యం యస్‌ ఆచార్యకు స్వాతంత్య్ర సమర యోధుడనే గుర్తింపు

ఆర్యసమాజ్‌ నాయకులు, హయగ్రీవాచార్య కృషితో…

మూడు దశాబ్దాలకు పైగా జర్నలిజంలో విశిష్ట సేవలు చేసి యితరులకు మార్గదర్శకుల్కెన యం. యస్‌. ఆచార్యకు పత్రికా రచనను వృత్తిగా స్వీకరించిన వీరు వరంగల్‌ కేంద్రంగా ఆంధ్ర దినపత్రిక విలేఖరిగా, ఏజంటుగా ప్రజాసేవారంగంలోకి దిగారు. అభ్యుదయ భావాలుగల వీరు ప్రతి సమస్యను సహేతుకంగా వివరించడంలో అందెవేసిన చేయి ఎన్నో సమస్యలకు అనుభవపూర్వకము, ఆచరణాత్మకమైన పరిష్కారాల్ని సూచించారు. జనధర్మ వారపత్రికను.

వరంగల్‌ వాణి దినపత్రికను స్థాపించడం ద్వారా వీరు వరంగల్‌ పట్టణంలో జిల్లాస్థాయి పత్రికల అభివృద్ధికి శ్రీకారాన్ని చుట్టారు. యం.యస్‌. ఆచార్య మేధావి. వీరి రచనా పాటవం, నిష్పాక్షికమైన విమర్శలు అందరి ప్రశంసలను చూరగొన్నాయి. వరంగల్లు పట్టణ ప్రజలనేగాక తెలంగాణా ప్రాంతవాసుల అభిమానాన్ని ఈ పత్రికలు పొందగలిగాయని, శ్రీ ఆచార్య సతఃస్సిద్ధమైన జర్నలిస్టేగాక అందరికి ఉత్తమ మిత్రుడు అని  యం యస్‌ ఆచార్యను అభిమానించేవారని అభినందన సంచిక ప్రచురించిన ఇందుర్తి ప్రభాకర్‌ గారు రాసారు.

1988లో యం యస్‌ ఆచార్యకు షష్టి పూర్తి సందర్భంలో, ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. ఇద్దరు ముగ్గురు పాత్రికేయులు వివరాలు సేకరించారు. వారిలో ఒకరిగా ఈ రచయిత ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంలో ‘‘మరి మీకు స్వాతంత్య్రం సమర యోధుడని గుర్తింపు రావాలి కదా’’ అని అడిగాను. ‘‘నేను జైలుకు వెళ్లలేదు. కనుక నాకు ఆ గుర్తింపు ఉండదు అనుకున్నాను’’ అని ఆచార్యగారు చెప్పారు. అప్పడికి షరతులు కొన్ని సవరించిన తరువాత, నిజాం విముక్తి పాల్గొన్నారని వివరాలు నిజం తెలిసింది. హైదరాబాద్‌ ఆర్య సమాజ్‌ నేతలు ఆ వివరాలన్నీ సంబంధిత కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ సంఘానికి పంపించారు. ‘‘మీకెందుకు రాదు’’ అని మిత్రులు కవి పల్లాకోటార్య, నరసింహార్య మొదలైన అంటూ అందుకు కావలసిన పత్రాలను సేకరించారు. తెలంగాణ బయటనుంచి కార్యక్రమాలు చేసిన బార్డర్‌ కాంప్‌ నాయకులకు పూర్తిగా తెలుసు. వారిలో కాంగ్రెస్‌ మాజీ మంత్రి, వరంగల్‌ రాజకీయ నాయకుడు తిరువరంగం హయగ్రీవాచార్య కాంప్‌ నాయకులుగా కూడా ఉన్నారు. ఆయన రాసిన లేఖలో ఈ వివరాలు ఉన్నాయి.

‘‘ప్రజాస్వామ్య జీవన విధాన ప్రగతికి, అభి వృద్ధికి పత్రికా సంపా దకులుగా వీరి సేవలు ఆవశ్యకమైనవి. వీరి ఆలోచనా సరళి, దృక్ప ధం నిర్మాణా త్మక మైనవి, సమాజంలోని బాధితులు, బడుగు వరా ్గల సమస్యలను తమ పత్రికల ద్వారా ప్రభుత్వ దృష్టికి, అధికారుల దృష్టికి తెచ్చి. వాటి పరిష్కారానికి తోడ్పడుచున్నారనీ చెప్పారు’’ అని మాజీ మంత్రి, వరంగల్లు రాజకీయ నాయకకుడు, తిరువరంగం హయగ్రీవాచార్య, స్వాతంత్య్ర సమరయోధుల కమిటీ అధ్యక్షులు రాసారు. ఆయన ఇంగ్లీషులో రాసిన లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వివరాలు అంద జేసారు.  వరంగల్‌ వాణి కేవలం వరంగల్‌ పట్టణానికే పరిమితమైనదికాదు.

వరంగల్లు కేంద్రంగా కల తెలంగాణా వాణి, జనధర్మ ప్రజాజీవన ధర్మాన్ని ప్రతిబింబించే వార పత్రికా దర్పణం. ఈ పత్రిక ద్వారా రైతులు, వర్తకులు, కార్మికులు ఉపాధ్యాయులు, ఒకరేమిటి సమాజంలోని, అన్ని వర్గాలకు సేవచేస్తున్న శ్రీ ఎం.ఎస్‌. ఆచార్య శ్లాఘనీయులు. వీరికి ప్రజలు అన్నివిధాల తోడ్పడవలసిన అవసరం ఉన్నది. శ్రీ ఆచార్య సతఃస్సిద్ధమైన జర్నలిస్టేగాక అందరికి ఉత్తమ మిత్రుడు. ఇంకా వీరు కలకాలం తమ పత్రికల ద్వారా ప్రజాసేవ చేస్తూ జర్నలిజం అభివృద్ధి సాధనంగా వెలగాలని కోరుతూ ఈ శుభసమయాన నా శుభాకాంక్షలను అందచేస్తున్నాను అని మార్చి 1988 నాటి అభినందన సంచికలో హయగ్రీవాచార్య అన్నారు.

పాత్రికేయ ఉద్యమ సైనికుడు
శ్రీ మాడభూషణం శ్రీనివాసాచార్య, హైదరాబాదు రాష్ట్ర విమోచన పోరాట కాలంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమ సాహిత్యాన్ని, వార్తా పత్రికలను ప్రజలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఆ రోజులు రజాకార్ల అమానుషత్వం సామాన్యుల జీవితాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న కాలం. ఖమ్మం వరంగల్‌ లాంటి ప్రాంతాల్లో చాలామంది కుటుంబాలు విజయవాడ పొలిమేరలకు పారిపోయాయి అని ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు, బార్డర్‌ ద్వారా విమోచన పోరాట నాయకుడుగా పనిచేసిన శ్రీ టి హయగ్రీవాచార్య వారి  వ్యాసంలో వివరించారు.

అందులో ఇచ్చిన వివరాలు వొచ్చే వారం ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page