ జిర్గా’  స్థాపించాడు. మే 1928 లో, బచా ఖాన్‌ తీర్థయాత్ర నుండి మక్కాకు తిరిగి వచ్చిన తరువాత, పాష్టో భాషలో నెలవారీ రాజకీయ పత్రిక ‘పాక్స్టన్‌’ (పాష్తున్‌) ను స్థాపించాడు. భారత స్వాతంత్య్రం కోసం ఖాన్‌, ఐక్య, లౌకిక, స్వతంత్ర దేశం లక్ష్యాన్ని సాధించగల ఏకైక స్థిరమైన మార్గం… గాంధీ  ‘సత్యాగ్రహం’ సూత్రాలను గట్టిగా అవలంబించడం ద్వారా మాత్రమే,  అని నిర్ధారణకు వచ్చాడు. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమం  ఊపందుకుంది. ఆయన 1920 లలో ‘ఖుదై ఖిద్మత్గర్‌’ (దేవుని సేవకులు) ను స్థాపించాడు.

1928 లో ఖాన్‌ మొట్టమొదటి సారిగా మహాత్మా గాంధీని కలుసు కున్నాడు. భారత కాంగ్రెస్‌ పార్టీతో సంబంధం కలిగి ఉన్నాడు. అతి త్వరలో ఆయన గాంధీకి అత్యంత సన్నిహితుడు అయ్యాడు.  స్వతంత్ర, అవిభక్త, లౌకిక… హిందువులు, ముస్లింలు  కలిసి శాంతితో జీవించే భారతదేశం గురించి కలలు కన్నాడు. 1931 లో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి వరించినా, ‘‘నేను ఒక సాధారణ సైనికుడిని, ఖుదై ఖిద్మత్గర్‌… అల్లా సేవకునిగా   మాత్రమే నేను సేవ చేయాలను కుంటున్నాను’’ అని చెప్పి సున్నితంగా తిరస్కరించాడు. అయన చాలాకాలం కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీలో సభ్యుడిగా మాత్రం ఉన్నాడు. భారత భూభాగంలో బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ పోరాడు తుండగా, అప్పటి వాయువ్య సరిహద్దు ప్రావిన్స్‌ అని పిలువబడే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో భాగమైన ఆ దేశంలోని వాయువ్య ప్రాంతంలో లక్ష  మందిని తుపాకులు వాడడానికి, బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా అహింసాత్మకంగా పోరాడడానికి ప్రతిజ్ఞ చేయడానికి ఒప్పించాడు.  ఆ సైన్యాన్ని అల్లాప్‌ా సేవకులు ఖుదై ఖిద్మత్గర్‌ అని పిలిచాడు. లక్ష మంది ముస్లింలు అయన ‘‘ఖుదై ఖిద్మత్గర్‌’’ లేదా ‘‘అల్లాప్‌ా యొక్క సేవకులు’’ ఉద్యమంలో చేరారు. మహాత్మా గాంధీ తత్వాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని ఖాన్‌ వారికి వివరించి ఒప్పించాడు. బ్రిటీష్‌ పాలన ముగిసిన తరువాత భారత దేశాన్ని విభజించ కూడదని డిమాండ్‌ చేయడం ద్వారా, ఖాన్‌ ముస్లింలలో చాలా మందికి శత్రువుగా మారాడు.

తన ప్రజల హక్కుల కోసం నిరంతరం ఆయుధాలు ఎత్తకుండా  కష్టపడ్డాడు. గాంధీ మాదిరిగానే, గఫర్‌ ఖాన్‌ తన ప్రజల అభ్యున్నతి స్వాతంత్య్ర సాధన ద్వారానే సాధ్య మని నిజాయితీగా నమ్మాడు. ఖాన్‌ ప్రావిన్స్‌ లో పాఠశాలలను తెరిచాడు. మహిళలను సమాజ ప్రధాన స్రవంతిలోకి తీసుకు రావడానికి కృషి చేశాడు. తన అహింసా సైనికులను రోజుకు కనీసం రెండు గంటల సామాజిక పని చేయమని ప్రోత్సహించాడు. భారత విభజనకు తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన భారత రాజకీయ నాయకులతో కలసి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నాడు. భారతదేశ రాజకీయ నాయకులతో మరీ ముఖ్యంగా గాంధీ నెహ్రూ, కాంగ్రెస్‌ పార్టీతో కలసి పోరాటం సలిపాడు. సరిహద్దు ప్రాంతపు ముస్లిం లీడర్లు, ఆయన ముస్లింల ద్రోహి అని 1946 లో హత్యా ప్రయత్నం చేసారు. మొదటి నుంచి దేశ విభజనను వ్యతిరేకిస్తూ వచ్చిన ఖాన్‌ చివరకు నిర్ణయాన్ని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకే వదిలేశాడు. ఆ సమావేశం అత్యధిక మెజారిటీతో దేశ విభజన తీర్మానాన్ని ఆమోదించింది. ఆ సమావేశంలో గఫర్‌ ఖాన్‌తో పాటు మహాత్మాగాంధీ, రామ్‌ మనోహర్‌ లోహియా, జయప్రకాష్‌ నారాయణ్‌లు పాల్గొనలేదు.

‘మీకు అండగా నిలబడ్డాం. మీతో పాటు పఠాన్లు దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు చేశారు.   సరిహద్దు ప్రాంత వాసులకు ద్వేషిగా మారాడు. దేశ విభజన ఆగలేదు. అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ పరిస్థితి అగమ్యగోచరమయ్యింది. బాద్షా ఖాన్‌, అనుయాయులు, భారత పాకిస్తాన్‌ నాయకులు  తీవ్రంగా ద్రోహం చేశారని భావించారు. కాంగ్రెస్‌ పార్టీని, భారత రాజకీయ నాయకులను ఉద్దేశించి బాద్షాప్‌ా ఖాన్‌ అన్న ఆఖరి మాటలు, ‘‘మీరు మమ్మల్ని తోడేళ్ళ ముందు విసిరేసారు’’ . అల్లర్లు, హింసతో ఏమీ సాధించలేమని, శాంతి, సౌభ్రాతృత్వాలతో  సంపాదించింది శాశ్వతంగా మిగిలి పోతుందని పిలుపు నిచ్చాడు. ఇటు బ్రిటీష్‌ ఇండియాలో, అటు పాకిస్థాన్‌లో 27 ఏళ్లపాటు జైలు జీవితాన్ని అనుభవించిన సరిహద్దు గాంధీ అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌ నగరానికి వెళ్లి ప్రవాస జీవితం గడిపాడు. 1969లో మహాత్మాగాంధీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా గఫర్‌ ఖాన్‌ భారత్‌కు వచ్చాడు. ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఢల్లీికి వచ్చి అంతర్జాతీయ అవగాహన కింద ఇచ్చే ‘జవహర్‌ లాల్‌ నెహ్రూ అవార్డు’ అందుకున్నాడు. పార్లమెంట్‌ సంయుక్త సమావేశంలో మాట్లాడుతూ ‘మీరు బుద్ధుడిని మరచి పోయినట్లు గానే గాంధీని మరచి పోతున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తుది శ్వాస విడిచేంత వరకు నమ్ముకున్న సిద్ధాంతానికే కట్టుబడి జీవించిన గఫర్‌ ఖాన్‌ పాకిస్థాన్‌లోని పెషావర్‌లో 1988, జనవరి 20వ తేదీన ఆయన మరణించారు.
 – రామ కిష్టయ్య సంగనభట్ల
    9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *