అహం స్వ వినాశనానికి దారితీయడమే కాకుండా, సమాజ వికాసానికి కూడా అడ్డుకట్టగా మారుతుంది. ప్రజ్ఞాపా టవాలు స్వయం కృషితో మాత్రమే సిద్దిస్తాయి. ఆసక్తి,పట్టుదల వలన అనితర సాధ్యమైన ప్రతిభ స్వంత మవుతుంది. ఎలాంటి కృషి లేకుండా వడ్డించిన విస్తరిలా ప్రతిభ మన ముంగిట వాలదు. ప్రతిభను ప్రపంచానికి వెల్లడి కాకుండా అడ్డుకోవడం వలన అంతిమంగా నష్టమే వాటిల్లుతుంది.ఇతరులలోని ప్రతిభను గుర్తించి,ప్రోత్సహించడం వలన సమాజానికి మేలు జరుగుతుంది. ప్రతిభకు ఎల్లలు లేవు. భాషాబేధాలు అడ్డురావని విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ నిరూపించాడు.
నేడు రవీంద్రనాథ్ టాగోర్ జయంతి
అనితర సాధ్యమైన ప్రతిభతో, సహజసిద్ధమైన వాతావరణంలో పెరిగి, తనకు నచ్చిన విధంగా తనను తాను తీర్చుదిద్దుకుంటూ ప్రకృతి ఒడిలో పాఠాలు నేర్చుకుని జనం మెచ్చే విధంగా కవితలు వ్రాసి, రచనలు చేసి విశ్వకవిగా వినువీధుల్లో భారతీయ కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన రవీంద్రుని అపార మేథస్సును ప్రశంసించడానికి ఉపమానాలు చాలవు.సాహితీ వినీలాకాశంలో కీర్తి పతాకం మన విశ్వకవి రవీంద్ర నాథ్ టాగోర్ .ఒక కలం,ఒక గళం,ఒక పదమై, ఒక పాటై,ఒక సంగీతమై, కవిత్వమై,రచనా వ్యాసంగమై కేవలం వంగ భూమినే కాకుండా యావత్ భారతాన్ని, ప్రపంచాన్ని అలరించింది. రవీంద్ర నాథ్ టాగోర్ ను సాహితీ వినీలాకాశంలో ధృవతారగా నిలబెట్టింది.విశ్వకవిగా పేరు గడించిన రవీంద్ర నాథ్ టాగోర్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణించాడు.కవిగా,రచయితగా,సంఘసం స్కర్తగా బహుముఖ పాత్ర పోషించాడు. అనితర సాధ్యమైన ప్రజ్ఞాపాటవాన్ని ప్రదర్శించాడు. బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా గళమెత్తాడు.బెంగాల్ పునరుజ్జీవన ఉద్యమంలో కీలక భూమిక పోషించాడు. భారతదేశానికి అర్ధవంతమైన జాతీయ గీతం ‘‘జనగణమన..’’ రచీంచాడు. బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని కూడా రవీం ద్రుడు రచించాడు.ఎక్కడ ప్రతిభ ఉన్నా గుర్తించి గౌరవించడం వలన మన గొప్పతనం ప్రస్ఫుటమవుతుంది. మన వ్యక్తిత్వం సమా జానికి అవగతమవుతుంది. దుర దృష్టవశాత్తూ ఇలాంటి లక్షణాలు వర్తమాన సమాజంలో మచ్చుకైనా కానరావు.
అహం స్వ వినాశనానికి దారితీయడమే కాకుండా, సమాజ వికాసానికి కూడా అడ్డుకట్టగా మారుతుంది. ప్రజ్ఞాపా టవాలు స్వయం కృషితో మాత్రమే సిద్దిస్తాయి. ఆసక్తి,పట్టుదల వలన అనితర సాధ్యమైన ప్రతిభ స్వంత మవుతుంది. ఎలాంటి కృషి లేకుండా వడ్డించిన విస్తరిలా ప్రతిభ మన ముంగిట వాలదు. ప్రతిభను ప్రపంచానికి వెల్లడి కాకుండా అడ్డుకోవడం వలన అంతిమంగా నష్టమే వాటిల్లుతుంది.ఇతరులలోని ప్రతిభను గుర్తించి,ప్రోత్సహించడం వలన సమాజానికి మేలు జరుగుతుంది. ప్రతిభకు ఎల్లలు లేవు. భాషాబేధాలు అడ్డురావని విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ నిరూపించాడు. బెంగాలీ భాష పట్ల అమితమైన అభిమానమున్నా, ఇతర భాషల్లోని సాహిత్యాన్ని ఆస్వాదించి, అభినందించి, భారతదేశాన్ని ప్రపంచ సాహితీ రంగంలో అగ్రపథంలో నిలిపిన రవీంద్రుడు విశ్వకవిగా విశేష ఖ్యాతి నార్జించాడు. రవి గాంచని చోటును కవి గాంచునన్న నానుడిని నిజం చేసిన రవీంద్రుని ప్రతిభ అనన్య సామాన్యం. తన ఆలోచనలను కవిత్వీకరించి పాశ్చాత్య ప్రపంచానికి సైతం అందించిన ఘనత రవీంద్రునిదే.
రవీంద్రుని బాల్యమంతా దాదాపుగా ఒంటరిగానే గడిచింది. సహజ మైన విద్యకు అలవాటు పడ్డ రవీంద్రుడు స్వేచ్ఛాయుతమైన,జ్ఞాన సంపన్నమైన,భయం లేని నూతన ప్రపంచం కోసం పరితపించాడు.ప్రముఖుల రచనలను చదివాడు.ఆంగ్ల సాహిత్యంపై అభిలాష పెంచుకుని,సాహితీ ప్రసంగాలను ఆకళింపు చేసుకుని, ఎన్నో మనోరంజకమైన రచనలకు శ్రీకారం చుట్టి జనహృదయాలను రంజింపచేసాడు.తన దైన శైలితో సాహితీ ప్రపంచాన్ని అలరించాడు. బాల్యంలోనే ఒక మంచి కవిగా,రచయితగా పేరు గడించాడు. విమర్శకుల ప్రశంసలు పొందాడు.శాంతి నికేతన్ ను స్థాపించి, విద్యార్ధులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాడు.గురువులకు,విద్యార్థు లకు మధ్య అవ్యాజ్యమైన ఆత్మీయతలతో కూడిన వాతావరణాన్ని సృష్టించాడు. సాహిత్యం పట్ల,కళల పట్ల విద్యార్థులకు మక్కువ కలిగించాడు. రవీంద్రనాథ్ టాగోర్ ‘‘గీతాంజలి’’ విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. సాహిత్యంలో నోబెల్ బహుమతిని సంపాదించి పెట్టింది. భారతదేశం లోనే కాదు ఆసియాలో తొలి నోబెల్ బహుమతి గ్రహీతగా రవీంద్రునికి అవకాశం దక్కింది.’’గీతాంజలి’’ రవీంద్రుని సాహితీ వనంలో విరబూసిన మనోహరమైన కవితాసుమం.
రవీంద్రుని కావ్య శైలికి,సహజత్వానికి,చైతన్యవంతమై న,అర్ధవంతమైన ప్రపంచ నిర్మాణానికి’’ గీతాంజలి’’ఒక మచ్చుతునక. భయం నుంచి జ్ఞానం లోకి నడిపించాలని వాంఛిస్తూ,తలెత్తుకుని తిరిగే ఆత్మాభిమానాన్ని రగిలిస్తూ సాగిన ఈ రచన పాఠకులను ఉర్రూతలూగించింది.ప్రపంచం సంకుచితమైన ఇరుకైన గోడల మధ్య నలిగి పోకూడదని, జ్ఞాన ప్రవాహం ఎడారుల్లో ఇంకి పోకూడదని, అగాధాలను అధిగమించి, నిజం బయటకు రావాలనే తపనకు రవీంద్రుని గీతాంజలి అద్దం పడుతుంది.ఆంగ్ల సాహిత్యం పై అభిలాష పెంచుకుని,సాహితీ ప్రసంగాలను ఆకళింపు చేసుకుని, ఎన్నో మనోరంజకమైన రచనలకు శ్రీకారం చుట్టి జనహృదయాలను రంజింపచేసిన రవీంద్రుడు సృజనాత్మకతకు మరో పేరు.జలియన్ వాలా బాగ్ దమనకాండకు నిరసనగా నైట్ హుడ్ అవార్డును తిరస్కరించి,తనకున్న దేశభక్తిని ప్రదర్శించాడు.మాతృభూమి పట్ల గౌరవం,మాతృభాషపై మమకారం,అపారమైన దేశభక్తి గల రవీంద్రుడు మానవ సంబంధాలకు అత్యంత ప్రాధాన్యత నిచ్చేవాడు. అప్యాయతలు కనుమరుగై, మానవీయ సంబంధాలు మృగ్యమై,సాటి మనిషిని మనిషిగా చూడలేని మానసిక అంధత్వంలో,మానవత్వానికి ఘోరీ కడుతున్న వర్తమాన సమాజంలో రవీంద్రుని మానవతా విలువలను ఆదర్శంగా తీసుకోవాలి.
పత్రికలను చదవడం మానేసి, పుస్తక పఠనం వదిలేసి, సాంఘిక మాధ్యమాలు చిందించే విషాన్ని ఒంటబట్టించుకుని, అసభ్యతను,అశ్లీలతను ఆరాధిస్తూ, అసాంఘిక పోకడలతో మానవ లక్షణాలను కోల్పోతున్న నేటి మనుషుల ప్రపంచం కృత్రిమ సంస్కృతిని అలవరచుకుంటున్నది. సృజనాత్మకతను వదిలేసి, నిజమైన జ్ఞానాన్ని పరిత్యజించి, అజ్ఞానాంధకారంలో జీవిస్తున్న వర్తమాన సమాజంలో నిజమైన విద్యకు శ్రీకారం పలకాలి. అలనాటి రవీంద్రుని శాంతి నికేతన్ తరహాలో జ్ఞానాన్ని అందించే విద్యలను నేర్వాలి. ప్రకృతిని ఆస్వాదిస్తూ, ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణంలో పెరుగుతూ, పెద్దలను గౌరవిస్తూ, క్రమశిక్షణతో జ్ఞానాన్ని ప్రసాదించే చదువులను అభ్యసిస్తూ, సృజనాత్మకతను అలవరచుకుని రవీంద్రనాథ్ టాగోర్ బహుముఖ ప్రజ్ఞాపాటవాలను స్ఫూర్తిగా తీసుకుని, ఆయన ఆదర్శాలను దేశభక్తిని, మానవతావాదాన్ని పెంపొందించుకోవాలి. సహజత్వాన్ని అలవరచుకోవాలి. ప్రకృతి మధ్య జీవించడానికి అలవాటు చేసుకోవాలి.
సుంకవల్లి సత్తిరాజు
(సామాజిక విశ్లేషకులు,
మోటివేషనల్ స్పీకర్)
తూ.గో.జిల్లా, ఏపీ.
9704903463.