కార్మిక వర్గానికి కెటిఆర్ మేడే శుభాకాంక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1: కార్మికుల రెక్కల కష్టం జాతి సంపదను సృష్టిస్తున్నదని, వారి త్యాగం వెలకట్టలేనిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కార్మికుల త్యాగాలకు నివాళిగా, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతామని చెప్పారు. మేడే సందర్భంగా కార్మిక సోదరులకు, శ్రామిక లోకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మేడే స్ఫూర్తితో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కార్మిక హక్కుల కోసం అడుగడుగునా నిలిచిందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. చారిత్రాత్మక మేడే స్ఫూర్తితో, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కార్మిక హక్కుల కోసం అడుగడుగునా నిలిచింది. సింగరేణి శ్రామికులకు బోనస్లు, ఉద్యోగ భద్రత, మెరుగైన సౌకర్యాలతో గౌరవించాం.
టీ-స్ఆర్టీసీ కార్మికులకు జీత భత్యాల పెంపు, ఆరోగ్య బీమా వంటి సంక్షేమ పథకాలతో భరోసా కల్పించాం. ఆటో డ్రైవర్లు, అసంఘటిత కార్మికులకు ఆర్థిక సహాయం, సంక్షేమ బోర్డులతో అండగా నిలిచాం. తెలంగాణను పారిశ్రామిక ఆదర్శంగా నిలబెట్టి, లక్షల మందికి ఉద్యోగాలు సృష్టించాం. మహిళా కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలు, భద్రత కల్పించి సాధికారతను పెంచాం. కార్మికుల త్యాగాలకు నివాళిగా, హక్కుల కోసం నిరంతరం పోరాడతాం. ఈ మేడే స్ఫూర్తితో కార్మిక ఐక్యత, సమానత్వం కోసం కలిసి నడుద్దాం!’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.