2001 ఏప్రిల్ 27 న తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఉద్భవించిన తెలంగాణా రాష్ట్ర సమితి ..తరువాత భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెంది జరుపుకో బోతున్న రజతోత్సవాల పై రాష్ట్ర ప్రజలకు..రాజకీయ విశ్లేషకులకు..ప్రత్యర్ధి పార్టీల కు ఆసక్తి నెలకొన్నది.. అందుకు కారణం ఆ పార్టీ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించి..తొమ్మిదిన్నర సంవత్స రాలు అధికారంలో ఉండి.. ప్రజలు తిరస్కరించడంతో 17 నెలలుగా ప్రతి పక్ష పాత్ర పోషిస్తున్నది. దశాబ్దాల కాలం కొనసాగిన తెలంగాణా రాష్ట్ర ఉద్యమం లో ముందు వరుసలో ఉన్నవారిలో భారత రాష్ట్ర సమితి కె చంద్రశేఖర్ రావు ఒకరు. పది గొంతుకాలు వినిపించినపుడు పద కొండవ ఎత్తడం సులభమే. కానీ మొదటి గొంతుక ఎత్తడమే కష్టం..అదొక సాహస కార్యం అది చరి త్రాత్మక ఘటన ..24 సంవత్సరాల కిందట 2001లో ఏప్రిల్ 27 న పురుడు పోసుకున్న ‘తెలంగాణా రాష్ట్ర సమితి ‘ 21 వ శతాబ్దం లో మొదటి రెండు దశాబ్దాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేసింది.
జాతీయ పార్టీలు కాంగ్రెస్ ..భారతీయ జనతా పార్టీ తెలంగాణా అంశం పై ఎటూ తేల్చని విధానం ..కమ్యూనిస్టులు నిర్ద్వందంగా వ్యతిరేకించే విధానం తో తెలంగాణా సమాజం అయోమయంలో ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వం లో తెలంగాణా రాష్ట్ర సమితి రాష్ట్ర సాధనే ధ్యేయంగా ప్రారంభం కావడం ..గమ్యం చేరే వరకు ఉద్యమంలో అగ్రభాగాన నిలబడం అదొక సాహస కార్యం ..! తెలంగాణా రాష్ట్ర సాధన కోసం అంతకు ముందు దశాబ్దాల కాలం పాటు వివిధ దశలలో ..వివిధ రూపాలలో వేదికలు ..రాజకీయ పార్టీలు ఏర్పడలేదని కాదు..అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నా యుడు శాసన సభలో తెలంగాణా పదాన్ని నిషేధించిన క్లిష్ట పరిస్థితుల్లో ..ప్రజలు తమ అస్తిత్వానికి తీవ్ర ప్రమాదం ఎదుర్కొంటు…’ఇంకేం తెలంగాణా ..ఇంకెక్కడి తెలంగాణ..?’అన్న నిరాశా, నిస్పృహలతో తెలంగాణా ప్రాంతంలో గాఢాంధకారం అలుముకున్న గడ్డు రోజుల్లో తెలంగాణా ప్రజల గుండెలలో అణిగి ఉన్న ప్రగాఢ ఆకాంక్షలను గుర్తించి తెలంగాణా రాష్ట్ర సమితి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది. 2014, జూన్ రెండు తెలంగాణా రాష్ట్ర అవతరణ వరకు 13 సంవత్సరాలు మలి ఉద్యమ కాలంలో ప్రతి పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించిన తెలంగాణా రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) అధికారం చేపట్టిన తదనం తరం ఫక్తు రాజకీయ పార్టీ గా మారింది.
అధికారం లో ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాలు పలు విమర్శలు ..అవినీతి ఆరోపణలతో కూరుకుపోయింది. దుర హంకార రాజకీయాల ఆరోపణలతో ఉద్యమకారులకు పార్టీ దూరమయింది. ఫలితంగా అధికారం కోల్పో వలసి వొచ్చింది. రాజకీయ పార్టీ ప్రస్తానంలో భాగ ంగా ఇప్పుడు 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా 25 వ వార్షికోత్సవం హనుమకొండ, కరీంనగర్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఎల్కతుర్తి లో భారీ స్థాయిలో నిర్వహించనుంది. అననుకూల ..ప్రతికూల పరిస్థితుల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించడం. విజయవంతం చేయడం పార్టీ శ్రేణు లకు ముందు నుంచి కూడా తెలిసిన విద్య. ఒక వైపు కర్రె గుట్టలో మావోయిస్టు లను దిగ్బంధనం చేసిన 10 వేల భద్రతా దళాలు.. కొనసాగుతున్న గాలింపులు .. ఎన్కౌంటర్లు.. ప్రజా సంఘాలు పౌర హక్కుల నేతల నిరసనలు.. మరో వైపు కశ్మీర్ పహల్గాం లో 27 మంది పర్యా టకులను తీవ్ర వాదులు హత్య చేసిన దుర్ఘటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు.. రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణా లో నమోదు అవు తున్న అత్యధిక శాతం ఉష్ణోగ్రతలు.. ఇన్ని ప్రతి కూల.. అననుకూల వాతావరణంలో సభకు జన సమీ కరణ ఏ మేరకు విజయవంతం అవుతుందో ఆసక్తి కరం ..!
ఇక సభలో పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావు సందేశం పై ఆసక్తి నెలకొంది ..ప్రతి పక్షం లో నాయకుడి హోదాలో 17 నెలలు కాంగ్రెస్ పార్టీ పాలన పై బహిరంగంగా స్పందించని ఆయన బహి రంగ సభలో ఏం మాట్లాడుతారో అని ప్రజలు వేచి చూస్తున్నారు. ప్రతిపక్షం లో ఉన్న 17 నెలలు గా బీఆర్ ఎస్ పార్టీ ప్రతినిధులు ముఖ్యంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ( కెటీఆర్), మాజీ మంత్రి హరీష్ రావు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విధానాలను, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని అసమర్ధ పార్టీ అని..హైడ్రా..మూసీ రివర్ ఫ్రంట్ నిరర్ధకమనీ..లగ చర్ల..హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఆక్రమిస్తున్నారని ..రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, ప్రజలు మోసపోయారని.. ఇంకా పలు అంశాల పై వివిధ వేదికల పైనా మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పు డు కొత్తగా పార్టీ అధినేత కొత్తగా మాట్లాడేది ఏముంటది ..??.