సాదాసీదా ‘జనధర్మ’ మహోన్నత వ్యక్తిత్వం మనకు అందించిన రెండు జ్ఞాన సిద్ధాంతాలు…

కాకతీయ కలగూర గంప – 30
image.png
తిరుమల శ్రీనివాస భక్త ముత్యం -ఆంధ్ర,ఆంగ్ల భాషా 
రత్నం శ్రీ మాడభూషి రాజగోపాలా చార్య గారు 
image.png
సాహిత్య,సాంఘిక,రాజకీయ చైతన్య మేధావి 
శ్రీ మాడభూషి శ్రీధర్‌ ‌గారు
ఒక్కసారి 1973 సంవత్సరం లోకి పోదాం. వరంగల్‌ రైల్వే స్టేషన్‌ లో రెండు నిమిషాల కోసం ఆగిన అలనాటి ప్రఖ్యాత ‘‘గోల్కొండ ఎక్స్ప్రెస్‌’ లో కోచ్‌ ‘ఈ’ లో తమ తల్లిదండ్రులను జాగ్రత్తగా ట్రైన్‌ ఎక్కించారు ఆ ఇద్దరు పిల్లలు. పెద్ద వాడు 20 ఏండ్ల యువకుడు. చిన్నవాడు ఇంకా హైస్కూల్‌ బాలుడే! ట్రైన్‌ ఎక్కిన ఆ భార్యాభర్తలు ఆ రిజర్వుడ్‌ రెండవ తరగతి కంపార్ట్మెంట్‌ లో టికెట్‌ పైన సూచించిన తమ సీట్ల నంబర్లు వెదుక్కుంటూ ముందుకు మెల్లిగా సాగారు. అప్పటికే ఆ రెండు సీట్లలో ఒక సీట్‌ లో ఒక 40 ఏండ్ల భారీకాయ వ్యక్తి కూర్చునివున్నాడు. ‘ఈ రెండు సీట్లు మాకు రిజర్వ్‌ చేశారు’ అని మెల్లిగా తెలిపాడు టికెట్లు చూపిస్తూ ఆ ముతక ఖద్దరు ధోతీ, లాల్చీ, భుజాన కండువా, ముఖానికి తీర్చిదిద్దిన నిలువు నామధారణం కలిగిన ఆ సామాన్య వ్యక్తి. ‘ఐతే ఏమిటి? నేను బెజవాడ నుండి వస్తున్నాను. సరే కూర్చొండి’ అని కొద్దిగా పక్కకు జరిగింది ఆ భారీకాయం . ఆ కొద్ది ఖాళీ స్థలంలో భార్యను కూర్చుండబెట్టి తను ఆ వ్యక్తి ప్రక్కన సర్దుకున్నాడు 50 ఏండ్ల ఆ నెమ్మది సామాన్యుడు. ఇక వారి సికింద్రాబాద్‌ పయనం ఇరుకు ఇరుకుగా సాగిందని చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆ తోటి ప్రయాణికులు ఈ చోద్యం చూశారు తప్ప వీరికి సహకరించలేదు.
రెండు రోజుల తరువాత ఆ దంపతులు వరంగల్‌ తిరిగివచ్చారు. మరో రెండు రోజుల తరువాత వెలువడిరది అలనాటి ప్రఖ్యాత వారపత్రిక ‘జనధర్మ’’ ఆ వారపు సంచిక. మొదట పేజీ లోనే ఈ రైలు సంఘటన కూలంకషంగా తెలుపుతూ అప్పటి తెలంగాణా లో జరగబోయే పరిణామాల ను వివరిస్తూ ఘాటుగా రాసిన వ్యాసం ‘‘ ముల్కీ రూల్స్‌ పోయి వేరే ఏ ఫార్ములా వచ్చినా మన గతి ఇలాంటి ఇరుకే!’ అప్పటి ఆ వ్యాసం ఎంతో మందిని ఆకట్టుకుంది వారిలో ఆలోచనలు రేకెత్తించింది. రాసింది పైన ఆ సామాన్య ముతక ఖద్దరు ప్రయాణికుడే. ఇక ప్రచురించిన ఆ పత్రిక సంపాదకుడు ప్రఖ్యాత జర్నలిస్టు, రచయిత, విమర్శకుడు, వరంగల్‌ ప్రజలు అమితంగా గౌరవించే అసామాన్య వ్యక్తి. ఆ ‘గోల్కొండ ట్రైన్‌’ సామాన్య ప్రయాణీకుడు, ఈ ‘ జనధర్మ’ అసామాన్య సంపాదకుడు ఒక్కరే – శ్రీ ఎమ్‌ ఎస్‌ ఆచార్య గారు. ఆచార్య గారి కలం ‘వాడీ, వేడీ’, అది కాగితం మీద పేర్చిన అక్షరాల ‘ కూర్పు, నేర్పు’ , ముద్రింపబడ్డ ఆ అక్షర సముదాయ వ్యాసం చదివిన ప్రజల కు కలిగిన ‘మోదం, క్రోధం’ వర్ణనాతీత విశేషాలు.
ఈ ట్రైన్‌ ఉదంతం కేవలం మా ఊహ మాత్రమే. ఆ మహోన్నత జర్నలిస్టు, సామాన్య జీవితం యెట్లా గడిపేవాడనే దానికి నిదర్శనంగా మీకు తెలిపాం. ఇక తల్లిదండ్రులను ట్రైన్‌ యెక్కించిన పెద్ద కుమారుడు రాజగోపాలాచార్య గారు తండ్రి లాగే కీర్తి కండూతి లేని మృదు స్వభావుడు. సాహితీ రంగంలో తన పని తాను చేసుకుంటూ ఉలుకూపలుకూ ఎరుగని రచయితగా వెంకటేశ్వర సాన్నిహిత్యం పొంది తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ సాహితీవేత్తగా గుర్తింపు పొందారు. ఆంగ్ల భాషా బోధకుడుగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల ఆదర్శ గురువు, అన్నమయ్య తెలుగు సంకీర్తనల వివరణోత్తముడిగా గుర్తింపు పొందిన భక్తాగ్రేసరుడు.
ఇక ఆ రెండవ బాలుడు మాడభూషి శ్రీధర్‌ గారు ఎందరికో తెలిసిన ప్రముఖ వ్యక్తి. ఢల్లీికి పోయి సమాచార కమిషనర్‌ గా ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన వరంగల్‌ వాసి. న్యాయ శాస్త్ర బోధకుడుగా హైదరాబాద్‌ లో, ఢల్లీిలో న్యాయ కళాశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పిన అభిమాన ఆచార్యుడు. అలనాటి ‘ఉదయం’ వార్తాపత్రికలో తన కలం సిరా వేసిన వ్యాస రచనలతో మంచి జర్నలిస్టుగా గుర్తింపు పొందాడు. ఈనాటికీ అనేక వార్తాపత్రికల్లో అనేక విషయాలపై తన రచనా వైదుష్యం చూపిస్తూ తండ్రి వారసత్వాన్ని కొనసాగుస్తూ ఎందరో అభిమానులకు ఆదర్శ రచయితగా వుంటున్నారు,ఈ ఇద్దరు ‘‘జన ధర్మ’’ వారసులకు, వారి అద్భుత రచనా విన్యాసాలకు, పితృ సేవానుగ్రహ ఆదర్శ జీవన విధానానికి మా అభినందనలు.
తనయులు ఇద్దరూ తండ్రి దగ్గర నేర్చుకున్న ముఖ్య విషయాలు ‘‘సాంఘిక అవగాహన’’ మరియు ‘‘సామాజిక చ్కెతన్యం’’. విద్యార్థిదశ లోనే పత్రికా నిర్వాహణ, ముద్రణాలయ ( కంపోజింగ్‌ స్టిక్‌ లో లోహపు అక్షరాల కూర్పు, ప్రూఫ్‌ రీడిరగ్‌ లాంటి) వివిధ పనులు నేర్చుకొనడం వల్ల రచనా ప్రక్రియలో అవగాహన, సాహిత్యం పై అభిమానం, ప్రెస్‌ లో పనిచేస్తున్న తోటి మిత్ర కార్మికులపై అనురాగం పెంపొందించుకున్నారు. మెడికల్‌ డాక్టర్‌ కావాలని అనుకున్న రాజ గోపాలాచార్యగారు ఆంగ్ల సాహిత్య డాక్టర్‌ అయ్యారు. తెలుగు, ఆంగ్ల సాహిత్య రంగాలలో వివిధ పరిశోధనలు సాగించి తిరుమలేశుడి అనుగ్రహం పొంది స్వామి వారిపై రూపొందించిన సాహిత్య పరిశోధన గావించారు. శ్రీధర్‌ గారు సాహిత్య, రాజకీయ, న్యాయ సంబంధిత విషయాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని రచనలు చేస్తున్నారు. ఇద్దరికీ తిరుమలేశడిపై అత్యంత భక్తి, చుట్టూ వున్న సమాజంపై అవగాహన, నీతి నియమాల జీవనంపై అనురక్తి వున్నాయి. మన మధ్యనే వుండి మనను చైతన్య పరస్తున్న ఈ ఇద్దరూ ఆ అసామాన్య ధన్యజీవి ‘జనధర్మ అయ్యగారు మనకు అందించిన ‘రెండు పారిజాత పుష్పాలు’.
` శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
` పాములపర్తి నిరంజన్‌ రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page